టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AAJ TAK, NDTVలాంటి జాతీయ ఛానల్స్లో పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. TV9లో వివిధ హోదాల్లో రిపోర్టర్గా పనిచేస్తూ 2016లో కరస్పాండెంట్గా పదోన్నతి పొందాను. 2022లో సీనియర్ కరస్పాండెంట్గా, 2023లో స్పెషల్ కరస్పాండెంట్ పనిచేశాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి TV9 నెట్వర్క్ చీఫ్ రిపోర్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
తెలంగాణను యూపీ అనుకుంటున్నారా..? మా సత్తా ఏంటో చూపిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
బోధన్లో ఎంఐఎం నేతలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2028 ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై ప్రశ్నిస్తూ తెలంగాణ ఏమైనా ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారా? అని నిలదీశారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 27, 2026
- 4:12 pm
Hyderabad: మెట్రో పార్కింగ్లో కలకలం.. కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
హైదరాబాద్లోని మలక్పేట మెట్రో స్టేషన్ పార్కింగ్లో నిలిపి ఉంచిన ఓ బైక్కు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆకతాయిలు కావాలనే బైక్కు నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 27, 2026
- 7:47 am
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. నెట్టింట ఫొటోలు వైరల్
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఓవైసీ తన కొడుకుతో కలిసి స్టేజ్పై కనిపించారు. సభ జరుగుతున్న సమయంలో కొడుకుతో ఓవైసీ మాట్లాడుతున్న దృశ్యాలు, ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 26, 2026
- 10:10 pm
భార్య కళ్లలో బాధ చూసి సిగరెట్ మానేసిన ఓవైసీ.. ఆ తర్వాత మదీనాలో ప్రార్థన!
భార్య కళ్లలో కనిపించిన బాధ చూసి సిగరెట్ అలవాటును పూర్తిగా మానేశానని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ఆ తర్వాత మదీనాలో ప్రార్థన చేసి సిగరెట్తో పాటు హుక్కాకు కూడా పూర్తిగా దూరమైనట్లు చెప్పారు. ఇదే సమయంలో హైదరాబాద్లో పెరుగుతున్న హత్య కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు మూడు పోలీస్ కమిషనరేట్లలో యాంటీ మర్డర్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 26, 2026
- 11:29 am
ఫార్చూనర్ కారులో వస్తాడు.. రోడ్డు ఊడ్చి వెళ్లిపోతాడు..
ఫార్చూనర్ కారులో వచ్చి రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుడు శేషప్పణ్ణ జీవితం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రూ.50 కూలీతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. కష్టపడి పనిచేస్తూ నేడు ఫార్చూనర్ కొనుగోలు చేసే స్థాయికి చేరింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..
- Noor Mohammed Shaik
- Updated on: Aug 25, 2026
- 10:26 am
బిచ్చమెత్తుకుని బతికింది.. మరణం తర్వాత ఆమె నివాసంలో వెతకగా..
జీవితాంతం బిచ్చమెత్తుకుంటూ గడిపిన ఓ వృద్ధురాలు మరణించిన తర్వాత ఆమె ఇంట్లో రూ.8 లక్షలకు పైగా నగదు బయటపడటం మండ్యలో సంచలనం సృష్టించింది. నోట్ల కట్టలు, నాణేల గుట్టలు చూసి బంధువులు, స్థానికులు షాక్కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..
- Noor Mohammed Shaik
- Updated on: Aug 24, 2026
- 5:06 pm
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ.. విషాదాంతం! ఏం జరిగిందంటే..
ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులనే హత్య చేసిన నర్సు సురేఖ జీవితం విషాదాంతమైంది. గతంలో తల్లిదండ్రులకు విషపు సూది మందు ఇచ్చి దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆమె ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చి హాస్టల్లో నివసిస్తోంది. కన్నవారి ప్రాణాలు తీసిన విధానంలోనే తను కూడా సూది మందు ద్వారా జీవితాన్ని ముగించుకోవడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సంగారెడ్డి పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..
- Noor Mohammed Shaik
- Updated on: Aug 24, 2026
- 8:25 am
Hyderabad: గోల్కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు.. బయటపడిన 400 ఏళ్లనాటి సొరంగం!
హైదరాబాద్లోని చారిత్రక కట్టడమైన గోల్కొండ కోట ప్రాంతంలో అక్రమ తవ్వకాలు కలకలం రేపాయి. గోల్కొండ 18 సీడీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 21, 2026
- 1:01 pm
Viral Video: హైదరాబాదీలకు కొత్త సమస్య.. ఈ ప్రాంతాల్లో రాత్రి అయితే నరకమే..
హైదరాబాద్లో దోమల బెడద కొత్త రూపంలో కనిపిస్తోంది. సాధారణంగా ఒక్కో దోమను చూడటం సహజమే. కానీ లంగర్హౌస్లో మాత్రం దోమలు గుంపులుగా చేరి.. సుడిగాలిలా పైకి దూసుకెళ్తున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 20, 2026
- 7:46 am
Hyderabad: సోషల్ మీడియాలో ఇలాంటి మెస్సేజ్లు వస్తున్నాయా..? వెళితే అంతే సంగతులు..
క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ లాభాలు వస్తాయని నమ్మించి మాట్లాడుకుందామని పిలిచారు. చివరికి బెదిరించి రూ.7 లక్షలు బలవంతంగా లాక్కున్నారు. హైదరాబాద్లో ఈ ఘటన జరిగింది. దీంతో ఇలాంటి కేసులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. క్రిప్టో కరెన్సీ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 18, 2026
- 12:26 pm
ఎంతకు తెగించావ్రా.. ఆదివారం రాత్రి లవర్స్ మధ్య గొడవ.. ఊహించని పనిచేసి ప్రియుడు..
హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. బిహార్కు చెందిన రహీనను ఆమె ప్రేమించిన యువకుడు మహమ్మద్ సలామ్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడం, మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
- Noor Mohammed Shaik
- Updated on: Aug 17, 2026
- 9:28 am
Laptop Charging: ఫోన్, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారా?.. ఈ షాకింగ్ ఘటన చూస్తే వణుకు పుట్టాల్సిందే..!
Laptop Charging: ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ విషయంలో అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తుంటారు. రామంతాపూర్ హాస్టల్ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఛార్జింగ్ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా అగ్నిప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉందనే హెచ్చరికను మాత్రం ఈ ఘటన..
- Noor Mohammed Shaik
- Updated on: Aug 16, 2026
- 9:44 pm