రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం రోడ్డు పక్కన వేచిచూస్తున్న ప్రయాణికులను అతివేగంతో వచ్చిన స్కార్పియో ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.