AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పదేళ్లలో మూడే సినిమాలు.. ఈ అనంతపురం అబ్బాయి పాన్ ఇండియా ఫేమస్ .. ఎవరో గుర్తు పట్టారా?

17 ఏళ్ల వయసులో షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. 30కు పైగా లఘు చిత్రాలు తీసి తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2014లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కానీ ఇప్పటివరకు చేసింది మూడే సినిమాలు.. కానీ క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవెల్..

Tollywood: పదేళ్లలో మూడే సినిమాలు.. ఈ అనంతపురం అబ్బాయి పాన్ ఇండియా ఫేమస్ .. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Director
Basha Shek
|

Updated on: Sep 06, 2025 | 6:12 PM

Share

పై ఫొటోలో మ్యాజిక్ చేస్తోన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. అలాగనీ ఈ డైరెక్టర్ పెద్దగా సినిమాలు చేయలేదు. 2014లో ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఇప్పటివరకు మూడు సినిమాలు తీశాడు. అందులో ఒకటి ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ డైరెక్టర్ ఇప్పటివరకు తీసిన రెండు సినిమాలు మాత్రం వేరే లెవెల్. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. అందుకే ఈ యంగ్ డైరెక్టర్ కు స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఉంది. ఈ అబ్బాయిది రాయల సీమ. అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగాడు. చదువుల్లోనూ బాగా చురుకు. అయితే సీఏ చేస్తోన్న సమయంలోనే ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశాడు. 17 ఏళ్ల వయసులోనే షార్ట్ ఫిల్మ్స్ తీసి తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. సుమారు 30కు పైగా లఘు చిత్రాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ 2014లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. రెండో సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మూడో సినిమాతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

గత కొన్ని రోజులుగా ఈ డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఎందుకంటే అతను డైరెక్ట్ చేసిన ఒక సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నెట్టింట ఈ క్రేజీ డైరెక్టర్ పేరు తెగ మార్మోగిపోతోంది. మరి అతనెవరో గుర్తు పట్టారా? త్వరలోనే పవన్ కల్యాణ్ సినిమాతో మన ముందుకు రానున్నాడు. అతను మరెవరో కాదు ఓజీ డైరెక్టర్ సుజిత్. ఇది అతని చిన్ననాటి ఫొటో.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ తో డైరెక్టర్ సుజిత్

View this post on Instagram

A post shared by Sujeeth (@sujeethsign)

రన్ రాజా రన్, సాహో చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుజిత్. ఇప్పుడు ఓజీతో మరోసారి ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేయడానికి ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..