AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లేజీ బిస్కెట్స్ తింటూ చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రాని స్టార్ హీరోయిన్ ఆమె. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా ఈ భామ ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు.

పార్లేజీ బిస్కెట్స్ తింటూ చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jun 09, 2025 | 12:11 PM

Share

ఆమె ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయినా కూడా ఈ భామకు ఆఫర్స్ ఏమాత్రం తక్కువ కాదు.. ఇప్పటికే ఈ చిన్నదాని చేతిలో రెండు, మూడు బడా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా పార్లేజీ  బిస్కెట్స్ తింటూ కనిపించింది. తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. విహారయాత్రలో విహరిస్తున్న ఈ చిన్నది తాజాగా తన చిన్నతనాన్ని గుర్తుచేసుకుంది. పార్లేజీ బిస్కెట్స్ తింటూ కనిపించింది.. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇండస్ట్రీలో అందాల బుట్టబొమ్మ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే.. వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు! ఇటీవలే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

ఇవి కూడా చదవండి

పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన రాధేశ్యామ్‌, బీస్ట్, ఆచార్య, సిర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా రీసెంట్ గా వచ్చిన రెట్రో ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. తాజాగా పూజా హెగ్డే విహారయాత్రలో ఉంది. టీ లో పార్లేజీ బిస్కెట్స్ ముంచుకొని తింటున్న వీడియో షేర్ చేసింది. చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటున్నా అంటూ పూజా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై నీచమైన కామెంట్స్.. విశ్వక్ రియాక్షన్
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై నీచమైన కామెంట్స్.. విశ్వక్ రియాక్షన్
ప్రియాంక మాటలకు నవ్వుతూ ప్రధాని మోదీ సమాధానం..
ప్రియాంక మాటలకు నవ్వుతూ ప్రధాని మోదీ సమాధానం..
రాత్రి పడుకునే ముందు లవంగం నోట్లో వేసుకుని నిద్రపోతే ఏమౌతుంది..?
రాత్రి పడుకునే ముందు లవంగం నోట్లో వేసుకుని నిద్రపోతే ఏమౌతుంది..?
ఇస్రోకు "వంద"నం..అభినందనం..!
ఇస్రోకు
ఒకే రాత్రి 3 హత్యలు.. OTTలో ఈక్రైమ్ థ్రిల్లర్‌ను తెగ చూస్తున్నారు
ఒకే రాత్రి 3 హత్యలు.. OTTలో ఈక్రైమ్ థ్రిల్లర్‌ను తెగ చూస్తున్నారు
అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??
అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??
కొత్త సంవత్సరంలో గ్రహాల బలం.. ఆ రాశుల వారికి వ్యాపారాలు ఉత్తమం!
కొత్త సంవత్సరంలో గ్రహాల బలం.. ఆ రాశుల వారికి వ్యాపారాలు ఉత్తమం!
షాకింగ్‌ వీడియో.. గర్భిణిని కొట్టి, బయటకి నెట్టేసిన ఇన్‌స్పెక్టర్
షాకింగ్‌ వీడియో.. గర్భిణిని కొట్టి, బయటకి నెట్టేసిన ఇన్‌స్పెక్టర్
బౌలర్ల భీభత్సం..బ్యాటర్ల విధ్వంసం..శ్రీలంక పని పట్టిన యువ కెరటాలు
బౌలర్ల భీభత్సం..బ్యాటర్ల విధ్వంసం..శ్రీలంక పని పట్టిన యువ కెరటాలు
అసలే అమావాస్య రోజు.. ఆ బంజరు భూమి వద్ద కనిపించిన దృశ్యం చూసి..
అసలే అమావాస్య రోజు.. ఆ బంజరు భూమి వద్ద కనిపించిన దృశ్యం చూసి..