టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AAJ TAK, NDTVలాంటి జాతీయ ఛానల్స్లో పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. TV9లో వివిధ హోదాల్లో రిపోర్టర్గా పనిచేస్తూ 2016లో కరస్పాండెంట్గా పదోన్నతి పొందాను. 2022లో సీనియర్ కరస్పాండెంట్గా, 2023లో స్పెషల్ కరస్పాండెంట్ పనిచేశాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి TV9 నెట్వర్క్ చీఫ్ రిపోర్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
Viral Video: సింగర్పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు! వైరల్ అవుతున్న వీడియో
కళాకారులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శిస్తే ప్రేక్షకులు చప్పట్లతో, సన్మానాలతో గౌరవించడం సహజం. కానీ, గుజరాత్లో జరిగిన ఒక భజన కార్యక్రమంలో మాత్రం ఓ గాయకుడిపై అభిమానులు ఏకంగా నోట్ల వర్షం కురిపించారు. ఒకరిద్దరు కాదు, అక్కడ ఉన్న భక్తులంతా పోటీపడి మరీ డబ్బుల సంచులను వేదికపైకి విసిరేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి, నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
- Noor Mohammed Shaik
- Updated on: May 16, 2026
- 10:07 am
హైదరాబాద్ ఎండలకు కూల్ కింగ్.. చార్మినార్ దగ్గర ఈ లస్సీ రుచి మామూలు కాదు!
వేసవి వచ్చిందంటే చాలు.. చల్లగా ఏమైనా తాగాలని గొంతు తహతహలాడిపోతోంది. పైగా హైదరాబాద్ నగరంలో ఎండాకాలంలో ఉండే వేడి నుంచి ఉపశమనానికి రెస్టారెంట్లలో నోరూరించే రకరకాల పానీయాల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేస్తారు. అందుకే ఈ సీజన్లో మీకు బాగా ఉపయోగపడేలా ఒక ప్రదేశాన్ని పరిచయం చేయాలి.
- Noor Mohammed Shaik
- Updated on: May 15, 2026
- 11:49 am
చార్మినార్ లాడ్ బజార్లో వైరల్ అవుతున్న లక్క గాజులు.. ఇన్స్టాగ్రామ్ రీల్స్తో పెరిగిన డిమాండ్
హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఫేమస్.. మరి చార్మినార్ ప్రాంతానికి..? రంగురంగుల్లో మెరిసే గాజులు ఫేమస్. అవును, ఇది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిన మాట. ముఖ్యంగా మహిళలు చార్మినార్ సందర్శనకు వచ్చారంటే.. ఇక్కడ దొరికే గాజులను కొనకుండా వెళ్లరు. కొందరైతే గాజులను కొనడానికే చార్మినార్ ప్రాంతానికి వస్తారంటే అందులో అతిశయోక్తి లేదు. అంతగా ప్రసిద్ధి చెందింది గాజుల కొనుగోళ్లకు చార్మినార్ ప్రాంతం. అయితే.. ఈ మధ్య చార్మినార్ సందుల్లో సరికొత్త మార్పు కనిపిస్తోంది.
- Noor Mohammed Shaik
- Updated on: May 14, 2026
- 5:44 pm
హైదరాబాద్లోనే అద్భుతమైన సన్సెట్ స్పాట్.. ఒక్కసారి హుడా హైట్స్ వ్యూపాయింట్ వెళ్తే ప్రకృతి ప్రేమలో పడిపోతారు!
ప్రకృతిని మన చుట్టూ చాలా మంది ఉంటారు.. మరీ ముఖ్యంగా కొందరికి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అంత అందమైన అనుభూతిని మరింత అందమైన ప్రదేశాల్లో పొందాలని అనుకుని దూర ప్రాంతాలకు సైతం వెళ్తుంటారు. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటి చూడాలనే సందర్భాల్లో అందరికీ మొదట గుర్తొచ్చేది అరకు.
- Noor Mohammed Shaik
- Updated on: May 14, 2026
- 11:07 am
వాట్సప్లో నకిలీ పెళ్లి పత్రిక.. నిజమని నమ్మి తరలివచ్చిన వేలాదిమంది బంధువులు! ఆ తర్వాత సీన్ ఇదే
ఇప్పటివరకు తినే తిండి, తాగే నీరు మాత్రం కల్తీ అనుకున్నాం.. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించడం కూడా చూశాం. డబ్బులకు ఆశ పడి డూప్లికేట్లు తయారుచేసి అనుకున్న పని పూర్తి చేసుకున్న సంఘటనలు కూడా ఎన్నో చూశాం. కానీ, అత్యంత పవిత్రంగా భావించే వివాహ ఆహ్వాన పత్రికకు డూప్లికేట్ ఉంటుందనే విషయం మీరెప్పుడైనా చూశారా.. పోనీ ఎక్కడైనా విన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ, అలాంటి సంఘటన నిజంగా జరిగిందంటే నమ్ముతారా? అది కూడా మన హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకుందంటే మరింత ఆశ్చర్యపోవడంలో తప్పు లేదు..
- Noor Mohammed Shaik
- Updated on: May 12, 2026
- 4:48 pm
మియాపూర్లో విషాదం.. ఒంటరితనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! ఏం జరిగిందంటే..
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మాధురికి సత్యనారాయణ అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.అయితే,..
- Noor Mohammed Shaik
- Updated on: May 12, 2026
- 11:25 am
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా.. రూ.700 కోసం ఇంత దారుణమా.. కిరాతకులు ఏం చేశారో తెలుసా..?
చిల్లర డబ్బుల కోసం జరిగిన గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. అత్తాపూర్ ఏసీ టెక్నీషియన్ హుస్సేన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం రూ.700 గంజాయి వివాదమే ఈ దారుణానికి కారణమని తేలింది. అసలు నిందితులు పోలీసులకు ఎలా చిక్కారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- Noor Mohammed Shaik
- Updated on: May 12, 2026
- 11:23 am
Hyderabad: ఫ్రెండ్ పార్టీకి పిలిచాడని వెళ్లాడు.. కట్చేస్తే.. ఫుల్గా తాగాకా..
డబ్బుల విషంలో ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన వివాదం చివరకు ఒకరి ప్రాణాలే తీసింది. ప్లాన్ ప్రకారం మద్యం సవిద్దాం అని పిలిపించి ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని అతి దారుణంగా రాళ్లతో కొట్టి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: May 12, 2026
- 10:41 am
ORRపై ఘోర ప్రమాదం.. కంటైనర్ను ఢీకొన్న కారు.. నటుడు భరత్ కాంత్తో పాటు మరొకరు మృతి!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం (మే 10) అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదంలో సినీ నటుడు కత్తి భరత్ కాంత్ (31) తోపాటు అతని స్నేహితుడు గూడ సాయి త్రిలోక్ (31) అక్కడికక్కడే మృతి చెందారు.
- Noor Mohammed Shaik
- Updated on: May 11, 2026
- 11:17 am
సినిమా స్టైల్ కిడ్నాప్.. కట్ చేస్తే అదిరిపోయే ట్విస్ట్.. భార్యాబిడ్డలను ఎత్తుకెళ్లింది ఎవరో తెలిసి షాక్!
మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లాలో సినిమా ఫక్కీలో జరిగిన ఒక కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఒక మహిళను, ఆమె మూడు నెలల పసికందును సాయుధులైన కొందరు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమవ్వడం కలకలం రేపింది. అయితే, ఈ కిడ్నాప్ వెనుక ఉన్నది మరెవరో కాదు.. ఆ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కావడం ఈ కథలో అసలు ట్విస్ట్..!
- Noor Mohammed Shaik
- Updated on: May 10, 2026
- 7:25 pm
Hyderabad: రన్నింగ్లో ఉండగా మంటలు.. చూస్తుండగానే కాలిపోయిన కాస్ట్లీ కార్!
హైదరాబాద్ కొత్తగూడ ప్రాంతంలో ఓ మెర్సిడెస్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో కొత్తగూడలోని ఎస్ఎల్ఎన్టీ సమీపంలో ఈ ఘటన జరిగింది
- Noor Mohammed Shaik
- Updated on: May 10, 2026
- 11:11 am
Hyderabad: బహిరంగ రోడ్లపై రిస్కీ బైక్ స్టంట్లు! ఆరుగురు యువకుల అరెస్ట్
Bike Stunts in hyderabad: బహిరంగ రహదారులపై ప్రాణాలకు ప్రమాదం కలిగే విధంగా బైక్ స్టంట్లు నిర్వహిస్తూ, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆరుగురు నిందితులను రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
- Noor Mohammed Shaik
- Updated on: May 9, 2026
- 11:15 am