AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత్య్సకారుడికి కలిసొచ్చిన వర్షాలు.. వలలో చిక్కిన భారీ చేప.. మనోడికి పండగే

మత్స్యకారులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం మత్స్య సహకార సోసైటీల పరిధిలోని చేరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలిందని , భూగర్భ జలాలు మెండుగా ఉండటంతో చేపలు మంచి సైజ్ లో పెరిగాయని మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా 5 నుండి 10 కేజీల బరువు మాత్రమే పెరుగుతాయని అక్కడక్కడా ఇలాంటి భారీ చేపలు వలకు చిక్కుతాయని స్థానికులు చెబుతున్నారు.

మత్య్సకారుడికి కలిసొచ్చిన వర్షాలు.. వలలో చిక్కిన భారీ చేప.. మనోడికి పండగే
Big Fish
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 22, 2023 | 5:57 PM

Share

నాలుగు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. కొత్తనీరు వచ్చి చేరే సందర్భంలో చేరువుల్లోని చేపలు ఎదురెక్కడం సహజం. అలా చేపల కోసం వలవేసిన మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. భారీ వర్షాలు, వరదలతో మత్స్యకారుడికి ఎలా కలిసి వచ్చింది..? అతడి వలలో చిక్కిన భారీ చేప ఏంటీ..? పూర్తి వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. కొత్త నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని చేపలు కొత్తనీటికి ఎదురెళ్తున్నాయి. చేపలు బయటకి వస్తున్నాయని తెలిసి తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు భారీగా వచ్చి చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. బయటకి వస్తున్న చేపలను వడిసిపట్టి ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పడాల వెంకన్న అనే మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వలవేశాడు. అదృష్టవశాత్తు అతని వలకి భారీ చేప చిక్కింది.

వలను బయటకు తీసి చూడగా, అతి భారీ చేప కనిపించడంతో ఎగిరి గంతేశాడు వెంకన్న. ఆలుగా జాతికి చెందిన చేపగా గుర్తించి తూకం వేయగా ఆ చేప 16కేజీలు బరువుతో తూగింది. దాన్ని సమీప మార్కెట్లో అమ్మగా మూడు వేల రూపాయలు ధర పలికింది. సరదాగా చేపలు పడితే పెద్ద చేప చిక్కడంతో షాక్ కు గురయ్యానని, సరదాకు పట్టిన చేప కాసుల పంట పండించడంతో చాలా సంతోషంగా ఉందన్నారు వెంకన్న. భారీ చేప చిక్కిందన్న విషయం బయటకి పొక్కడంతో చుట్టుపక్కల వారు వచ్చి భారీ చేపతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండి

మత్స్యకారులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం మత్స్య సహకార సోసైటీల పరిధిలోని చేరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలిందని , భూగర్భ జలాలు మెండుగా ఉండటంతో చేపలు మంచి సైజ్ లో పెరిగాయని మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా 5 నుండి 10 కేజీల బరువు మాత్రమే పెరుగుతాయని అక్కడక్కడా ఇలాంటి భారీ చేపలు వలకు చిక్కుతాయని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన మద్యం వ్యాపారి కూతురు
మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన మద్యం వ్యాపారి కూతురు