AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి వైదొలిగిన సిపి రాధాకృష్ణన్.. గుజరాత్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. ఆచార్య దేవవ్రత్ గుజరాత్ బాధ్యతతో పాటు మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను కూడా నిర్వహిస్తారు.

మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి వైదొలిగిన సిపి రాధాకృష్ణన్.. గుజరాత్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
Cp Radhakrishnan Resigned
Balaraju Goud
|

Updated on: Sep 11, 2025 | 4:03 PM

Share

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. ఆచార్య దేవవ్రత్ గుజరాత్ బాధ్యతతో పాటు మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 12న సీపీ రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి భవన్ అందించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ 452 ఓట్లు పొందారు.

మంగళవారం (సెప్టెంబర్ 10) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంట్ హౌస్‌లో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత ఓట్లు లెక్కించారు. ఇందులో సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ పడ్డారు.

ఎన్నికల సంఘం ప్రకారం, ఉపరాష్ట్రపతి ఎన్నికకు మొత్తం ఓటర్ల సంఖ్య 788. అందులో 7 ఖాళీలు ఉన్నందున, ఓటర్ల సంఖ్య 781. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 768 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 13 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఉమ్మడి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.

సీపీ రాధాకృష్ణన్ జూలై 31, 2024న మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా, ఉన్నత విద్య నాణ్యత, గ్రామీణాభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా మారడానికి ముందు, ఆయన జార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1998లో, ఆయన మొదటిసారి కోయంబత్తూరు నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో ఆయన మళ్ళీ ఎంపీగా గెలుపొందారు. బీజేపీలో అనేక పదవులు నిర్వహించారు. రాధాకృష్ణన్ 1957లో తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి