టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AAJ TAK, NDTVలాంటి జాతీయ ఛానల్స్లో పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. TV9లో వివిధ హోదాల్లో రిపోర్టర్గా పనిచేస్తూ 2016లో కరస్పాండెంట్గా పదోన్నతి పొందాను. 2022లో సీనియర్ కరస్పాండెంట్గా, 2023లో స్పెషల్ కరస్పాండెంట్ పనిచేశాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి TV9 నెట్వర్క్ చీఫ్ రిపోర్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
పెళ్లిబట్టలతో ఓయో రూమ్కు వెళ్లిన జంట.. యువతి ఫుడ్ తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేయగా..
పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు.. అనూహ్యంగా ఉరికొయ్యకు వేలాడాడు. చేతిలో పుస్తెలు, ఒంటిపై పెళ్లి బట్టలు సిద్ధంగా ఉన్నాయి.. కానీ ఆ యువకుడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కేపీహెచ్బీలోని ఓయో రూమ్లో చోటుచేసుకున్న ఈ గుండెల్ని పిండేసే ఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Noor Mohammed Shaik
- Updated on: Apr 6, 2026
- 8:56 am
పాక్ నుంచి భారత్లోకి సీక్రెట్ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా..
పాకిస్తాన్ నుంచి భారతదేశానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. సీఐడీ పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్త చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. అద్భుత పనితీరుతో శత్రు దేశం అరాచకాన్ని తుంగలో తొక్కారు అధికారులు. శ్రీ గంగానగర్ సరిహద్దులో భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాని పట్టుకున్నారు. తద్వారా పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా వచ్చిన 12 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 5, 2026
- 9:32 pm
Hyderabad: అమానుషం.. హోటల్ ముందు వచ్చి అడుకుంటున్నాడని.. ఏం చేశారో చూడండి..
ఒక మనిషికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దారుణమైన స్థితికి సమాజం దిగజారుతోంది. ఆర్థిక సాయం చేయలేకపోయినా ఆకలితో ఉన్నవారికి ఇంత భోజనం పెట్టే పెద్ద మనసు కూడా ఎవరికి లేకుండా పోయింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగు చూసింది. అడుకున్నేందుకు వచ్చిన ఓ బిచ్చగాడిపై కనికరం లేకుండా హోటల్ నిర్వాహకుడు వేడి నీళ్లు పోయడం తీవ్ర కలకలం రేపింది.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 4, 2026
- 5:54 pm
Hyderabad: అరేయ్.. ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు.. కట్ చేస్తే..
బైక్ ఒక్కటే.. మహా అయితే.. దానిపై ఇద్దరు వెళ్లొచ్చు.. అతి కష్టం మీద మరొకరు కూర్చోవచ్చు.. కానీ.. ఓ ద్విచక్రవాహనంపై ఐదుగురు యువకులు ప్రయాణిస్తూ.. హల్ చల్ చేశారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ లో చోటుచేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన రాపిడో డ్రైవర్తో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 3, 2026
- 7:08 pm
Hyderabad: ఏంట్రా ఇలా ఉన్నారు.. భార్యతో మాట్లాడిన స్నేహితుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణం జరిగింది.. తన భార్యతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తి తన స్నేహితుడిపై దాడి చేశాడు.. మరికొంత మంది స్నేహితులతో కలిసి.. తీవ్రంగా దాడి చేశాడు.. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన సల్మాన్ అనే వ్యక్తి.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- Noor Mohammed Shaik
- Updated on: Mar 29, 2026
- 9:05 am
హైదరాబాదీలకు అలర్ట్.. మీరు తినే ఉస్మానియా బిస్కెట్లలో విషం.. వెలుగులోకి భయంకర నిజాలు..
కల్తీ.. కల్తీ..కల్తీ..ఎటు చూసినా కల్తీయే.. ఏం తిందామన్నా కల్తీయే..మొన్నటికి మొన్న రెస్టారెంట్లలో ఫుడ్ కల్తీ భయాందోళనలు కలిగించింది.. ఆ తర్వాత సబ్బులు, డిటర్జెంట్లతో పాటు మస్కిటో రైఫిల్స్ కూడా కల్తీ అని తేలింది. ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు కూడా కల్తీమయం అవుతున్నట్టు అధికారుల దాడుల్లో స్పష్టమైంది. తాజాగా ఉస్మానియా బిస్కెట్ల వంతు వచ్చింది.
- Noor Mohammed Shaik
- Updated on: Mar 27, 2026
- 8:11 pm
Madhavi Latha: మరో వివాదంలో మాధవీలత.. ఎయిర్పోర్టులో దుర్గా సూక్తం.. ఏం జరిగిందంటే..?
బీజేపీ నేత మాధవీలత మరోసారి వార్తల్లోకెక్కారు. నిన్న ఢిల్లీ విమానాశ్రయంలోని ప్రేయర్ రూమ్ లో మాధవీలత దుర్గా సూక్తం పఠిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మాధవీలత ప్రేయర్ చేస్తున్నప్పుడు అదే రూమ్ లో ముస్లిం మహిళలు ఉండడంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది.
- Noor Mohammed Shaik
- Updated on: Mar 25, 2026
- 10:04 pm
Telangana: పెట్రోల్ కోసం బంక్కి వెళుతున్నారా..? ఇది తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్..!
హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డ్ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజల్ కొరత ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.
- Noor Mohammed Shaik
- Updated on: Mar 25, 2026
- 5:21 pm
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
యుద్ధం మనవాళికే కాదు.. మూగజీవులకు కూడా కష్టాలు తెచ్చిపెట్టింది. ఉద్రిక్తతల నేపథ్యంలో సొంత దేశాలకు పారిపోతున్న చాలా మంది ప్రవాసులు.. తమ పెంపుడు జంతువులను రోడ్ల మీదే అనాథలుగా వదిలేసి వెళ్లాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా యూఏఈ లాంటి దేశాల్లో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కలు, పిల్లులు ఇప్పుడు వీధుల్లో దిక్కు లేకుండా తిరుగుతున్నాయి. ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెంపుడు జంతువులను భారత్కు సురక్షితంగా తీసుకురావడానికి నిబంధనల్లో వన్-టైమ్ సడలింపు ఇచ్చి, ప్రవాసులకు పెద్ద ఊరట కలిగించింది.
- Noor Mohammed Shaik
- Updated on: Mar 22, 2026
- 4:17 pm
Watch: ఇదేం దౌర్జన్యం..? రసీదు ఇవ్వకుండానే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్.. వీడియో వైరల్
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ మూలన విన్నా.. గ్యాస్ సంక్షోభం గురించే. పశ్చిమాసియా దేశాల్లో భీకర యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. చేసేది లేక ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్ కొరత కారణంగా వ్యాపారం చతికిలపడిన మాట వాస్తవం..
- Noor Mohammed Shaik
- Updated on: Mar 19, 2026
- 7:03 pm
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడో తెలుసా?
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ నగరంలోని నాలుగు ముఖ్యమైన ఫ్లైఓవర్లపై ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ద్విచక్ర వాహనాలు రాత్రి 10 గంటల తర్వాత అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలువాహనదారులు గమనించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు..
- Noor Mohammed Shaik
- Updated on: Mar 16, 2026
- 6:43 pm
Hyderabad: వాట్సప్ మెసేజ్ లొల్లి.. హైదరాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య!
ఆదివారం రాత్రి హైదరాబాద్ మహా నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్ డివిజన్ ఆదర్శ్నగర్ కాలనీ సాయిబాబా ఆలయం సమీపంలో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం (మార్చి 15) రాత్రి సుమారు 8 నుంచి 8.15 గంటల మధ్య జరిగినట్లు సమాచారం..
- Noor Mohammed Shaik
- Updated on: Mar 16, 2026
- 6:40 pm