IPL 2024: ధనాధన్ లీగ్లో నో డీఆర్ఎస్.. ఓన్లీ ఎస్ఆర్ఎస్.. బీసీసీఐ సరికొత్త ప్రయోగం.. ఎలా పనిచేస్తుందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ప్రారంభానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 22న ప్రారంభమ్యే ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి ఐపీఎల్ లో డిసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS)కు బదులుగా స్మార్ట్ రీప్లే సిస్టమ్ (SRS)ను ఉపయోగించనున్నారు. అంపైరింగ్ నిర్ణయాల్లో లోపాలను సరిదిద్ది మరింత పారదర్శకత తెచ్చేందుకు బీసీసీఐ దీనిని అమల్లోకి తీసుకొచ్చింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ప్రారంభానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 22న ప్రారంభమ్యే ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి ఐపీఎల్ లో డిసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS)కు బదులుగా స్మార్ట్ రీప్లే సిస్టమ్ (SRS)ను ఉపయోగించనున్నారు. అంపైరింగ్ నిర్ణయాల్లో లోపాలను సరిదిద్ది మరింత పారదర్శకత తెచ్చేందుకు బీసీసీఐ దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. స్మార్ట్ రీప్లే సిస్టమ్ని ఉపయోగించడం ద్వారా వేగంగా, మరింత ఖచ్చితమైన ఫలితాలు రానున్నాయి. మరో మాటలో చెప్పాలంటే, DRS నిర్ణయాల్లో కనిపించినంత గందరగోళం ఇందులో ఉండదు. తద్వారా థర్డ్ అంపైర్ వెంటనే తమ నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది. DRS వలె, ఇక్కడ కూడా ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు నివేదిస్తాడు. కానీ ఈసారి టీవీ డైరెక్టర్ ఇన్పుట్ కోసం థర్డ్ అంపైర్ వేచి ఉండడు. బదులుగా, హాక్-ఐ ఉపకరణాల సహాయంతో వారే వెంటనే తీర్పును ప్రకటిస్తారు. స్మార్ట్ రీప్లే సిస్టమ్ కింద, టీవీ అంపైర్ నేరుగా ఇద్దరు హాక్-ఐ ఆపరేటర్ల నుండి ఇన్పుట్లను స్వీకరిస్తారు. ఈ ఆపరేటర్లు కూడా అంపైర్తో కలిసి ఒకే గదిలో పని చేస్తారు. హాక్-ఐ ఎనిమిది హై-స్పీడ్ కెమెరాల ద్వారా సంగ్రహించబడిన చిత్రాలను అంపైర్కు అందించడం ఈ ఆపరేటర్ల ప్రధాన పని. ఇప్పటి వరకు థర్డ్ అంపైర్, హాక్-ఐ ఆపరేటర్ల మధ్య అనుసంధాన కర్తలుగా ఉన్న టీవీ డైరెక్టర్లు ఈ కొత్త విధానంలో ఉండరు.
ఎలా పనిచేస్తుందంటే?
థర్డ్ అంపైర్ స్మార్ట్ రీప్లే సిస్టమ్ని ఉపయోగించి వీడియోను విభిన్న కోణాల నుండి సమీక్షించవచ్చు. హాక్-ఐ ఆపరేటర్లు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్లను ఉపయోగించనున్నారు. దీని నుండి, ఏదైనా నిర్ణయం వెంటనే తీసుకోవడానికి సంబంధిత స్క్రీన్ సహాయం తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక ఫీల్డర్ బౌండరీ లైన్లో క్యాచ్ తీసుకున్నాడనుకుందాం. ఈ సందర్భంలో, ఫీల్డర్ కాలు బౌండరీ లైన్ను తాకిందో లేదో తెలుసుకోవడానికి, కాలు భాగం వీడియోను వెంటనే స్ప్లిట్ స్క్రీన్లో తనిఖీ చేయవచ్చు. అలాగే, పాదంలో ఏ భాగం బౌండరీ లైన్ను తాకింది అన్నది కూడా తెలుస్తుంది. తద్వారా మరింత స్పష్టమైన తీర్పును ఇవ్వడం సాధ్యమవుతుంది. ఇంతకు ముందు టీవీ అంపైర్కి ఇంత స్పష్టమైన విజువల్స్ అందుబాటులో ఉండేవి కాదు.
కెమెరాలు ఎక్కడ ఉంటాయంటే?
ఐపీఎల్లోని ప్రతి మ్యాచ్లో ఎనిమిది హాక్-ఐ కెమెరాలను ఉపయోగిస్తారు. బౌండరీల దగ్గర నాలుగు, వికెట్ స్క్వేర్ తర్వాత నాలుగు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా స్టంపింగ్లు, రనౌట్లు, క్యాచ్లు, ఓవర్త్రోల దృశ్యాలను ఈ కెమెరాలు బంధించనున్నాయి. విశేషమేమిటంటే, హాక్-ఐ కెమెరాలు సెకనుకు దాదాపు 300 ఫ్రేమ్ల వేగంతో రికార్డ్ చేస్తాయి. అంటే అంపైర్లకు తమ నిర్ణయాన్ని ప్రకటించడానికి పలు ఆప్షన్లు ఉంటాయి. అలాగే, థర్డ్ అంపైర్ స్పష్టమైన చిత్రంతో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం ఐపీఎల్లో స్మార్ట్ రీప్లే సిస్టమ్ విజయవంతమైతే, రాబోయే రోజుల్లో బీసీసీఐ, ఐసీసీ అన్ని టోర్నీల్లో ఎస్ఆర్ఎస్ను ఉపయోగిస్తాయనడంలో సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








