భారత మామిడి పండ్ల రాజధాని.. ఇక్కడి వెరైటీలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Krishna
23 May 2026
దేశంలోనే అత్యధికంగా మామిడి పండ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జాతీయ దిగుబడిలో సుమారు 26 నుండి 27శాతం వాటా ఒక్క యూపీ నుంచే వస్తుంది. చారిత్రాత్మకంగా అత్యధిక వైవిధ్యమైన రకాలకు ఇది నిలయం.
నంబర్ వన్
యూపీలో పండే మామిడి రకాల్లో మాలిహాబాద్ దసరి, లంగ్రా, చౌసా, లక్నో సఫేదా, అమ్రపాలి, రామ్కేలా వంటివి దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని ముఖ్యమైన రకాలు.
ప్రసిద్ధ రకాలు
మాలిహాబాద్ నుండి వచ్చే దసరి మామిడి సీజన్ ప్రారంభంలోనే పండుతుంది. ఇది బంగారు పసుపు రంగులో మృదువైన గుజ్జుతో, అస్సలు పీచు లేకుండా నోట్లో కరిగిపోతుంది. అందుకే దీనిని మామిడి పండ్ల రాజు అని పిలుస్తారు.
దసరి
లక్నో, అలహాబాద్ ప్రాంతాల్లో ఇది బాగా ఫేమస్. తీపి పులుపు రుచితో గట్టిగా, రసభరితంగా ఉండే ఈ పండు తొక్క తీయడం చాలా ఈజీ. పీచు తక్కువగా ఉండటం వల్ల ముక్కలుగా కోసుకుని నేరుగా తినడానికి అందరూ ఇష్టపడతారు.
సఫేదా
పూర్తిగా పండినప్పటికీ ఈ మామిడి పండ్లు ప్రత్యేకంగా ఆకుపచ్చ-పసుపు రంగు తొక్కను కలిగి ఉంటాయి. వారణాసికి చెందిన ఈ రకంలో స్వల్ప పులుపు, ఘాటైన తీపి కలగలిసి కస్టర్డ్ లాంటి ఆకృతితో ఉంటాయి.
లంగ్రా
ఇవి సీజన్ చివర్లో పండే పెద్ద సైజు మామిడి పండ్లు. పూల సువాసనతో, పులుపు లేకుండా అత్యంత తియ్యగా ఉండే చౌసా రకం.. డెజర్ట్లకు, మిల్క్ షేక్లకు మరియు ఎక్కువ తియ్యదనాన్ని ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్.
చౌసా
ఇది ఒక పొట్టి రకం. దీని చిన్న చెట్లు బాల్కనీలు, టెర్రస్లు లేదా చిన్న పెరళ్లకు చాలా అనుకూలం. ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉండే ఈ చిన్న పండ్లు తీపి, పులుపుల ఆహ్లాదకరమైన సమతుల్యతతో అధిక దిగుబడిని ఇస్తాయి.
అమ్రపాలి
సాధారణంగా తూర్పు భారత్లో పండే ఈ పండ్లు వాటి పలుచని తొక్క, గాఢమైన తేనె లాంటి రుచికి ప్రసిద్ధి. వీటిని కోసి, కొద్దిగా ఉప్పు, కారం చల్లుకుని తింటారు లేదా చల్లని మామిడి పానీయాలుగా తయారు చేసుకుంటారు.