AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ట్రాక్‌పై పసికందు.. ఏడుపు విని సిబ్బంది పరుగులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అసలు వీళ్లు మనుషులేనా.. రానురానూ మానవత్వం కూడా మంట గలిసిపోతోంది.. కొందరయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లిలోని కూనారం గేటు సమీపంలో ట్రాక్ మధ్యలో రెండు నెలల వయస్సు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు.

రైల్వే ట్రాక్‌పై పసికందు.. ఏడుపు విని సిబ్బంది పరుగులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Railway Track
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 07, 2025 | 9:24 PM

Share

అసలు వీళ్లు మనుషులేనా.. రానురానూ మానవత్వం కూడా మంట గలిసిపోతోంది.. కొందరయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లిలోని కూనారం గేటు సమీపంలో ట్రాక్ మధ్యలో రెండు నెలల వయస్సు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు. రైల్వే సిబ్బందికి పసికందు ఏడుపు వినిపించడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. రామగుండం రైల్వే సీఐ సురేష్ గౌడ్ తన సిబ్బందితో వచ్చి శిశువును ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి, చికిత్స అందించారు. అయితే శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులకు రైల్వే పోలీసులు సమాచారం అందించి ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నారు.

పట్టాలపై శిశువును వదిలి వెళ్లిన వారికి కఠినమైన శిక్షలు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నవ మాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి కూడా తన బిడ్డను వదులుకోవడాన్నిఎలా ఒప్పుకుందని.. ఇంత కర్కషత్వం ఎందుకని.. ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇలాంటి వారి కంటే, జంతువులే బెటర్ అని అనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.

అయితే.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు అధికారులు.. ఆ సమయంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో చిన్నారి ప్రాణం దక్కిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..