AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల్లో టికెట్ లభించలేదు, పీ.సీ .థామస్ నేతృత్వంలోని ‘కేరళ కాంగ్రెస్’ అలక, ఎన్డీయేకి గుడ్ బై

కేరళ ఎన్నికల్లో పీ.సీ.థామస్ నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ కి   టికెట్లు లభించలేదు. దీంతో ఈ వర్గం ఎన్డీయేకి గుడ్ బై చెప్పింది.  ఏప్రిల్ 6 న జరిగే ఎన్నికలకు బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి తమకు ఒక్క సీటైనా కేటాయించలేదని మాజీ కేంద్ర మంత్రి పీ.సి.థామస్ ఆరోపించారు.

ఎన్నికల్లో టికెట్ లభించలేదు,  పీ.సీ .థామస్ నేతృత్వంలోని 'కేరళ కాంగ్రెస్'  అలక, ఎన్డీయేకి గుడ్ బై
Pc Thomas
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 17, 2021 | 3:50 PM

Share

కేరళ ఎన్నికల్లో పీ.సీ.థామస్ నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ కి   టికెట్లు లభించలేదు. దీంతో ఈ వర్గం ఎన్డీయేకి గుడ్ బై చెప్పింది.  ఏప్రిల్ 6 న జరిగే ఎన్నికలకు బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి తమకు ఒక్క సీటైనా కేటాయించలేదని మాజీ కేంద్ర మంత్రి పీ.సి.థామస్ ఆరోపించారు.  తమను ఈ కూటమి పక్కన బెట్టిందని కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక తాముసీనియర్ నేత పీ.జే.జోసెఫ్ నాయకత్వాన గల  కేరళ కాంగ్రెస్ లో విలీనమవుతామని ఆయన చెప్పారు. (ఈ వర్గం యూడీఎఫ్ లో భాగంగా ఉంది).  2016 లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ 4 సీట్లకు పోటీ చేసిందని, కానీ ఈ సరి తమకు పార్టీ మొండిచెయ్యి చూపిందని థామస్ అన్నారు. పాలా నియోజకవర్గం నుంచి పోటీ చేయవలసిందిగా బీజేపీ తనను కోరిందని, అయితే తన కుమారుడితో క్యాన్సర్ లక్షణాలు కనబడినందున తాను ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టలేనని తెలిపానని ఆయన చెప్పారు.  మేము కోరిన ఇతర స్థానాలను ఇచ్చేందుకు కూడా ఆ పార్టీ నిరాకరించిందని ఆయన తెలిపారు. దీంతో ఇక వైదొలగాలని తాము నిర్ణయించుకున్నామన్నారు. 2004 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో థామస్..మువత్తుపుల  నియోజకవర్గం నుంచి  ఎన్డీయే టికెట్ పై పోటీ  చేసి గెలుపొందారు.

లోగడ ఏబీ వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఆయన న్యాయశాఖ సహాయ  మంత్రిగా వ్యవహరించారు.

తమిళనాడు ఎన్నికల్లో  డీఎంకే అభ్యర్థి భలే హామీ

ఇలా ఉండగా తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ఒకరు భలే హామీ ఇఛ్చారు.  తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో ఇసుక మైనింగ్ కి అనుమతులిస్తామని సెంథిల్ బాలాజీ అనే అభ్యర్థి కొత్త వాగ్దానం చేశారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా దీన్ని అడ్డుకున్న పక్షంలో ఆ అధికారిని తొలగిస్తామని ఆయన చెప్పారు. డీఎంకే నేత స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేసిన 5 నిముషాల్లోనే ఈ చర్య తీసుకుంటామన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: రైతులకు వంద శాతం రుణమాఫీ చేస్తాం.. ఉభయ సభలనుద్ధేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

MiG-21 Crash: కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. గ్రూప్ కెప్టెన్ మృతి.. విచారణకు ఆదేశించిన వాయుసేన

Follow Us
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో