AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Savings Schemes: వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం.. చిన్న మొత్తాల పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు ఇవే..!

జనవరి 1, 2025 నుంచి ప్రారంభమైన నాలుగో నాల్గవ వరుస త్రైమాసికానికి అనేక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ఒకే విధంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నాలుగు త్రైమాసికాల్లో ఏర్పాటు చేసిన నమూనాకు అనుగుణంగా రేట్లు యథాతధమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Small Savings Schemes: వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం.. చిన్న మొత్తాల పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు ఇవే..!
Small Savings Schemes
Nikhil
|

Updated on: Jan 31, 2025 | 2:45 PM

Share

2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు జనవరి 1, 2025 నుంచి ప్రారంభమై మార్చి 31, 2025తో ముగుస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు అయిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీ రేట్లు యథాతధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి ఇదే మంచి ఎంపిక అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 

సీనియర్‌ల కోసం ఈ పథకం ప్రముఖ పెట్టుబడి ఎంపిక. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్  ప్రభుత్వం అందింస్తుంది. జనవరి-మార్చి మధ్య చేసిన విరాళాలకు 8.2 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఎస్‌సీఎస్ఎస్ ఖాతాలో రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వారు కనిష్టంగా రూ. 1,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం పొదుపు పథకం వడ్డీ రేటును సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి-మార్చి త్రైమాసికానికి వడ్డీ రేటును 8.2 శాతంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 

పీపీఎఫ్ అనేది ప్రభుత్వం మద్దతు ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వ్యవస్థ పొదుపు, ఆస్తుల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ పథకం పెట్టుబడిదారులకు పోటీ వడ్డీ రేటుతో పాటు వారి పెట్టుబడిపై రాబడిని అందిస్తుంది. పీపీఎఫ్ స్కీమ్‌లో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే 15 ఏళ్ల తర్వాత ఐదేళ్ల సంవత్సరాల ఇంక్రిమెంట్లలో పొడిగించవచ్చు. ఒక పీపీఎఫ్ ఖాతాలో కనీసం రూ. 500తో ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 

ఇవి కూడా చదవండి

సుకన్య సమృద్ధి యోజన

ప్రభుత్వం తన బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) పొదుపు పథకం ప్రారంభించింది. ఇండియా పోస్ట్ లేదా కమర్షియల్ బ్యాంక్‌తో తమ కుమార్తె కోసం పొదుపు ఖాతాను తెరిచే అవకాశం తల్లిదండ్రులకు ఉంటుంది. ఎస్ఎస్‌వై ఖాతాలపై 8.2 శాతం పోటీ వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఎస్‌ఎస్‌వై ఖాతాను నమోదు చేయడానికి అవసరమైన ప్రాథమిక కనీస డిపాజిట్ రూ. 250గా ఉంటే గరిష్ట మొత్తం ఏడాదికి రూ.1.5 లక్షలుగా ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి