Telangana: పాతబస్తీ మెట్రోరైలు పనులకు శంకుస్థాపన.. రాష్ట్రాభివృద్దికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్..
పాతబస్తీ మెట్రోరైలు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారన్నారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికి కాంగ్రెస్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తోందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు.

పాతబస్తీ మెట్రోరైలు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారన్నారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికి కాంగ్రెస్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తోందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అంటూ కితాబిచ్చారు. ఒరిజినల్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే లండన్ థెమ్స్ నగరాన్ని అక్బరుద్దీన్ తో కలిసి సందర్శించామని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫెజ్-2 ను తీసుకొస్తున్నామన్నారు.
ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్దేవర్ పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ చేయనున్నామని పేర్కొన్నారు. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. చంచల్ గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ సిటీలోప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమదని వివరించారు. మైనారిటీల కోసం 4శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. చఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. గండిపేట నుంచి నగరంలోని 55కి.మీల పరిధిలో మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.








