AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది నా జీవితంలో ఒక మచ్చ.. ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ అనేవి చాలా కామన్.. కొంతమంది ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ నడిపి ఆతర్వాత మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది సింగిల్ గానే ఉండిపోతున్నారు. ఇక మరికొంతమంది క్రికెటర్స్ తో కూడా ఎఫైర్స్ పెట్టుకున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు.

అది నా జీవితంలో ఒక మచ్చ.. ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
Ms Dhoni
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2025 | 3:46 PM

Share

టాలీవుడ్ లో ఈ అమ్మడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టింది. నిజానికి హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ వయ్యారి భామ. కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యింది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? స్టార్ హీరోలతో స్టెప్పులేసింది.. అలాగే స్టార్ క్రికెటర్స్ తో ఎఫైర్స్ పెట్టుకుంది ఈ భామ.

ఇది కూడా చదవండి :ఏంటీ.. ఈ జబర్దస్త్ కమెడియన్ ప్రభాస్ ఫ్రెండా..!! ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే

గతంలో ఆమె ఓ స్టార్ క్రికెటర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆ భామ ఎవరంటే.. రాయ్ లక్ష్మి 2005లో తమిళ చిత్రం “కర్క కసదర”తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది కన్నడ చిత్రం “వాల్మీకి” లో శివ రాజ్‌కుమార్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో “కంచనమాల కేబుల్ టీవీ”, “నీలి మేఘం”, “బలుపు” వంటి చిత్రాలలో నటించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : హీరోయిన్స్‌కు మించిన అందం..! ఛత్రపతి శేఖర్ భార్యను చూశారా..? ఏ మూవీస్‌లో నటించారంటే

పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణలాంటి స్టార్ హీరోలతో స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించింది. నటి రాయ్ లక్ష్మీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో తనకు గతంలో ఉన్న రిలేషన్‌షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాయ్ లక్ష్మీ ధోనితో తన సంబంధాన్ని “ఒక మచ్చ”గా అభివర్ణించింది. భవిష్యత్తులో తన పిల్లలు ఈ విషయం గురించి ప్రశ్నిస్తే తాను ఎలా సమాధానం చెప్పాలోనని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే గతంలో ధోనితో తనకు సంబంధం ఉందని వచ్చిన వార్తలను తవ్వి తీస్తున్నారని, ఇంటర్నెట్‌లో ఈ విషయాలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయని రాయ్ లక్ష్మీ అసహనం వ్యక్తం చేసింది. ఈ పిచ్చి ప్రచారాన్ని దూరం పెట్టాలని కోరింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశా.. కానీ రెండేళ్లు నన్ను దూరం పెట్టాడు: రాజారవీంద్ర

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.