AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget-2023: బడ్జెట్‌ తర్వాత బంగారం, అభరణాల ధరలు తగ్గనున్నాయా..?

ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు నెలకొని ఉన్నాయి. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్న..

Budget-2023: బడ్జెట్‌ తర్వాత బంగారం, అభరణాల ధరలు తగ్గనున్నాయా..?
Union Budget 2023
Subhash Goud
|

Updated on: Jan 23, 2023 | 2:49 PM

Share

ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు నెలకొని ఉన్నాయి. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్న ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్‌లో కొన్ని వస్తువులు ఖరీదైనవి, మరికొన్ని చౌకగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2023న బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నప్పటికీ, వివిధ మంత్రిత్వ శాఖలు తమ సిఫార్సులను పంపాయి. స్థానిక ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్‌లో, ప్రభుత్వం మొత్తం దృష్టి దేశంలో ఉత్పత్తిని పెంచడం, అనవసరమైన వస్తువుల దిగుమతిని తగ్గించడంపైనే ఉంటుంది. తద్వారా దేశంలోని వాణిజ్య నిల్వలను సరిచేయవచ్చు. కరెంట్ ఖాతా లోటును తగ్గించవచ్చు.

అందుకే వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివిధ ఉత్పత్తుల జాబితాను కోరింది. దీని దిగుమతి అవసరం లేదు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం అనేక రంగాలకు పీఎల్‌ఐ పథకాన్ని ప్రారంభించింది. ఇక బంగారం చౌకగా ఉండే అవకాశం ఉందని, తద్వారా ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని తెలుస్తోంది. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారంతో పాటు మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. తద్వారా దేశం నుండి ఆభరణాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. గతేడాది బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచింది.

విమానయానం, ఎలక్ట్రానిక్స్, ఉక్కు, పారిశ్రామిక ఉత్పత్తి రంగాలలో ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని సున్నాకి తగ్గించింది. కానీ ఈ రంగాలలో కొన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీ పెరగవచ్చు. ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్‌లు, ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు, ఆభరణాలు, తోలు వస్తువులపై అధిక సుంకాలు విధించవచ్చని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇది కాకుండా నాణ్యత లేని ఉత్పత్తుల దిగుమతిని తగ్గించడానికి ప్రభుత్వం అనేక రంగాలకు ప్రమాణాలను నిర్దేశించింది. వీటిలో స్పోర్ట్స్ వస్తువులు, చెక్క ఫర్నిచర్, తాగునీటి బాటిల్స్‌ ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ తయారీదారులకు ఇవి ఒకే విధంగా ఉంటాయి. ఈ ప్రమాణాల కారణంగా చైనా నుండి వచ్చే అనేక చౌక వస్తువుల దిగుమతి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి