IPL Playoffs Race: ఉత్కంఠగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. ఢిల్లీ, బెంగళూరులో ఏజట్టుకు ఛాన్స్? పూర్తి లెక్కలు ఇవిగో..
IPL Playoffs Race: IPL 2024 ప్లేఆఫ్ల రేసులో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ బలమైన పోటీదారులుగా కనిపిస్తున్నాయి. రెండు జట్లు పాయింట్ల పట్టికలో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇరు జట్లు 11 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు ఒక్క మ్యాచ్ గెలిచిన వెంటనే ప్లేఆఫ్కు చేరుకుంటుంది. దీంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ప్లేఆఫ్ల కోసం గట్టి పోటీ నెలకొంది.
IPL Playoffs Race: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫుల్ జోష్లో ఉంది. ఈ IPL సీజన్ 2024లో, అనేక రికార్డులకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ప్రస్తుత ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 542 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా 18 వికెట్లతో అందరికంటే ముందున్నాడు. ఈసారి ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది. వచ్చే టీ20 ప్రపంచకప్లో బాగా ఆడి తమ తమ జట్లను మ్యాచ్లో గెలిపించడమే ప్రతి ఆటగాడి లక్ష్యంగా మారింది. అయితే, ఐపీఎల్లో ప్లేఆఫ్ల పోరు కొనసాగుతోంది. IPL 2024లో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. అందులో టాప్ 4 జట్లు మాత్రమే ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకుంటాయి.
ఎవరు గెలుస్తారు?
IPL 2024 ప్లేఆఫ్ల రేసులో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ బలమైన పోటీదారులుగా కనిపిస్తున్నాయి. రెండు జట్లు పాయింట్ల పట్టికలో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇరు జట్లు 11 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు ఒక్క మ్యాచ్ గెలిచిన వెంటనే ప్లేఆఫ్కు చేరుకుంటుంది. దీంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ప్లేఆఫ్ల కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ నాలుగు జట్లు తలా 12 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్నందున రేసులో ముందుంది. హైదరాబాద్, చెన్నై, లక్నో ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మూడు జట్లూ తమ అన్ని మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లకు చేరుకోవాలనుకుంటున్నాయి. ఇది కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్కు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ ముందుకు వెళ్లాలంటే 2 మ్యాచ్లలో 2 గెలవడం తప్పనిసరిగా మారింది.
ప్లేఆఫ్ల సమీకరణం..
ఐపీఎల్ ప్లేఆఫ్లు మే 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు సెమీఫైనల్, ఫైనల్స్లో చోటు కోసం ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. ప్రతి జట్టు IPLలో మొత్తం తలో 14 మ్యాచ్లను కలిగి ఉంటుంది. ప్రతి విజయంతో 2 పాయింట్లను పొందుతుంది. 14 మ్యాచ్ల్లో ఏ జట్టు ఎక్కువ పాయింట్లు సాధిస్తుందో ఆ జట్టు చివరికి ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుంది. జట్లకు సమాన పాయింట్లు ఉన్నప్పుడు, మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు అర్హత పొందుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..