టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AAJ TAK, NDTVలాంటి జాతీయ ఛానల్స్లో పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. TV9లో వివిధ హోదాల్లో రిపోర్టర్గా పనిచేస్తూ 2016లో కరస్పాండెంట్గా పదోన్నతి పొందాను. 2022లో సీనియర్ కరస్పాండెంట్గా, 2023లో స్పెషల్ కరస్పాండెంట్ పనిచేశాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి TV9 నెట్వర్క్ చీఫ్ రిపోర్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
మియాపూర్ భర్త మిస్సింగ్ డ్రామాలో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి చంపి, పాతేసింది భయ్యా!
Miyapur Husband Murder Case: దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో భార్యామణులు భర్తలను హతమార్చుతున్న కథనాలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. పతియే ప్రత్యక్ష దైవంగా భావించే మనదేశంలో రోజుకో ప్రాంతంలో భర్తను దారుణ హత్యలకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కిరాతక ఉదంతం వెలుగుచూసింది..
- Noor Mohammed Shaik
- Updated on: Jul 7, 2026
- 5:21 pm
విందుకు వచ్చారా.. దాడికి వచ్చారా? పెళ్లి హాల్లో రణరంగం.. అతిథుల్లా వచ్చి దాడికి తెగబడ్డ యువకులు!
పెళ్లి అంటే ఆనందం, సందడి, బంధుమిత్రులతో సెలబ్రేషన్.. కానీ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ ఘటన మాత్రం పెళ్లి వేడుకను క్షణాల్లో రణరంగంగా మార్చేసింది. అతిథుల్లా మ్యారేజ్ హాల్లోకి ప్రవేశించిన యువకులు ఒక్కసారిగా దాడికి దిగడంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 6, 2026
- 5:46 pm
Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున 2 తలల పామును చుట్టుముట్టిన కుక్కలు.. ఆ తర్వాత
హైదరాబాద్ పాతబస్తీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అరుదైన రెండు తలల పాము జనావాసంలోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇది విషరహితమైన రెడ్ శాండ్ బోవా జాతికి చెందిన పామని, వర్షాల కారణంగా ఆశ్రయం కోసం బయటకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 6, 2026
- 11:34 am
మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే కన్నీళ్లే..
కాబోయే కోడలు ఆ కుటుంబంలో నవ్వులు తెస్తుందనుకుంటే అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఒక్క దారుణంతో ఆ కుటుంబంలో విరిసిన నవ్వులన్నింటినీ చిదిమేసింది. కాబోయే భార్య చేతిలో మరణించిన కేతన్ అగర్వాల్ కేసులో మరో గుండె పగిలే విషాదం చోటుచేసుకుంది. మనవడి మరణాన్ని తట్టుకోలేక కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ శనివారం రాత్రి కన్నుమూశారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 6, 2026
- 10:57 am
ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్ ఓవైసీ ఉదారతకు అందరూ ఫిదా?
కూతురి పెళ్లి అంటే ఏ తండ్రికైనా ఒకవైపు సంతోషం, మరోవైపు త్వరలోనే తను పరాయి ఇంటికి వెళ్ళిపోతుందనే అంతులేని వేదన. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ జీవితంలోనూ ప్రస్తుతం అలాంటి ఒక చారిత్రక భావోద్వేగ ఘట్టం చోటుచేసుకుంది. వచ్చే నెలలో ఆయన కుమార్తె వివాహం జరగనుంది. లండన్లో పెళ్లి ముగిసిన తర్వాత ఆమె అమెరికాలో స్థిరపడనుంది. కళ్లముందే పెరిగిన కూతురు తనకు ఎంతో దూరం కానుందనే బాధను ఆయన తట్టుకోలేకపోయారు. అయితే, ఒక తండ్రిగా తన మనసులోని ఆ బాధను కేవలం కన్నీటికే పరిమితం చేయకుండా.. తల్లిదండ్రులు లేని వందలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 6, 2026
- 9:23 am
Hyderabad: ఒరేయ్ ఏంట్రా ఇది.. ఈ మూడు బైక్స్ నంబర్స్ గమనించారా..?
ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ను మూడు హోండా యాక్టివా వాహనాలకు ఉపయోగిస్తూ ప్రభుత్వ శాఖలు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురిని హైదరాబాద్ చార్మినార్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నంబర్ ప్లేట్తో ఫైనాన్స్ రికవరీ, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 5, 2026
- 5:48 pm
హైదరాబాద్లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. కరుడుగట్టిన దొంగను ఎలా పట్టుకున్నారో తెలుసా..?
హైదరాబాద్ చంపాపేటలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎవరికీ అనుమానం రాకుండా సైలెంట్గా ఎంట్రీ ఇచ్చిన హర్యానా పోలీసులు.. లోకల్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఒక సీక్రెట్ ఆపరేషన్లో కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థుడు దొరికిపోయాడు. హర్యానాలో భారీ దోపిడీ చేసి ఇన్నాళ్లూ భాగ్యనగరంలో దొరకకుండా తలదాచుకున్న ఆ కిలాడీ దొంగను ఎలా పట్టుకున్నారో తెలుసుకుందాం..
- Noor Mohammed Shaik
- Updated on: Jul 5, 2026
- 1:19 pm
భారీ వర్షంలో వందే భారత్ వీరంగం.. నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన దృశ్యం వైరల్!
సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.. భారీ వర్షాలతో చాలా చోట్ల రైల్వే పట్టాలపై నీరు చేరింది. అలాంటి సమయంలో వరద నీటితో నిండిపోయిన పట్టాలపై వందే భారత్ ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకెళ్లిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైలు వేగంగా వెళ్లడంతో పట్టాలపై నిలిచిన నీరు భారీగా పైకి ఎగిసిపడింది. ఆ నీరు పక్కనే ఉన్న ఫ్లైఓవర్పై వెళ్తున్న కార్లు, ఇతర వాహనాల పై ఎగిసిపడ్డాయి. ఈ దృశ్యం చూసిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 5, 2026
- 11:56 am
ఉన్నట్టుండి ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే.. గుండె ఆగిపోయే సీన్!
ఓ ఇంట్లో ఏకంగా 40 నాగుపాము పిల్లలు బయటపడటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువైనప్పటికీ, ఇన్ని విషసర్పాల పిల్లలు ఒకేచోట కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. అటవీ శాఖ అధికారులు వాటిని సురక్షితంగా రక్షించి అడవిలో విడిచిపెట్టారు. తల్లి పాము ఆ ఇంట్లోనే ఉందా అనే ప్రశ్న స్థానికులను కలవరపెడుతోంది.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 5, 2026
- 10:22 am
Hyderabad: ఉమ్రా యాత్రకు వెళ్లి వచ్చారు.. ఇంట్లో అడుగు పెట్టగానే ఊహించని సీన్..
ఉమ్రా యాత్రకు వెళ్లిన కుటుంబం ఇంట్లో ఎవరూ లేరనే సమాచారాన్ని ఆసరాగా చేసుకున్న సొంత బంధువులే చోరీకి పాల్పడ్డారు. హబీబ్నగర్లో జరిగిన ఈ ఘటనలో రూ.16 లక్షల నగదు, బంగారు ఆభరణాలు సహా మొత్తం రూ.29 లక్షల విలువైన సొత్తును అపహరించారు. సీసీటీవీ ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నగదు, బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 5, 2026
- 8:27 am
Viral Video: మనతో మామూలుగా ఉండదు.. వర్షంలో ఇతడు చేసిన పని చూస్తే నవ్వి నవ్వి పడిపోతారు..
జోరుగా వర్షం పడుతుంది.. చుట్టూ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జనాలు ఇళ్లలోంచి బయటకు రావడానికే జంకుతుంటే ఈ ఉద్యోగి చేసిన పని చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. అంత పెద్ద వర్షంలో ట్యాంకర్తో రోడ్డు పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్నాడు. పూణెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 4, 2026
- 1:01 pm
Tollywood : సెల్ఫీల యుగంలోనూ 150 ఏళ్ల చెక్క కెమెరా హవా.. ఫొటో కోసం బాలీవుడ్ స్టార్లూ క్యూ!
సెల్ఫీలు, వ్లాగ్లతో ఇంటర్నెట్ నిండిపోయిన ఈ ప్రస్తుత యుగానికి భిన్నంగా, కేవలం కొన్ని దశాబ్దాల క్రితం, తమను తాము ఫోటోలు తీయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది. 60, 70, 80వ దశకాలలో, ఢిల్లీలోని చాందినీ చౌక్, బిర్లా మందిర్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు వీధి ఫోటోగ్రాఫర్లతో సందడిగా ఉండేవి. ఈ నైపుణ్యం గల కళాకారులు సామాన్య ప్రజలు, కుటుంబాలు, అన్ని వయసుల వ్యక్తుల జీవితాలను ఫోటోలు తీయడానికి తమను తాము అంకితం చేసుకునేవారు.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 3, 2026
- 12:53 pm