ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.? 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు
సినిమా ఇండస్ట్రీలో ఈ ఓ నటుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 50కి పైగా సినిమాల్లో నటించిన ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు గారి ముని మనవడు అని మీకు తెలుసా.? ఆంద్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో నటిస్తున్న నటుడు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు ఉన్నారు. అలాగే రాజకీయ నాయకుల వారసులు కూడా ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు ఏకంగా సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవడు. ఆయన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు ఆయన. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన సుప్రసిద్ధుడే.. తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసి మెప్పించాడు. ఏకంగా 50కి పైగా సినిమాలు చేసి మెప్పించారు ఆయన.. ఇంతకూ ఆయన ఎవరంటే..
తెలుగు సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన నటుల్లో విజయ్ చందర్ ఒకరు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి మెప్పించారు. కరుణామయుడు సినిమాలో ఏసు ప్రభువుగా, భద్రాచలం సినిమాలో శ్రీహరి గురువుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే షిరిడీ సాయి బాబా పాత్రల్లో ఎక్కువగా కనిపించి మెప్పించారు. 1985 లో దర్శకుడు కె.వాసు తీసిన షిరిడీ సాయిబాబా మహత్యం ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. కాగా వికీపీడియా ప్రకారం.. విజయ్ చందర్ కు టంగుటూరి ప్రకాశం పంతులు విజయ్ చందర్ కు తాత అవుతారట.
టంగుటూరి ప్రకాశం పంతులుగారి అన్నయ్య కొడుకు మనవడే విజయ చందర్ అంట. ఈ లెక్కన విజయ చందర్ ముని మనవడు అవుతాడట. 1967లో వచ్చిన సుడిగుండాలు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించారు విజయ్ చందర్. కరుణామయుడు సినిమాలో జీసస్ గా నటించి మెప్పించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్ చందర్ క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం విజయ్ చందర్ సినిమాలు తగ్గించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




