AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi : ఆ సినిమా దెబ్బకు అండర్‌గ్రౌండ్‌‏కు వెళ్లిపోయా.. వారం రోజులు బయటకు రాలేదు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

దర్శకుడు కృష్ణవంశీ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. అయితే ఓ సినిమా విడుదల సమయంలో నటుడు శ్రీకాంత్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. శ్రీకాంత్ ఏడు రోజులు కనిపించకుండా ఉండాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో మీడియా అప్పట్లో అంతగా చురుకుగా లేదని పేర్కొన్నారు. ప్రజలు సినిమాలోని కొన్ని అంశాలను అపార్థం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కృష్ణవంశీ అభిప్రాయపడ్డారు.

Krishna Vamsi : ఆ సినిమా దెబ్బకు అండర్‌గ్రౌండ్‌‏కు వెళ్లిపోయా.. వారం రోజులు బయటకు రాలేదు.. డైరెక్టర్ కృష్ణవంశీ..
Krishna Vamsi
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2026 | 4:08 PM

Share

దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్‌లో ఎదురైన కీలక సంఘటనలను, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమా విడుదల సమయంలో నటుడు శ్రీకాంత్‌కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. శ్రీకాంత్ దాదాపు ఏడు రోజుల పాటు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజలు సినిమాలోని కొన్ని అంశాలను అపార్థం చేసుకోవడం వల్లే ఈ విధమైన రియాక్షన్ వచ్చిందని కృష్ణవంశీ వివరించారు. తన చిత్రం మహాత్మా విషయంలోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయని గుర్తు చేశారు. “తప్పు చేస్తున్నామని అనుకుంటేనే భయం ఉంటుంది, తప్పు చేయడం లేదనుకునే వారికి భయం ఉండదు” అని ఆయన అన్నారు. తన సినిమాలు ఒక ఆలోచనను రేకెత్తించే సీడ్ లాగా పనిచేయాలని, సమాజంలో చర్చను ప్రోత్సహించాలని కృష్ణవంశీ కోరారు.

నటుడు చిరంజీవి పట్ల తనకున్న అభిమానాన్ని కూడా కృష్ణవంశీ వ్యక్తం చేశారు. నటుడిగా చిరంజీవి ఆల్ రౌండర్ సామర్థ్యం, ఆయన ఫైట్స్, డాన్సులు, తన యూత్ వయస్సులో చిరంజీవి చూపిన ఎనర్జీ తనను ఆకర్షించాయని తెలిపారు. చిరంజీవి “నథింగ్ నుంచి ఎవ్రీథింగ్” వరకు స్వయంకృషితో ఎదిగిన విధానం, ఆయన ప్రవర్తన, మానసిక స్థితి, గ్రహణశక్తి, ఇతర నటులు, దర్శకులతో ఆయన కమ్యూనికేషన్ పట్ల తనకు గౌరవం ఉందని చెప్పారు. తన కష్టకాలంలో గోవిందుడు అందరివాడేలే సినిమాకు చిరంజీవి అవకాశం ఇవ్వడం తన జీవితంలో లభించిన ఒకే ఒక్క గొప్ప అవకాశంగా కృష్ణవంశీ పేర్కొన్నారు.

చిరంజీవి బహుమతిగా ఇచ్చిన కారుకు సంబంధించిన ప్రమాదాన్ని కూడా కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి బహుమతిగా ఇచ్చిన కారు ప్రమాదానికి గురైందని, అయితే తాను సాధారణంగా బహుమతులు తీసుకోనని, సెంటిమెంట్ ప్రకారం తనకు ఏ బహుమతి వచ్చినా అది తన దగ్గర ఉండదని తిరస్కరించినట్లు తెలిపారు. చిరంజీవి పట్టుబట్టడంతో స్వీకరించిన ఆ కారుతో నందిగామ వద్ద ప్రమాదం జరిగిందని వివరించారు. వర్షం పడటం మొదలైన మొదటి ఐదు నిమిషాలు రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటుందని, ఆ సమయంలో వేగంగా ప్రయాణించకూడదని ఆయన హెచ్చరించారు. డ్రైవర్ 170-180 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు, రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని తప్పించడానికి బ్రేక్ వేసి, కట్ చేయడంతో కారు మూడుసార్లు పల్టీలు కొట్టి ఆగిపోయిందని తెలిపారు. అదృష్టం వల్ల చిన్న దెబ్బలతో బయటపడ్డానని, కారు భద్రత వల్లే బతికానని కృష్ణవంశీ పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us