టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AAJ TAK, NDTVలాంటి జాతీయ ఛానల్స్లో పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. TV9లో వివిధ హోదాల్లో రిపోర్టర్గా పనిచేస్తూ 2016లో కరస్పాండెంట్గా పదోన్నతి పొందాను. 2022లో సీనియర్ కరస్పాండెంట్గా, 2023లో స్పెషల్ కరస్పాండెంట్ పనిచేశాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి TV9 నెట్వర్క్ చీఫ్ రిపోర్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
పాతబస్తీలో నిహారిక సందడి.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందడి రోజురోజుకూ మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది. మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో జరుగుతున్న 217వ వార్షిక బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు సినీ నటి నిహారిక కొణిదెల హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 8, 2026
- 6:44 am
Hyderabad: ఆ అమ్మాయి దుబాయ్లో కాదు.. హైదరాబాద్లోనే మాయమైంది..! సినిమాలను మించిన ట్విస్టులు..
ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన యువతి అదీబా అక్కడే అదృశ్యమైందని భావించిన కుటుంబానికి దర్యాప్తులో షాకింగ్ నిజం తెలిసింది. ఆమె 2025 నవంబర్లోనే హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్, ప్రయాణ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా యువతి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 7, 2026
- 8:56 am
పల్లెలోనే కాదు.. నగరాల్లోనూ కొండ చిలువల హల్చల్! హైదరాబాద్ పాతబస్తీలో..
హైదరాబాద్ పాతబస్తీలో ఒకేరోజు రెండు పాము ఘటనలు కలకలం రేపాయి. హసన్నగర్లో కొండచిలువ ప్రత్యక్షమవగా, మరోవైపు రేషన్ బియ్యం సంచిలో చిన్న పాము కనిపించింది. వర్షాకాలంలో పాముల సంచారం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పాము కనిపిస్తే నిపుణులకు మాత్రమే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 6, 2026
- 4:55 pm
ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!
హైదరాబాద్ మహానగరంలో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉదయం పరిచయం... మధ్యాహ్నం పెళ్లి.. సాయంత్రం షాపింగ్.. రాత్రి డిన్నర్.. ఆ తర్వాత శోభనం.. కానీ తెల్లారేసరికి పెళ్లికూతురు కనిపించకపోవడంతో నవ వరుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విచిత్ర ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 6, 2026
- 12:44 pm
నేనేం చేశా నాన్న.. భార్యతో గొడవపడి.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి.. ఎక్కడంటే?
హైదరాబాద్ నగరంలో వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొన్న ఉప్పుగూడ, నిన్న సౌదాబాద్లో జరిగిన కత్తిపోట్ల ఘటన మరువక ముందే గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి కన్న కొడుకని కూడా చూడకుండా నాలుగేళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేశాడు. గమనించిన స్థానికుడు అతన్ని అడ్డుకొని పోలీసులకు అప్పటించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 5, 2026
- 2:53 pm
Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
హైదరాబాద్లోని టోలిచౌకి పోలీస్స్టేషన్ పరిధిలో 27 ఏళ్ల యువ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ సమీహా వజాహత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. తన నివాసంలో ఉరివేసుకుని కనిపించిన సమీహా మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 5, 2026
- 2:42 pm
హైదరాబాద్లో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి.. వణికిపోయిన జనం!
ఇటీవల హైదరాబాద్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు నగర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు .ఇటీవలే ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మరువక ముందే నగరంలో అలాంటి ఘటనే మరోకటి వెలుగు చూసింది. సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 4, 2026
- 3:59 pm
Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్
హైదరాబాద్ పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం దారుణం వెలుగు చూసింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారి తీసింది. గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 2, 2026
- 6:03 pm
అద్దెకు తెచ్చిన కారుతో బీభత్సం..! వీడియో చూస్తే వణుకుపుట్టాల్సిందే..
హైదరాబాద్లో మరోసారి మైనర్ డ్రైవింగ్ ప్రమాదానికి దారితీసింది. బోరబండలో 17 ఏళ్ల బాలుడు నడిపిన అద్దె కారు అదుపుతప్పి బైక్ను ఢీకొని ఏడు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసింది. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మైనర్కు కారు ఎలా అద్దెకు ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 2, 2026
- 5:12 pm
Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్చేస్తే.. ఫస్ట్నైట్ రోజే..
అతనో మెకానిక్.. సొంతంగా వర్క్షాప్ నడుపుతూ.. తన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. ఇటీవలే ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిశాక భార్యతో ఇంటికి చేరుకున్నాడు. అయితే తెల్లారే సరికి అతనికి ఊహించని షాక్ తగిలింది. మంచంపై ఉండాల్సిన పెళ్లి కూతురు కాస్త కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన భార్య తిరిగి రావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 1, 2026
- 9:30 pm
Hyderabad: వీకెండ్స్లో నెహ్రూ జూపార్క్కు వెళుతున్నారా..? టికెట్ల రేట్లు భారీగా పెరిగాయ్.. ఇప్పటినుంచి ఎంతంటే..?
నెహ్రూ జూలాజికల్ పార్క్ను రోజూ వేలాదిమంది సందర్శిస్తూ ఉంటారు. ఇక వీకెండ్స్లో జనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుంది. అయితే తాజాగా ఎంట్రీ టికెట్ ధరలను అధికారులు పెంచారు. శనివారం నుంచి కొత్త ధరలు అమలు చేయనున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 1, 2026
- 6:13 pm
దుబాయ్లో బంధువులే శత్రువులయ్యారా..? కొడుకు కోసం తల్లిదండ్రుల కన్నీటి పోరాటం!
మంచి భవిష్యత్తు కోసం ఎడారి దేశానికి వెళ్లిన ఓ హైదరాబాదీ కుటుంబం... ఇప్పుడు తమ సొంత బిడ్డ కోసం కోర్టులు, పోలీస్ స్టేషన్లు, జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కొడుకును తిరిగి పొందాలనే తల్లిదండ్రుల పోరాటం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ దంపతులకు స్వంత బంధువుల నుంచే తీవ్ర అన్యాయం ఎదురైంది. ప్రస్తుతం తండ్రి దుబాయ్ జైలులో, తల్లి భారత్లో ఉంటూ తమ కుమారుడి కోసం, భర్త విడుదల కోసం విదేశాంగ శాఖ సాయాన్ని కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
- Noor Mohammed Shaik
- Updated on: Aug 1, 2026
- 9:29 am