Rangam Bhavishyavani LIVE: ఈ ఏడాది ఎలా ఉండనుంది..? మహంకాళి రంగం భవిష్యవాణి ప్రత్యక్ష ప్రసారం..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన రంగం (భవిష్యవాణి) కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. మాతంగి స్వర్ణలత అమ్మవారిని ఆవాహన చేసి రాబోయే ఏడాదికి సంబంధించిన వర్షాలు, పంటలు, ప్రజల సంక్షేమంపై భవిష్యవాణి వినిపించనున్నారు. రంగం అనంతరం అమ్మవారి చిత్రపటంతో అంబారీ ఊరేగింపు జరగనుండగా, ఉత్సవాల సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా బోనాల సందడే కనిపిస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ముక్కులు చెల్లించుకున్నారు. లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రంగం భవిష్యవాణి ప్రారంభమైంది. వాస్తవానికి.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బోనాల జాతరలో రెండో రోజు జరిగే రంగం (భవిష్యవాణి) అత్యంత ముఖ్యమైన సాంప్రదాయ ఘట్టం.. దీనిలో మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకుని రాబోయే ఏడాదికి సంబంధించిన భవిష్యవాణిని వినిపిస్తారు. రాబోయే ఏడాది కాలంలో రాష్ట్రంలో వర్షపాతం, పంటలు, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, అలాగే అమ్మవారికి సమర్పించిన బోనాలు, పూజలపై ఆమె రంగంలో వినిపించనున్నారు. భవిష్యవాణి కార్యక్రమం అనంతరం అంబారీపై అమ్మవారి చిత్రపటంతో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. రంగంతోపాటు.. ఊరేగింపు కార్యక్రమం దృష్ట్యా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే..
లేడీ ఏసీపీ సాహసం... కదులుతున్న బస్సుకు ఎదురుగా నిలబడి
ఆహా స్కెచ్ అంటే నీదే బాస్.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్ చేసాడు
భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం..
