Padma Awards 2022: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. బిపన్ రావత్‌కు పద్మ విభూషణ్.. తెలుగువారికి పద్మాలు..

రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఓకే చేశారు. పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు ప్రకటించింది..

Padma Awards 2022: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. బిపన్ రావత్‌కు పద్మ విభూషణ్.. తెలుగువారికి పద్మాలు..
Bipin Rawat
Follow us

|

Updated on: Jan 25, 2022 | 9:01 PM

Padma Vibhushan to CDS Gen Bipin Rawat: రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది పద్మవిభూషణ్‌కు మొత్తం నలుగురి పేర్లను ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ఈ గౌరవం లభించింది. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలలో దివంగత మాజీ CDS జనరల్ బిపిన్ రావత్, (మరణానంతరం), దివంగత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ (మరణానంతరం), రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం) ప్రభా ఆత్రే పేర్లు ఉన్నాయి. పద్మ అవార్డు గ్రహీతల్లో 128 మంది పేర్లు ఉన్నాయి. వీరిలో నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు.

అదే సమయంలో, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీకి పద్మ భూషణ్, మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మెహ్రిషిని పద్మ భూషణ్‌తో సత్కరించనున్నారు. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లను కూడా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనున్నారు. ఇక భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు కృష్ణ లీలా, అతని భార్యను పద్మభూషణ్‌తో సత్కరించనున్నారు. నీరజ్ చోప్రాను పద్మశ్రీతో సత్కరించనున్నారు.

 తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీలు..

ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌ పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు దక్కాయి. అలాగే కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది.

ఇక్కడ జాబితా ఉంది..

ఇవి కూడా చదవండి: Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..

UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్‌పూర్ ఎమ్మెల్యే..

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..