టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AAJ TAK, NDTVలాంటి జాతీయ ఛానల్స్లో పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. TV9లో వివిధ హోదాల్లో రిపోర్టర్గా పనిచేస్తూ 2016లో కరస్పాండెంట్గా పదోన్నతి పొందాను. 2022లో సీనియర్ కరస్పాండెంట్గా, 2023లో స్పెషల్ కరస్పాండెంట్ పనిచేశాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి TV9 నెట్వర్క్ చీఫ్ రిపోర్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
ఓఆర్ఆర్పై యువత వీరంగం.. రేసింగ్లు, స్టంట్లతో ప్రాణాలతో చెలగాటం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్, ప్రమాదకర విన్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కార్లు, బైక్లతో రేసింగ్లు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా డోర్లపై కూర్చొని విన్యాసాలు చేసిన ఘటన వైరల్గా మారింది. తరచూ జరుగుతున్న ప్రమాదాలకు ఇటువంటి చర్యలే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jun 6, 2026
- 8:14 pm
మఠంలోకి చొరబడి చంద్రేసల్ మఠాధిపతి హత్య.. కోటాలో కుదిపేస్తున్న అర్ధరాత్రి దారుణం!
రాజస్థాన్లోని కోటా నగరంలో అర్ధరాత్రి దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. సుమారు 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రేసల్ మఠంలో గుర్తుతెలియని దుండగులు మఠాధిపతి దేవానంద్ మహారాజ్ను పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jun 6, 2026
- 7:44 pm
24 రోజులు గడిచినా మిస్టరీగానే విద్యార్థిని మృతి కేసు..అతడిపైనే అనుమానాలు!
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మే 11న జరిగిన 18 ఏళ్ల విద్యార్థిని ఖ్యాతి జైన్ అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ఒక యువతి ఇలా అకాల మరణం చెందడం, ఘటన జరిగి 24 రోజులు గడిచినా పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకపోవడంపై ప్రజల్లో, సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jun 6, 2026
- 12:11 pm
తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ హత్య కలకలం రేపుతోంది. మృతురాలి తలపై బరువైన వస్తువుతో దాడి చేసిన ఆనవాళ్లతో పాటు చేతి మణికట్టు కూడా కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శివాజీ కాలేజీ ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న దేబోస్మితా పాల్ హత్య ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
- Noor Mohammed Shaik
- Updated on: Jun 5, 2026
- 7:46 pm
Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. నెంబర్ ప్లేట్లు అలా ఉంటే అంతే సంగతులు.. జాగ్రత్త మరీ
రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్స్ను ట్యాంపరింగ్ చేసే వాహనదారులను గుర్తించి.. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్కు పాల్పడే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jun 5, 2026
- 6:51 pm
ఒక కప్పు చాయ్ రూ.80.. టీ తాగాలా.. వద్దా?.. పెరుగుతున్న చాయ్ ధరలపై హైదరాబాద్లో పెద్ద చర్చ!
హైదరాబాద్లో చాయ్ ధరల పెంపు ప్రస్తుతం నగరవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఏళ్లుగా సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తున్న ఇరానీ చాయ్ ధర.. ఇప్పుడు గణనీయంగా పెరగడంతో టీ ప్రియులకు నిరాశ పుట్టిస్తోంది. ఇటీవల నగరంలోని ఓ ప్రముఖ చాయ్ కేంద్రం టీ ధరలను పెంచడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ మొదలైంది.
- Noor Mohammed Shaik
- Updated on: Jun 4, 2026
- 12:50 pm
Hyderabad: పాత కక్షతో చోరీ.. రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళ తాళాలు వేసి ఉన్న ఇంట్లో జరిగిన దొంగతనం కేసును చాంద్రాయణగుట్ట డివిజన్, రాజేంద్రనగర్ జోన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళా నిందితురాలిని అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుండి దొంగిలించబడిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..
- Noor Mohammed Shaik
- Updated on: Jun 2, 2026
- 8:18 pm
పాములు, మొసళ్ల భయం ఒకవైపు.. ప్రాణం నిలబెట్టుకోవాలనే ఆశ మరోవైపు.. మూసీలో మహిళ పోరాటం!
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న మూసీ నది ప్రమాదకరమైన మలుపులకు, మురికి నీటికి పెట్టింది పేరు. అలాంటి నదిలోకి ప్రమాదవశాత్తు ఓ మహిళ జారిపడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ధైర్యం కోల్పోకుండా పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఉత్కంఠభరితమైన ఘటన భాగ్యనగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
- Noor Mohammed Shaik
- Updated on: May 19, 2026
- 12:33 pm
అమ్మతనానికే మచ్చ.. తన సుఖం కోసం కన్నబిడ్డను బలి తీసుకున్న కసాయి తల్లి!
హైదరాబాద్లోని అల్వాల్లో వెలుగుచూసిన ఆరేళ్ల బాలిక తన్విక మృతి కేసు యావత్ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని పోలీసులు వెలికితీశారు. తన స్వార్థం కోసం, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో కన్నతల్లే కాలయమురాలిగా మారి కూతురిని కడతేర్చిన వైనం అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఉంది.
- Noor Mohammed Shaik
- Updated on: May 19, 2026
- 10:14 am
Eid Al Adha 2026: బక్రీద్ సెలవుపై బిగ్ ట్విస్ట్.. పండగ ఆ రోజు కాదు.. ఎప్పుడంటే..?
Bakrid 2026 Date: బక్రీద్ పండుగ తేదీపై తెలుగు రాష్ట్రాల్లో గందరగోళం నెలకొంది. దుల్ హిజ్జా నెలవంక ఆలస్యంగా కనిపించడంతో ఈసారి ఈద్ అల్-అధా (Eid al Adha) పండుగను మే 28న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. ఇప్పటికే మే 27న ప్రకటించిన ప్రభుత్వ సెలవును మార్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
- Noor Mohammed Shaik
- Updated on: May 18, 2026
- 5:17 pm
Viral Video: సింగర్పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు! వైరల్ అవుతున్న వీడియో
కళాకారులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శిస్తే ప్రేక్షకులు చప్పట్లతో, సన్మానాలతో గౌరవించడం సహజం. కానీ, గుజరాత్లో జరిగిన ఒక భజన కార్యక్రమంలో మాత్రం ఓ గాయకుడిపై అభిమానులు ఏకంగా నోట్ల వర్షం కురిపించారు. ఒకరిద్దరు కాదు, అక్కడ ఉన్న భక్తులంతా పోటీపడి మరీ డబ్బుల సంచులను వేదికపైకి విసిరేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి, నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
- Noor Mohammed Shaik
- Updated on: May 16, 2026
- 10:07 am
హైదరాబాద్ ఎండలకు కూల్ కింగ్.. చార్మినార్ దగ్గర ఈ లస్సీ రుచి మామూలు కాదు!
వేసవి వచ్చిందంటే చాలు.. చల్లగా ఏమైనా తాగాలని గొంతు తహతహలాడిపోతోంది. పైగా హైదరాబాద్ నగరంలో ఎండాకాలంలో ఉండే వేడి నుంచి ఉపశమనానికి రెస్టారెంట్లలో నోరూరించే రకరకాల పానీయాల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేస్తారు. అందుకే ఈ సీజన్లో మీకు బాగా ఉపయోగపడేలా ఒక ప్రదేశాన్ని పరిచయం చేయాలి.
- Noor Mohammed Shaik
- Updated on: May 15, 2026
- 11:49 am