త్రిష
దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి త్రిష కృష్ణన్. 1983 మే 4న చెన్నైలో జన్మించారు. 1999లో ‘మిస్ చెన్నై’ కిరీటాన్ని కైవసం చేసుకుని, ఆపై మోడలింగ్ నుండి సినీ రంగ ప్రవేశం చేశారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో తమిళ, తెలుగు భాషల్లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘వర్షం’ సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకున్న త్రిష, ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆమె నటనకు గాను పలు ఫిల్మ్ఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. సినిమాలతో పాటు ఆమె సామాజిక సేవలో కూడా చురుగ్గా పాల్గొంటారు. జంతు సంక్షేమం, యునిసెఫ్ (UNICEF) తరపున బాలల హక్కుల కోసం రాయబారిగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ పూర్తిగా నటనపైనే దృష్టి సారించింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ దళపతి గెలవగా.. ఎక్కువగా త్రిష పేరు మారుమోగింది.
Vijay Thalapathy : విజయ్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. కానీ అతడు త్రిషనే పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా ఎక్కువగా మారుమోగుతున్న పేరు విజయ్ దళపతి. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. హీరోగా మెప్పించిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
- Rajitha Chanti
- Updated on: May 9, 2026
- 8:19 am