AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్ లో ఆలయంపై దాడి ఘటన.. 50 మంది అరెస్ట్.. 150 మందిపై కేసుల నమోదు

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో సిద్ధివినాయక ఆలయంపై దాడికి పాల్పడినవారిలో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 150 మందిపై కేసులు నమోదు చేశారు.

పాకిస్తాన్ లో ఆలయంపై దాడి ఘటన.. 50 మంది అరెస్ట్.. 150 మందిపై కేసుల నమోదు
50 Arrested In Pakistan
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 08, 2021 | 11:51 AM

Share

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో సిద్ధివినాయక ఆలయంపై దాడికి పాల్పడినవారిలో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 150 మందిపై కేసులు నమోదు చేశారు. ఆలయంపై దాడి జరుగుతున్నా స్థానిక పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించడాన్ని పాక్ సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం అత్యంత శోచనీయమని పంజాబ్ ప్రావిన్స్ సీఎం ఉస్మాన్ బుజ్డార్ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఈ విధమైన ఘటనలు జరగకుండా చూస్తామని పేర్కొన్న ఆయన.. ఈ ఆలయ మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రావిన్స్ లోని రహీంయార్ ఖాన్ జిల్లా భోంగ్ సిటీలో గల ఈ టెంపుల్ పై ఓ గుంపు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసి పవిత్ర గ్రంథాలకు నిప్పు పెట్టింది. ఆలయంలో చాలా భాగాన్ని వారు నాశనం చేశారు. కాగా ఇలాంటి సంఘటనలు విదేశాల్లో పాక్ ప్రతిష్టను మంటగలుపుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అటు-శుక్రవారం పాక్ పార్లమెంటు ఈ ఘటనను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ ఆలయ సమీపంలో వందకు పైగా హిందూ కుటుంబాలు ఉన్నాయి. అనేకమంది ఒక్కసారిగా రాడ్లు, కర్రలు,, బండరాళ్లతో ఈ టెంపుల్ పై ఎటాక్ చేయడంతో ఈ కుటుంబాల వారంతా భయంతో హడలిపోయారు. భారత ప్రభుత్వం ఢిల్లీలోని పాక్ దౌత్యాధికారిని పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గ్రేట్ బ్రిటన్ లో ప్రవాసం ఉన్న ముజాహిదా క్వామీ మూవ్ మెంట్ వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుసేన్ ..ఈ ఘటనను ఖండిస్తూ ఇటీవల ఫైసలాబాద్ లోని ప్రార్థనా మందిరపై జరిగిన ఎటాక్ గురించి కూడా ప్రస్తావించారు. ఇలాంటివి విదేశాల్లో పాక్ ప్రతిష్టను దిగజారుస్తాయన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్గనిస్తాన్ పరిస్థితిపై చర్చకు అందని ఐరాస భద్రతా మండలి ఆహ్వానం.. పాకిస్తాన్ ఆగ్రహం

Wandering Elephants: ఎట్టకేలకు ఇంటికి చేరిన ఏనుగుల కథ.. 500 కి.మీ మేర ప్రయాణించి సరికొత్త రికార్డు..

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి