AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత్య్సకారుడికి కలిసొచ్చిన వర్షాలు.. వలలో చిక్కిన భారీ చేప.. మనోడికి పండగే

మత్స్యకారులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం మత్స్య సహకార సోసైటీల పరిధిలోని చేరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలిందని , భూగర్భ జలాలు మెండుగా ఉండటంతో చేపలు మంచి సైజ్ లో పెరిగాయని మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా 5 నుండి 10 కేజీల బరువు మాత్రమే పెరుగుతాయని అక్కడక్కడా ఇలాంటి భారీ చేపలు వలకు చిక్కుతాయని స్థానికులు చెబుతున్నారు.

మత్య్సకారుడికి కలిసొచ్చిన వర్షాలు.. వలలో చిక్కిన భారీ చేప.. మనోడికి పండగే
Big Fish
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 22, 2023 | 5:57 PM

Share

నాలుగు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. కొత్తనీరు వచ్చి చేరే సందర్భంలో చేరువుల్లోని చేపలు ఎదురెక్కడం సహజం. అలా చేపల కోసం వలవేసిన మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. భారీ వర్షాలు, వరదలతో మత్స్యకారుడికి ఎలా కలిసి వచ్చింది..? అతడి వలలో చిక్కిన భారీ చేప ఏంటీ..? పూర్తి వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. కొత్త నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని చేపలు కొత్తనీటికి ఎదురెళ్తున్నాయి. చేపలు బయటకి వస్తున్నాయని తెలిసి తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు భారీగా వచ్చి చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. బయటకి వస్తున్న చేపలను వడిసిపట్టి ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పడాల వెంకన్న అనే మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వలవేశాడు. అదృష్టవశాత్తు అతని వలకి భారీ చేప చిక్కింది.

వలను బయటకు తీసి చూడగా, అతి భారీ చేప కనిపించడంతో ఎగిరి గంతేశాడు వెంకన్న. ఆలుగా జాతికి చెందిన చేపగా గుర్తించి తూకం వేయగా ఆ చేప 16కేజీలు బరువుతో తూగింది. దాన్ని సమీప మార్కెట్లో అమ్మగా మూడు వేల రూపాయలు ధర పలికింది. సరదాగా చేపలు పడితే పెద్ద చేప చిక్కడంతో షాక్ కు గురయ్యానని, సరదాకు పట్టిన చేప కాసుల పంట పండించడంతో చాలా సంతోషంగా ఉందన్నారు వెంకన్న. భారీ చేప చిక్కిందన్న విషయం బయటకి పొక్కడంతో చుట్టుపక్కల వారు వచ్చి భారీ చేపతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండి

మత్స్యకారులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం మత్స్య సహకార సోసైటీల పరిధిలోని చేరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలిందని , భూగర్భ జలాలు మెండుగా ఉండటంతో చేపలు మంచి సైజ్ లో పెరిగాయని మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా 5 నుండి 10 కేజీల బరువు మాత్రమే పెరుగుతాయని అక్కడక్కడా ఇలాంటి భారీ చేపలు వలకు చిక్కుతాయని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టెన్త్ పరీక్షలు 2026 నిర్వహించే ఇన్విజిలేటర్లకు ఆటోమేషన్‌ రూల్
టెన్త్ పరీక్షలు 2026 నిర్వహించే ఇన్విజిలేటర్లకు ఆటోమేషన్‌ రూల్
ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు..!
ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు..!
విండీస్‌తో మ్యాచ్‌ నుంచి సంజు శాంసన్ ఔట్..?
విండీస్‌తో మ్యాచ్‌ నుంచి సంజు శాంసన్ ఔట్..?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా