AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Ramdev: ఒత్తిడి.. చిరాకు పోవాలంటే.. మహిళలు తప్పక చేయాల్సిన 5 యోగాసనాలు ఇవే..

ఈ 5 సింపుల్ యోగాసనాలు వేస్తే మీ మనసు క్షణాల్లో ప్రశాంతంగా మారుతుంది. బాలసనం వేస్తే హాయిగా నిద్ర పడుతుంది.. సేతు బంధాసనం హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది! చిరాకు, ఆందోళన పోవాలంటే శవాసనం బెస్ట్.. ప్రతిరోజూ 30 నిమిషాలు యోగా చేస్తే.. మీరు మానసికంగా సూపర్ స్ట్రాంగ్‌గా మారతారు. తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రశాంతత పొందడం ఎలాగో తెలుసుకుందాం..

Baba Ramdev: ఒత్తిడి.. చిరాకు పోవాలంటే.. మహిళలు తప్పక చేయాల్సిన 5 యోగాసనాలు ఇవే..
5 Yoga Poses For Women's Mental Health
Krishna S
|

Updated on: Oct 16, 2025 | 8:43 PM

Share

నేటి మహిళలు ఇంటి పనులతో పాటు ఆఫీస్ బాధ్యతలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. నిరంతర పనిభారం, నిద్ర లేమి, హార్మోన్ల మార్పులు, తమకోసం సమయం దొరకకపోవడం వంటివి ఆందోళన, నిరాశకు దారి తీస్తున్నాయి. ఈ సమస్యలకు యోగా ఒక సహజ నివారణ మార్గం అని యోగా గురువు స్వామి రాందేవ్ సూచిస్తున్నారు. యోగా ఆసనాలు శరీరాన్ని, మనస్సును సమతుల్యం చేసి, ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల చిరాకు తగ్గి, మానసికంగా బలంగా మారుతారు. అదనంగా ధ్యానం, ప్రాణాయామం ఫోకస్, శాంతిని పెంచుతాయి. మానసిక డిటాక్సిఫైకి యోగా అత్యంత ప్రభావవంతమైన పద్ధతి అని బాబా రాందేవ్ చెప్పారు. యోగాకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించే మహిళలు మానసికంగా బలంగా ఉంటారు.

మంచి మానసిక ఆరోగ్యం కోసం 5 ముఖ్య యోగాసనాలు

మహిళలు తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తప్పనిసరిగా సాధన చేయాల్సిన 5 యోగాసనాలు, వాటి ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:

పిల్లల భంగిమ (బాలసనం):

దీన్ని వెంటనే ప్రశాంతతనిచ్చే ఆసనంగా చెబుతారు. ఇది తల, వెన్నెముకపై ఉండే ఒత్తిడిని, ఉద్రిక్తతను తగ్గిస్తుంది. మీరు అలసటగా ఉన్నప్పుడు ఈ ఆసనం వేస్తే గాఢ నిద్రను ప్రోత్సహిస్తుంది. త్వరగా విశ్రాంతి లభిస్తుంది.

కాంట్రారి కరణి ఆసనం

ఈ ఆసనం అలసట నుండి ఉపశమనం కలిగించి శరీరంలో రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. ఇది ఆందోళన, తలనొప్పి, ఒత్తిడిని తగ్గించి, మనస్సు తేలికపడిన అనుభూతిని ఇస్తుంది.

వంతెన భంగిమ (సేతు బంధాసనం):

ఈ ఆసనం వేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. ఇది మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు, చిరాకును తగ్గిస్తుంది. అలాగే శరీరంలో శక్తిని పెంచి, వెన్నెముక కండరాలను బలంగా చేస్తుంది.

శవాసనం:

శవాసన అంటే శవంలా పడుకోవడం. దీనిని మానసిక ప్రశాంతత కల్పించే ఆసనం అని పిలుస్తారు. ఇది మనస్సు, శరీరం రెండింటికీ పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. ప్రతికూల ఆలోచనలను శాంతపరచి, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది.

సుఖాసన (ముందుకు వంపు):

ఈ ఆసనం సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, ఎమోషనల్ స్టెబిలిటీ మెరుగుపడుతుంది. ఇది మనస్సును పూర్తిగా ప్రశాంతపరిచి, మానసిక స్పష్టతను పెంచుతుంది.

యోగా చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి

  • యోగా పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఈ చిట్కాలు పాటించండి:
  • ఖాళీ కడుపుతో లేదా చాలా తేలికపాటి భోజనం తర్వాత మాత్రమే యోగా చేయండి.
  • మొదటగా, మంచి యోగా గురువు నుండి సరైన శిక్షణ, సలహా తీసుకోండి.
  • ప్రతిరోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు యోగా సాధన చేయండి.
  • మెదడుకు విశ్రాంతి ఇవ్వడానికి మొబైల్, టీవీ స్క్రీన్ సమయాన్ని తగ్గించండి.
  • మానసిక ఒత్తిడి తగ్గడానికి లోతైన శ్వాసను అలవాటు చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..