Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart phones: ఐఫోన్‌కు యమా క్రేజ్.. దేశీయ మార్కెట్‌లో అత్యధిక వాటా

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి నెలకొంది. జేబులో రూపాయి లేకపోయినా పర్వాలేదు గానీ ఫోన్ లేకపోతే మాత్రం చాలా కష్టం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ అడుగడుగునా వీటి అవసరం ఉంటుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల కంపెనీలు అనేక మోడళ్ల ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. వాటిలో వేటిపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారో, ఏ కంపెనీ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారో తెలుసుకుందాం.

Smart phones: ఐఫోన్‌కు యమా క్రేజ్.. దేశీయ మార్కెట్‌లో అత్యధిక వాటా
Apple Phone
Follow us
Srinu

|

Updated on: Jan 31, 2025 | 2:26 PM

2024 చివరి త్రైమాసికంలో జరిగిన అమ్మకాల ఆధారంగా ఇటీవల ఓ నివేదిక బయటకు వచ్చింది. దాని ప్రకారం.. భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆపిల్ కంపెనీ 23 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే వీవో తన వాటాను పెంచుకుంది. ఆపిల్ వాటా ఏడాది ప్రాతిపదికన 11 శాతానికి పెరిగింది. గతేడాది అది 9 శాతం మాత్రమే నమోదైంది. అలాగే 2024లో స్మార్ట్ ఫోన్ షిప్ మెంట్ లు ఏడాదికి ఒక శాతం పెరిగి, 153 మిలియన్ల యూనిట్లకు చేరుకున్నాయి. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఎంట్రీ, మధ్య శ్రేణి పరికరాలు మెరుగుపడుతున్నాయని, దీనివల్ల రిప్లేస్ మెంట్ సైకిల్స్ పెరుగుతున్నాయన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఆపిల్ 23 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, వీవో తన స్థానాన్ని పెంచుకుంది. 2023 త్రైమాసికంతో పోల్చితే 17 నుంచి 20 శాతానికి పెరిగింది. షియోమి 16, సామ్సంగ్ 15, ఒప్పో 14 శాతంతో వాల్యూష్ షేర్ తో కొనసాగాయి.

వీవీ మంచి వృద్ధితో మొదటి సారిగా మార్కెట్ లీడర్ గా మారింది. దీనికి బలమైన ఆఫ్ లైన్ నెట్ వర్క్ తో పాటు దాని సబ్ బ్రాండ్ ఐక్యూ మద్దతు కూడా లభించింది. సామ్సంగ్ మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. అయితే దీని ప్రీమియం పరికరాలు మంచి పనితీరును కొనసాగించాయి. ప్రత్యేకించి సామ్సంగ్ ఎస్ సిరీస్ ఆకట్టుకుంది. 2024 వార్షిక విలువ షేర్ చార్టును పరిగణనలోకి తీసుకుంటే సామ్సంగ్ 22 శాతం వాటాతో కొనసాగింది. ఆపిల్ ను అనుసరిస్తూ వెళ్లింది. తర్వాత వీవో 16 వాతం, ఒప్పో 16 శాతం, షియోమి 9 శాతంతో కొనసాగాయి. ఇక చిప్ సెట్ కేటగిరీలో మీడియా టెక్ అత్యధికంగా 52 శాతం వాటా పొందింది. తర్వాత క్వాల్ కమ్ 25 శాతంతో నిలిచింది. ఎంట్రి లెవెల్ స్మార్ట్ ఫోన్లలో 5 జీ చిప్ సెట్ల లభ్యత కారణంగా 2024లో 5 జీ స్మార్ట్ ఫోన్ షిప్ మెంట్ 78 శాతానికి పెరిగింది.

దేశంలో ఆపిల్ ఫోన్లకు డిమాండ్ కు విపరీతంగా పెరుగుతోంది. దీన్ని కొనుగోలు చేయడం స్టేటస్ కు చిహ్నంగా భావిస్తారు. మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా యువతకు ఆపిల్ ఫోన్లంటే చాలా మక్కువ. పీఎల్ఐ పథకంతో పాటు పెరుగుతున్న ప్రీమియమైజేషన్ ట్రెండ్ కారణంగా క్యాలెండర్ ఇయర్ 2024లో ఐఫోన్ ఎగుమతులు రూ.1లక్ష కోట్లకు చేరాయి. గతేడాదిలో పోల్చితే దాదాపు 46 శాతం పెరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి