AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: వారెవ్వా.. క్యా జోడి హై.. ధనుష్ సరసన 300 కోట్ల హీరోయిన్.. ఇక బొమ్మ బ్లాక్ బస్టరే..

కోలీవుడ్ హీరో ధనుష్ ఇప్పుడు వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషలలో చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో దాదాపు 3 సినిమాలు సెట్స్ పై ఉన్నట్లు సమాచారం. అయితే తాజాగా ధనుష్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

Dhanush: వారెవ్వా.. క్యా జోడి హై.. ధనుష్ సరసన 300 కోట్ల హీరోయిన్.. ఇక బొమ్మ బ్లాక్ బస్టరే..
Dhanush D55
Rajitha Chanti
|

Updated on: Sep 05, 2025 | 2:58 PM

Share

కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోలలో ధనుష్ ఒకరు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, నిర్మించారు. తమిళ సినిమాలో ఆయన చివరిగా విడుదలైన చిత్రం నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ (తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా). ఈ చిత్రం ఫిబ్రవరి 2025లో విడుదలైంది. దీని తర్వాత, నటుడు ధనుష్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన తమిళం, తెలుగు, హిందీ వంటి భాషల్లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన నటించిన ఇడ్లీ కడై చిత్రం అక్టోబర్ 1, 2025న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..

ఇవి కూడా చదవండి

తాజాగా అమరన్ సినిమాతో హిట్టు అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం D55 చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతుండగా, ఈ చిత్రంలోని నటి గురించి సమాచారం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇటీవలే వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన మీనాక్షి చౌదరి ఈసారి ధనుష్ సరసన జతకట్టనుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాను గోపురం ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..

ధనుష్ ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న D54 చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలై 2025లో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నటి మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన డి56 చిత్రానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..