టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AajTak, Ndtv లాంటి జాతీయ చానల్స్లో పనిచేసిన అనుభవంతో పాటు హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. టీవీ9 తెలుగులో వివిధ హోదాల్లో రిపోర్టర్గా పనిచేస్తూ 2016లో సీనియర్ కరస్పాండెంట్గా పదోన్నతి పొందాను. ప్రస్తుతం దక్షిణ రాష్ట్రాల నుంచి టీవీ9 నెట్వర్క్ సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
Miss World Contestants: చార్మినార్ అందాలకు సుందరాంగులు ఫిదా.. సెల్ఫీలు దిగి మురిసిపోయిన ముద్దుగుమ్మలు!
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన 109 దేశాల అందగత్తెలు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద సందడి చేశారు.ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ సందర్శన 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు అద్భుతమైన మధురానుభూతులను అందించింది. ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ మధ్యన ఠీవిగా నిలబడి ఉన్న ఈ సొగసైన కట్టడాన్ని చూసిన సుందరాంగులు మంత్రముగ్ధులయ్యారు.
- Noor Mohammed Shaik
- Updated on: May 13, 2025
- 8:42 pm
Hyderabad: కటింగ్ చేయించుకున్నాక డబ్బులు అడిగినందుకు ఎంత పని చేశారో చూడండి…
హెయిర్ కట్ చేయించుకున్నాక డబ్బులు అడిగినందుకు సెలూన్ నిర్వాహకులపై దాడికి పాల్పడ్డారు రౌడీషీటర్లు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ సెలూన్ షాప్ ధ్వంసం చేశారు. అడ్డు వచ్చినవారిపై దాడికి తెగబడ్డారు. యూపీ నుంచి వచ్చి బతుకుదెరువు కోసం వచ్చి సెలూన్ నడుపుకుంటున్నవారిపై తరహా దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: May 13, 2025
- 1:19 pm
Hyderabad: నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!
కాల్షియం కార్బైడ్ ఇది నిషేధిత పదార్థం. కానీ పండ్ల వ్యాపారులు మాత్రం 15 కిలోల మామిడికాయలు పండ్లుగా మారేందుకు కాల్షియం కార్బైడ్కు సంబంధించి చిన్న సాషెట్ను సబ్బు పెట్టెల్లో పెట్టి మగ్గిస్తున్నారు. దీంతో 3,4 రోజుల్లో జరిగే మగ్గింపు ప్రక్రియ కేవలం 1 రోజులోనే పూర్తవుతుంది. ఇదే వ్యాపారులకు దురాశను కలిగించింది.
- Noor Mohammed Shaik
- Updated on: May 12, 2025
- 10:09 pm
Miss World 2025: చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్న 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్..
శనివారం హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పోటీల్లో 120కు దేశాలకు పైగా దేశాల సుందరాంగులు పాల్గొన్నారు. ఇక ఇప్పుడు మంగళవారం నాడు 109 దేశాల కంటెస్టంట్లు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు.
- Noor Mohammed Shaik
- Updated on: May 12, 2025
- 10:06 pm
Uttar Pradesh: ఏం మనుషులు రా బాబు.. నడిరోడ్డుపై మూగజీవిని ఆటోకి తాడుతో కట్టి లాక్కెళ్తూ..
రోజురోజుకీ మానవీయ విలువలు కనుమరుగవుతున్నాయి. సాటి మనిషితోనే కాదు.. చివరికి మూగజీవాల పట్ల కూడా కరుణ, దయ చూపడం మర్చిపోతున్నారు జనాలు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మూగజీవి అని కూడా చూడకుండా ఓ కుక్కను ఆటో వెనక భాగంలో కట్టేసి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ క్రూర సంఘటన మానవతా విలువలకే మచ్చ తెచ్చేలా ఉంది.
- Noor Mohammed Shaik
- Updated on: May 12, 2025
- 4:15 pm
Hyderabad: చార్మినార్ లాడ్ బజార్లో గాజుల సందడి.. మిస్ వరల్డ్ సుందరీమణుల రాకతో కొత్త శోభా!
చార్మినార్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడం..చార్మినార్ లానే ఇక్కడ దొరికే గాజులు కూడా మస్త్ ఫేమస్. అంతెందుకు అసలు చార్మినార్ అంటేనే అందమైన గాజులకు ప్రసిద్ధి. ఇక్కడి లాడ్ బజార్లో దొరికే గాజులకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇక్కడ గాజులు కొనేందుకు వివిద రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. దానికి కారణం ఇక్కడకి మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు రావడం.
- Noor Mohammed Shaik
- Updated on: May 12, 2025
- 2:26 pm
Hyderabad: ప్రాణాలు పోతున్నా పట్టించుకోని బార్ నిర్వాహకులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు!
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. సాధారణంగానే మద్యం తాగడమే తప్పు.. పైగా విచక్షణ మరిచి అతిగా మద్యం సేవించి పబ్లిక్ ప్రదేశాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం ఇంకా తప్పు. అలా ప్రవర్తించి ప్రాణాల మీదికే తెచ్చుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఫుల్లుగా తాగి వైన్షాప్ వద్దనే పడిపోవడంతో గమనించిన షాప్ సిబ్బంది అతన్ని బటయ ఉన్న సందులో వదిలేశారు. అటుగా వెళ్తున్న ఓ వాహనం అతన్ని ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.
- Noor Mohammed Shaik
- Updated on: May 11, 2025
- 12:21 pm
Asaduddin Owaisi: పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హతలేదు.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ
అమాయకుల్ని, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. పాకిస్థాన్ థియరీని తాము ఎప్పుడో తిరస్కరించామని పేర్కొన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని, అమాయకుల్ని చంపే పాక్కు.. ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. భారత్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. పాకిస్తాన్ దాడులు చేస్తే అంతకుమించి భారత్ దాడి చేస్తుందన్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: May 10, 2025
- 3:46 pm
Telangana: ఓరీ దేవుడో ఏసీ పేలుడుతో ఇద్దరికీ తీవ్ర గాయాలు.. ఏం జరిగిందంటే..
ఇప్పుడు నడుస్తున్నది ఎండాకాలం.. ఈ మండుటెండల్లో కాసేపు కరెంట్ పోతే ఉక్కపోతకు ఉక్కిరిబిక్కరి అయిపోతుంటాం. అందుకే ఈ సీజన్లో ఖచ్చితంగా రోజంతా ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడవాల్సిందే.. లేకపోతే క్షణమైనా ఉండలేని పరిస్థితికి వచ్చేశాం. అయితే.. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఆ ఏసీనే ఇప్పుడు కొంప ముంచింది. రిపేర్ ఉందని ఏసీని బాగుచేస్తుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయయ్యాయి. ఏసీ ఏంటి.. అంతలా గాయాలపాలు కావడం ఏంటి అనుకుంటున్నారా? పూర్తి వివరాలు చూద్దాం రండి.
- Noor Mohammed Shaik
- Updated on: May 10, 2025
- 1:04 pm
Hyderabad: పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు.. తీవ్ర ఉద్రిక్తత.. జేసీబీకి అడ్డంగా వెళ్లి..
హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలోని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్బర్నగర్లో అనధికారంగా నిర్మించిన షాపులను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో హైడ్రా చర్యలను ప్రతిఘటిస్తూ స్థానికులు జేసీబీకి ఎదురు నిలిచారు. తమ స్థలాల్లో నిర్మించుకున్న కట్టడాలను కూల్చి వేయొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
- Noor Mohammed Shaik
- Updated on: May 8, 2025
- 3:53 pm
మిస్ వరల్డ్-2025 పోటీలు.. చార్మినార్ సహా 10 ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం..!
ఇదే క్రమంలో సందర్శకుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని సౌత్ జోన్ పోలీసులు చార్మినార్ మరియు పాతబస్తీలోని ఇతర ప్రాంతాలలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను రెండు రోజుల క్రితం పోలీసులు హ్యాకర్లతో సమావేశం నిర్వహించి అన్ని థెల బందీలను మూసివేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఈ రోజు చారిత్రాత్మక కట్టడం చార్మినార్ నుంచి..
- Noor Mohammed Shaik
- Updated on: May 6, 2025
- 5:13 pm
Hyderabad: క్షుద్రపూజలు చేస్తున్నారనీ అనుమానం.. పాన్ వ్యాపారి హత్యకేసులో సంచలన విషయాలు
అనుమానమే పెను భూతమైంది.. ఆ ఫలితమే ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది.. వెంటాడి మరీ చంపేవరకూ వచ్చింది.. ఎట్టకేలకు ఈ దారుణానికి పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. సభ్య సమాజం తల దించుకునేలా హైదరాబాద్ మహానగరంలో క్షుద్రపూజలు చేశారన్న అనుమానం బాధిత బతుకుల్లో చిచ్చు పెట్టింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
- Noor Mohammed Shaik
- Updated on: May 6, 2025
- 2:11 pm