AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ డిజాస్టర్ మూవీ..! రూ.150 కోట్లతో సినిమా తీశారు.. కనీసం హీరో రెమ్యునరేషన్ అంత కూడా రాలేదు..

ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అవ్వవు..

భారీ డిజాస్టర్ మూవీ..! రూ.150 కోట్లతో సినిమా తీశారు.. కనీసం హీరో రెమ్యునరేషన్ అంత కూడా రాలేదు..
Movie
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2025 | 3:22 PM

Share

రీసెంట్ డేస్ లో ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న క్రమంలో సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఊహించని విధంగా కొన్ని బోల్తాకొడుతుంటాయి. మరికొన్ని పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యి సంచలన కలెక్షన్స్ రాబడుతున్నాయి. రీసెంట్ డేస్ లో బాహుబలి, కేజీఎఫ్, కల్కి లాంటి సినిమాలు ఏకంగా 1000కోట్ల వరకు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. కొన్ని సినిమాలు మినిమమ్ వసూల్ చేస్తున్నాయ్. కొన్ని మాత్రం హీరో , హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ రేంజ్ కూడా రాబట్టలేకపోతున్నాయ్. అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి.

ఈ సినిమాను ఏకంగా రూ. 150కోట్లతో తెరకెక్కించారు. ఆ హీరో రేంజ్ ను బట్టి సినిమాను అంత బడ్జెట్ తో తెరకెక్కించారు. భారీ ప్రమోషన్స్ కూడా చేశారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. కానీ హీరో రెమ్యునరేషన్ అంత కూడా రాబట్టలేకపోయింది ఆ సినిమా.. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హిందీలో ఉన్న స్టార్ హీరోల్లో టైగర్ ష్రాఫ్ ఒకరు. టైగర్ ష్రాఫ్ నటించిన సినిమాల్లో గణపత్: పార్ట్ 1 సినిమా ఒకటి.

ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా 2023లో విడుదలైంది. ఈ సినిమాలో టైగర్ కు జోడిగా కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా మొదటి రోజు రూ.2.5 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 18కోట్లు వసూల్ చేసింది. కాగా టైగర్ ష్రాఫ్ ఒకొక్క సినిమాకు రూ. 20కోట్ల నుంచి రూ. 40కోట్ల వరకు తీసుకుంటాడు. ఈ సినిమాకనీసం టైగర్ ష్రాఫ్ ఎమ్యూనరేషన్ అంత కూడా రాబట్టలేకపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us