Tollywood: తాను డైరెక్ట్ చేసిన సినిమాను డిస్ట్రిబ్యూటర్తో కొనవద్దని చెప్పి.. కోటి ఫైన్ కట్టిన దర్శకుడు
ఏ దర్శకుడు అయినా తాను డైరెక్ట్ చేసిన సినిమాకు బజ్ క్రియేట్ చేసి బాగా బిజినెస్ అయ్యేలా చూసుకుంటాడు. కానీ ఈయన మాత్రం తన సినిమా ఫలితంపై నమ్మకం లేకపోవడంతో.. దాన్ని కొనవద్దని ఓ డిస్ట్రిబ్యూటర్కు ఇన్ డైరెక్ట్గా చెప్పేశాడు. ఆఖరికి ఫైన్ కట్టాల్సి వచ్చింది...

రాజమౌళితో చేసిన ‘సై’ సినిమా తర్వాత వరుస ప్లాప్స్ చవిచూశాడు నితిన్. సై తర్వాత నితిన్ వెంటనే చేసిన సినిమా ధైర్యం. దీన్ని తేజ డైరెక్ట్ చేశాడు. రియా సేన్ సిస్టర్ రీమా సేన్ హీరోయిన్గా నటించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. అయితే సినిమా ఫలితాన్ని ముందుగానే ఊహించిన దర్శకుడు తేజ.. ఓ డిస్ట్రిబ్యూటర్తో మూవీ కొనొద్దని చెప్పారట. దీంతో ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనకుండా పక్కకు తప్పుకున్నాడు. సినిమా రిలీజ్ తర్వాత సదరు డిస్ట్రిబ్యూటర్.. విషయాన్ని నిర్మాతలకు తెలియజేశాడట. దీంతో విషయం సీరియస్ అయింది. దీంతో తేజ ఫైన్ కట్టాల్సి వచ్చింది. ధైర్యం కోసం తేజ రూ 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. అందులో ఒక కోటి ఫైన్ కింద కట్టాల్సి వచ్చిందట.
కాగా తన వద్దకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్కు వైఫ్ బాగుందా..? పిల్లలు బాగున్నారా..? సరే నీ ఇష్టం అన్నాను తప్పితే.. తాను ఇకేం చెప్పలేదని తేజ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అతడ్ని సేవ్ చేద్దామనే ఉద్దేశంతోనే అలా అన్నట్లు ఒప్పుకున్నారు. కాగా 2023లో వచ్చిన అహింస తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు తేజ. 2002లో వచ్చిన జయం తర్వాత.. 2017లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నారు తేజ. లవ్ స్టోరీస్ తెరకెక్కించడంతో ఈయనకు ప్రత్యేక శైలి ఉంది.




