టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AAJ TAK, NDTVలాంటి జాతీయ ఛానల్స్లో పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. TV9లో వివిధ హోదాల్లో రిపోర్టర్గా పనిచేస్తూ 2016లో కరస్పాండెంట్గా పదోన్నతి పొందాను. 2022లో సీనియర్ కరస్పాండెంట్గా, 2023లో స్పెషల్ కరస్పాండెంట్ పనిచేశాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి TV9 నెట్వర్క్ చీఫ్ రిపోర్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
ఉదయాన్నే మీరు తాగే ఛాయ్ స్వచ్ఛమైనదేనా..? పోలీస్ స్పెషల్ ఆపరేషన్లో షాకింగ్ నిజాలు..!
ఉదయాన్నే మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? అంటే ఖచ్చితంగా అని చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఈ స్టేట్ ఆ స్టేట్ అన్న తేడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో కల్తీ పాలు మన ఆరోగ్యానికి సవాలు విసురుతున్నాయి. కొందరు కల్తీ గాళ్లు మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాలే కాదు.. టీ పొడి సైతం కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
- Noor Mohammed Shaik
- Updated on: Feb 26, 2026
- 8:44 am
ముస్లింల కోసం కదిలివచ్చిన హిందూ కుటుంబం.. వాళ్లు చేసిన పని ఏంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు
హైదరాబాద్లో ఓ హిందూ కుటుంబం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింల కోసం గొప్ప పని చేసింది. గుడిమల్కాపూర్ దయానంద్ కుటుంబం మసీదుకు పండ్లు తీసుకెళ్లి ఇఫ్తార్ సమయంలో అందించింది. ఈ సర్వమత సౌభ్రాతృత్వ చర్య తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భారతదేశ సంస్కృతిని చాటుతోంది.
- Noor Mohammed Shaik
- Updated on: Feb 24, 2026
- 6:55 pm
అందరూ చూస్తుండగానే దారుణం.. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ.. మాజీ వార్డు మెంబర్ హత్య..!
అనుమానం పెనుభూతమై ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Feb 24, 2026
- 10:11 am
Telangana: స్మశానంలో క్షుద్రపూజల బ్యాచ్ అనుకునేరు.. అసలు విషయం తెలిసి బిత్తరపోతారు
సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఏమైనా కూడా చేసేలా ఉన్నారు నేటి జనం. వికృత చేష్టలు చేస్తూ అందరిలో ప్రత్యేకంగా ఉండాలని చేస్తున్నవాళ్లు కొందరైతే ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అవసరమైన కంటెంట్ గురించి కూడా వీడియోలు చేస్తున్నారు మరికొందరు. ఇది ఒక రకంగా సమాజంలో ఉన్న అపోహలను పోగొట్టేలా..
- Noor Mohammed Shaik
- Updated on: Feb 23, 2026
- 3:54 pm
విద్యుత్ దీప కాంతుల్లో చార్మినార్.. పాతబస్తీకే కొత్త శోభ
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో హైదరాబాద్ నగరం కొత్త శోభ సంతరించుకుంది. మరీ ముఖ్యంగా రంజాన్ అంటేనే పాతబస్తీ ప్రాంతానికి పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తుండడం, చార్మినార్, మక్కా మసీదు లాంటి చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడే ఉండడంతో రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు.. ఎక్కడ లేని జనసందోహం పాతబస్తీలోనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రంజాన్ మాసం వేడుకల్లో పాతబస్తీ ప్రాంతం రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది.
- Noor Mohammed Shaik
- Updated on: Feb 23, 2026
- 10:46 am
అరుదైన పాము.. కోట్లలో వ్యాపారం.. దీన్ని గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..
పాము కనిపిస్తేనే చాలా మంది గజగజ వణికిపోతారు. అయితే అదే పాముతో వ్యాపారం చేసేవాళ్లు లేకపోలేదు. అవును కొన్ని అరుదైన పాములతో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తుంటారు. తాజాగా షాద్నగర్ ఫరూఖ్ నగర్లో ప్రత్యక్షమైన అరుదైన ఎర్ర ఇసుక బోవా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రెండు తలలు ఉన్నట్టు కనిపించే ఈ పాము వెనుక ఉన్న రహస్యమేంటి? అనేది తెలుసుకుందాం..
- Noor Mohammed Shaik
- Updated on: Feb 20, 2026
- 1:56 pm
వ్యాపారస్తులకు ఇక లాభాలే లాభాలు.. రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా సర్కార్ వెసులుబాటు..!
ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం మొదలైపోయింది. ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసాలతో భక్తి ప్రవృత్తుల నడుమ రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
- Noor Mohammed Shaik
- Updated on: Feb 19, 2026
- 8:06 pm
వైద్యుల నిర్లక్ష్యంతో ఆరేళ్ల బాలుడు బలి..న్యాయం కోసం తల్లిదండ్రుల ఆందోళన.. ఏం జరిగిందంటే..
గ్రేటర్ నోయిడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం 6 ఏళ్ల పసివాడి ప్రాణాన్ని బలిగొంది. MRI స్కాన్కు ముందు అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడం వల్ల బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం వారు పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా నిరసనలకు దారి తీసింది, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
- Noor Mohammed Shaik
- Updated on: Feb 13, 2026
- 9:01 pm
Watch Video: ట్యాక్సీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రోడ్డు పక్కన చిరు వ్యాపారి బలి.. అసలేం జరిగిందంటే?
రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అవసరంలో ఉన్నా అతివేగం పనికి రాదని పోలీస్ అధికారులు చెబుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. విచక్షణ కోల్పోయి వాహనం నడిపితే మీతో పాటు ఎలాంటి తప్పు చేయని అవతలి వాళ్లను కూడా ఇబ్బందులో పడేస్తారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇది చట్టరీత్యా నేరం కూడా. తాజాగా ఇటువంటి దారుణం రాజస్థాన్లో జరిగింది. ఓ టాక్సీ డ్రైవర్ అతి వేగం రోడ్డు పక్కన కూరగాయల వ్యాపారం చేసుకునే వ్యక్తిని ఢీకొట్టింది. ఆ తర్వాత..
- Noor Mohammed Shaik
- Updated on: Feb 13, 2026
- 1:11 pm
Viral: బోర్ వేస్తుండగా ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్యర్యం కలగాల్సిందే…
కష్టపడకుండా అదృష్టం కలిసి వచ్చిందంటే చాలు.. మన జనాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ముందుగా అక్కడికే పరుగులు పెడతారు. రాజస్థాన్లోని అల్వార్లో బోరుబావి తవ్వకంలో వెండి లాగా మెరిసే రాళ్లు బయటపడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ... ..
- Noor Mohammed Shaik
- Updated on: Feb 13, 2026
- 12:31 pm
న్యూ మలక్పేట్ రోడ్డులో భారీ గుంత.. ముందే చూశారు కాబట్టి సరిపోయింది.. లేకపోతేనా!
న్యూ మలక్పేట్ రోడ్డు, లాల్జార్ హోటల్ వద్ద మట్టి పూడ్చిన రోడ్డు కుంగి భారీ గుంత ఏర్పడింది. ట్రాక్టర్ వెళ్తున్నప్పుడు ప్యాచ్ కూలి వాక్యూమ్ లాంటి గుంత, నీటి పైపు లీకేజీ కనిపించాయి. పోలీసులు వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. AIMIM ఎమ్మెల్యే అహ్మద్ బలాలా తక్షణ చర్యలు, మరమ్మతులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Feb 11, 2026
- 9:23 pm
Hyderabad: నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది బ్రదర్.. స్నేహితుడని బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తే.. చేజేతులా..
డబ్బు ఎంతటి దారుణానికి అయినా మనిషిని లాక్కెళ్తుందని అనడానికి మరో ఉదాహరణ ఈ సంఘటన. అవసరం మేరకు డబ్బు సంపాదన మంచిదే.. కానీ అవసరానికి మించి ఆశపడి ధన వ్యామోహంలో పడిపోతే మాత్రం దాని నుంచి బయటికి రావడం అంత తేలిక కాదు.
- Noor Mohammed Shaik
- Updated on: Feb 9, 2026
- 5:10 pm