AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జీవో1పై కీలక పరిణామం.. సస్పెన్షన్ కొనసాగించేందుకు కోర్టు నిరాకరణ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోపై విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించేందుకు..

Andhra Pradesh: జీవో1పై కీలక పరిణామం.. సస్పెన్షన్ కొనసాగించేందుకు కోర్టు నిరాకరణ..
Andhra Pradesh High Court
Shiva Prajapati
|

Updated on: Jan 23, 2023 | 6:20 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోపై విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించేందుకు హైకోర్టు నిరాకరించింది. జీవో నెంబర్ 1 పై సోమవారం నాడు కోర్టు వాదనలు జరుగగా.. ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే, ఈ జీవోపై వేసిన మిగిలిన పిటిషన్లు అన్నింటిపై మంగళవారం నాడు విచారణ జరుపనుంది హైకోర్టు. రేపు వాదనలు విన్న తరువాత తుది తీర్పు వెలువరించనుంది ధర్మాసనం.

రోడ్లపై సభలను నిషేధిస్తూ జీవో నెంబర్ 1..

రోడ్లపై సభలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టుని ఆశ్రయించారు. దీంతో 23 వరకు జీవోను సస్పెండ్ చేసింది న్యాయస్థానం. ఇవాళ (సోమవారం) మరోసారి వాదనలు జరిగాయి. అయితే జీవో సస్పెన్షన్‌పై నేటితో గడువు ముగస్తున్నందున.. మళ్లీ పొడగించాలంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.

రోడ్లన్నీ పూర్తిగా బాగు చేయాలి..: సీఎం

అదలాఉంటే.. ఆర్‌ అండ్‌ బి శాఖపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం జగన్. ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయడంతోపాటు.. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని ఆదేశించారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా చూడాలని చెప్పారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తిచేయాలని చెప్పారు సీఎం. వచ్చే జూన్, జులై లోపు నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని స్పష్టం చేశారు. ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా కొందరు నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల కడుపుమంటకు మందులేదని.. అందుకే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని సూచించారు ముఖ్యమంత్రి జగన్. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో వివరాలు ఉంచాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..