AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: ట్రైలర్ రిలీజ్ కాకముందే ‘లియో’ విధ్వంసం.. అక్కడ రికార్డ్స్ సృష్టిస్తోన్న విజయ్ దళపతి మేనియా..

లియో సినిమా కోసం ఇటు తెలుగు అడియన్స్ సైతం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ బ్యూటీ త్రిష కథానాయికగా నటిస్తోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష మళ్లీ జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 19న ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా త్రిష ఫస్ట్ లుక్ పోస్ట్ర రిలీజ్ చేశారు.

Vijay Thalapathy: ట్రైలర్ రిలీజ్ కాకముందే 'లియో' విధ్వంసం.. అక్కడ రికార్డ్స్ సృష్టిస్తోన్న విజయ్ దళపతి మేనియా..
Vijay Thalapathy, Trisha
Rajitha Chanti
|

Updated on: Oct 05, 2023 | 5:41 PM

Share

వారసుడు సినిమా తర్వాత విజయ్ దళపతి నటిస్తోన్న సినిమా లియో. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రెండోసారి విజయ్ నటిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లియో సినిమా కోసం ఇటు తెలుగు అడియన్స్ సైతం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ బ్యూటీ త్రిష కథానాయికగా నటిస్తోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష మళ్లీ జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 19న ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా త్రిష ఫస్ట్ లుక్ పోస్ట్ర రిలీజ్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్లు లుక్ చూస్తే అర్థమవుతుంది. ఎవరో రక్తం ఒంటిపైన పడడంతో భయంగా చూస్తుంది త్రిష. ఇందులో త్రిష ముందుకంటే మరింత అందంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఓవర్సీస్ లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 40,000 టికెట్స్ సేల్ అయ్యాయి.ఈ క్రమంలోనే ఇంకా థియేటర్లలో సంఖ్య పెంచుతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఈ స్థాయిలో ఏ భారతీయ సినిమాకు టికెట్స్ అమ్ముడుపోలేదని యూకేకు చెందిన నిర్మాణ సంస్థ తెలిపింది. ట్రైలర్ కూడా రిలీజ్ చేయకముందే ఈ స్థాయిలో టికెట్స్ సేల్ కావడం రికార్డ్ అంటూ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ దాదాపు రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమా ఇప్పటికే రెండు వందల కోట్లకు పైగా షేర్ రిటర్న్ వచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఇక విజయ్ కెరీర్ లోనే హైయేస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, గౌతమ్ మీనన్ కీలకపాత్రలు పోషించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.