చైతూ-శేఖర్ కమ్ముల మూవీ ప్రారంభం

నాగచైతన్య 20వ చిత్రం ప్రారంభమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ తన 20వ సినిమాలో నటిస్తుండగా.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు పాల్గొన్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. జూలైలో గానీ ఆగష్టులో గానీ సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఫిదా […]

చైతూ-శేఖర్ కమ్ముల మూవీ ప్రారంభం
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2019 | 12:43 PM

నాగచైతన్య 20వ చిత్రం ప్రారంభమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ తన 20వ సినిమాలో నటిస్తుండగా.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు పాల్గొన్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. జూలైలో గానీ ఆగష్టులో గానీ సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

కాగా మజిలీతో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య.. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి వెంకీమామలో నటిస్తున్నాడు. బాబి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.