AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైలేజ్‌ ఎక్కువ రావాలంటే కారు ఎంత స్పీడ్‌లో నడపాలో తెలుసా?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన ఆదాకు సరైన కారు వేగం ముఖ్యం. గంటకు 80-95 కిలోమీటర్లు ఆదర్శం. అధిక వేగం (70 మైళ్ల పైన) గాలి నిరోధకత వల్ల ఇంధన వినియోగాన్ని 9-25 శాతం పెంచుతుంది. తక్కువ వేగం, తప్పు గేర్‌లు కూడా మైలేజీని తగ్గిస్తాయి.

మైలేజ్‌ ఎక్కువ రావాలంటే కారు ఎంత స్పీడ్‌లో నడపాలో తెలుసా?
Fuel Efficiency Tips
SN Pasha
|

Updated on: May 16, 2026 | 9:30 PM

Share

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇప్పుడు మైలేజీపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. చాలా మంది వేగంగా వెళ్తే సమయం ఆదా అవుతుందని భావించినా, అధిక వేగం ఇంధన ఖర్చును గణనీయంగా పెంచుతుందని ఆటో నిపుణులు చెబుతున్నారు. సరైన వేగంతో కారు నడిపితే ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు గంటకు 80 నుంచి 95 కిలోమీటర్ల వేగం అత్యంత అనుకూలం. ఈ వేగంలో ఇంజిన్‌పై అధిక ఒత్తిడి ఉండదు. అలాగే గాలి నిరోధకత కూడా తక్కువగా ఉండటంతో ఇంధన వినియోగం నియంత్రణలో ఉంటుంది.

అయితే వేగం గంటకు 110 కిలోమీటర్లకు చేరిన తర్వాత ఇంధన వినియోగం వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 110 కిలోమీటర్ల వేగంలో దాదాపు 9 శాతం ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందని అంచనా. అదే 130 కిలోమీటర్ల వేగంతో నడిపితే ఇంధన వినియోగం 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గాలి నిరోధకత. వాహనం వేగం పెరిగే కొద్దీ గాలి ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. ఆ ఒత్తిడిని అధిగమించేందుకు ఇంజిన్‌ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. ఫలితంగా పెట్రోల్‌ లేదా డీజిల్‌ వినియోగం పెరుగుతుంది.

అదే సమయంలో చాలా తక్కువ వేగంతో ఎక్కువసేపు డ్రైవ్‌ చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ గేర్‌లో ఎక్కువసేపు వాహనం నడిస్తే ఇంజిన్‌ ఆర్‌పీఎం పెరిగి ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి వాహనం వేగం పెరిగిన వెంటనే సరైన గేర్‌లోకి మార్చడం అవసరం. హైవేపై క్రూయిజ్‌ కంట్రోల్‌ ఉపయోగించడం కూడా ఇంధన ఆదాకు దోహదపడుతుంది. ఇది వాహనాన్ని ఒకే వేగంతో నడిపేలా చేస్తుంది. తరచూ బ్రేక్‌లు వేయడం, ఒక్కసారిగా వేగం పెంచడం తగ్గిపోవడంతో ఇంధన వినియోగం నియంత్రణలో ఉంటుంది. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల విషయానికి వస్తే, గంటకు 65 నుంచి 80 కిలోమీటర్ల వేగం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేగంలో బ్యాటరీపై ఒత్తిడి తగ్గి, రేంజ్‌ మెరుగుపడే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
లక్ అంటే వీళ్లదే.. రూ. 1 లక్షను రూ. 12 లక్షలు చేసిన మల్టీబ్యాగర్
లక్ అంటే వీళ్లదే.. రూ. 1 లక్షను రూ. 12 లక్షలు చేసిన మల్టీబ్యాగర్
సిగరెట్ కాలుస్తున్నారా..? తండ్రి కావడం కష్టమేనట..
సిగరెట్ కాలుస్తున్నారా..? తండ్రి కావడం కష్టమేనట..
ఉపాధిహామీ పని వద్ద..తోటి కూలీ దంపతులకు 41వ మ్యారేజ్ డే గిఫ్ట్..
ఉపాధిహామీ పని వద్ద..తోటి కూలీ దంపతులకు 41వ మ్యారేజ్ డే గిఫ్ట్..
ఈసారి చూడబోయేది దశావతారమే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వైరల్.
ఈసారి చూడబోయేది దశావతారమే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వైరల్.
ఇప్పుడు తెలుగులో ఈ నటుడి పేరు మార్మోగుతుంది..ఎవరో గుర్తు పట్టారా?
ఇప్పుడు తెలుగులో ఈ నటుడి పేరు మార్మోగుతుంది..ఎవరో గుర్తు పట్టారా?
ఫిష్ అక్వేరియం ఈ దిశలో ఉంటే.. చేతి నిండా సంపద!
ఫిష్ అక్వేరియం ఈ దిశలో ఉంటే.. చేతి నిండా సంపద!
ఇదేందయ్యా ఇది.. ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లా..
ఇదేందయ్యా ఇది.. ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లా..
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్..
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్..
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?
పల్లెటూర్లలో చెట్ల కింద కూర్చొని పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే
పల్లెటూర్లలో చెట్ల కింద కూర్చొని పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే