AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాల్లో విలన్.. రియల్ లైఫ్‌లో హీరో.. అమ్మపై ప్రేమతో చరిత్ర సృష్టించిన నటుడు

సినిమా ఇండస్ట్రీలో విలన్ గా నటించి మెప్పించారు ఆయన. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే స్టార్ హీరోలతో పోటీపడి సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. తెలుగు, మరాఠీ, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ విలన్.

సినిమాల్లో విలన్.. రియల్ లైఫ్‌లో హీరో.. అమ్మపై ప్రేమతో చరిత్ర సృష్టించిన నటుడు
Tollywood
Rajeev Rayala
|

Updated on: May 30, 2026 | 8:51 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కేవలం నటనతోనే కాదు సామాజిక సేవతోనూ అభిమానులను సొంతం చేసుకుంటుంటారు. సినిమాల్లో నటనపరంగా అంతులేని అభిమానులను సొంతం చేసుకున్న నటులు ఎంతో మంది ఉన్నారు. కాగా సమాజ సేవలో ముందుండే వారు చాలా తక్కువ మందే ఉంటారు. చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోలతో పాటు సమంతతో పాటు మరికొంతమంది హీరోయిన్స్ కూడా ఛారిటీల ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. అలాగే విలన్ గా నటించి మెప్పించిన సోనూసూద్ లాంటి వారు కూడా ప్రజల కోసం ఎదో ఒక సాయం చేస్తున్నారు. అలాగే తాజాగా ఓ విలన్ తన తల్లి కోసం చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తల్లి పేరు మీద 6.5 లక్షల చెట్లతో చరిత్ర సృష్టించారు. ఇంతుకు ఆ విలన్ ఎవరు.? ఆయన చేసిన పని ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం.!

ఇది కూడా చదవండి : బాలయ్య సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్‌గా హీరోయిన్‌గా చేసిన ఏకైక నటి.. ఆ కుర్రాడు కూడా హీరోనే

సయాజీ షిండే.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆయన తన విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో సయాజీ షిండే విలన్ గా నటించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించాడు. మరాఠీలో ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన షాయాజీ షిండే ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మారఠీ, హిందీ ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ఇక పోకిరి సినిమాలో సయాజీ షిండే నటనకు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అనే డైలాగ్ బాగా పాపులార్ అయ్యింది. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు షియాజీ షిండే.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Folk Song: ఏం పాట మావ..! అమ్మాయిలు తెగ పాడుకుంటున్న సాంగ్.. వచ్చి 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే

కాగా 2016లో జరిగిన ఓ సంఘటన ఆయన జీవితంలో మలుపు తిరిగింది. అదే సమయంలో ఆయన తల్లి చనిపోయారు. కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ తన తల్లిని కాపాడుకోలేకపోయారు సయాజీ షిండే.. దాంతో ఆయన ఓ సరికొత్త ఆలోచనతో సహ్యాద్రి దేవరాయ్ పేరుతో ఓ ఉద్యమం మొదలుపెట్టారు. తన తల్లి జ్ఞాపకం నేలపై శాశ్వతంగా ఉండిపోవాలని ఆయన ఆమె తల్లి బరువుకు సరితూగే విత్తనాలను తెప్పించి మహారాష్ట్ర అంతటా నాటాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుండి ఏకంగా రెండు ట్రక్కుల నిండా మొక్కలు తెప్పించి మహారాష్ట్రలో నాటారు. ఇప్పటివరకు ఏకంగా 6.5 లక్షలకు పైగా చెట్లను నాటారు షియాజీ షిండే. ఇప్పటికే మహారాష్ట్రలోని గ్రామంలో అనేక చెట్లను నాటి పచ్చదనాన్ని, ప్రకృతిని కాపాడుతున్నారు. ఈ ప్రకృతిలోని తన తల్లిని చూసుకుంటున్నారు సయాజీ షిండే.

ఇది కూడా చదవండి : Shruti Haasan: ఆ సాంగ్ వల్ల.. నన్ను ఇష్టపడని వారు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us