AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై లేటెస్ట్ అప్‌డేట్.. ఆ డేటా ప్రకారమే జారీ

తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరో 30 లక్షల మందికి రేషన్​ లబ్ధి కలిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మొన్నామధ్య చేసిన సామాజిక, ఆర్థిక సర్వే డేటా ఆధారంగానే.. కొత్త రేషన్​ కార్డుల జారీ ఉంటుందని.. ఫౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై లేటెస్ట్ అప్‌డేట్.. ఆ డేటా ప్రకారమే జారీ
Telangana New Ration Cards
Ashok Bheemanapalli
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 11, 2025 | 1:33 PM

Share

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై మరో అప్‌డేట్ వచ్చింది. అస్సలు లేనివారికి కొత్త కార్డులు జారీ చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో ఫ్యామిలీ మెంబర్ల పేర్లను చేర్చాలని అభ్యర్థిస్తూ పెట్టుకున్న అప్లికేషన్లన సర్కారు ఆమోదించింది. దీంతో దాదాపు 30 లక్షల మందికి కొత్తగా రేషన్ అందనున్నట్లు తెలిసింది. కొత్తగా ఇష్యూ చేయున్ను కార్డులపై సీఎం రేవంత్, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉంటాయి. జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డ్స్ ఇవ్వనున్నారు. గతంలో ఉన్న పాత రేషన్‌ కార్డులకు సంబంధించిన వివరాలను కూడా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త రేషన్‌కార్డుకు సంబంధించిన డిజైన్‌ ప్రక్రియకు ఇంకొంత సమయం పట్టే అవకాశముందని పౌరసరఫరాల అధికారులు తెలిపారు.

కొత్త కార్డుల జారీకి అప్లికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం తేదని అధికారులు చెబుతున్నారు మొన్నామధ్య జరిగిన సామాజిక, ఆర్థిక సర్వేలో పేదల డేటాఉందని.. అందులోనే రేషన్ కార్డులు.. ఉన్నవారి.. లేనివారి వివరాలు ఉందని వివరిస్తున్నారు. ఆ మేరకు అర్హుల లిస్ట్‌ను గ్రామ సభలు, బస్తీ సభల్లో పొందుపరచనున్నారు. కాగా తెలంగాణలో ప్రస్తుతం అన్నపూర్ణ స్కీమ్, అంత్యోదయ కార్డుల కలిపి 89.96 లక్షల మందికి రేషన్​కార్డులున్నాయి. ఆ రేషన్​కార్డుల పరిధిలో 2.1 కోట్ల మంది ఉన్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి 6 కేజీల బియ్యం అందుతుంది. ఇందులో కేంద్రం నుంచి 5 కిలోలు ఇస్తుండగా, రాష్ట్రం నుంచి 1 కిలో ఇస్తుంది. అన్నపూర్ణ స్కీమ్​కింద ఉన్న 5,416 కార్డులకు 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇస్తుండగా.. అంత్యోదయ కార్డులు ఉన్న 5.66 లక్షల మందికి కేంద్రం 35 కేజీల బియ్యం ఇస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..