AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను నమ్మి.. ఎన్నో ఆశలతో UAE వెళ్లింది..! కానీ, అక్కడికి వెళ్లాక తెలిసింది..

వివాహం తర్వాత నిరంతర వేధింపులకు గురైన అతుల్య, షార్జా లోని తన అపార్ట్‌మెంట్‌ లో మృత్యువాత పడింది. 40 తులాల బంగారం, బైక్ కట్నంగా ఇచ్చినా వేధింపులు ఆగలేదు. ఆమె భర్త కట్నం కోసం వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

భర్తను నమ్మి.. ఎన్నో ఆశలతో UAE వెళ్లింది..! కానీ, అక్కడికి వెళ్లాక తెలిసింది..
Atulya
SN Pasha
|

Updated on: Jul 21, 2025 | 1:58 PM

Share

పాపం ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని భర్తతో కలిసి దేశం కానీ దేశం వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు కూడా తమ బిడ్డకు మంచి సంబంధం దొరికింది, ఇక మెట్టింట్లో హాయిగా కాపురం చేసుకుంటుంది అనుకున్నారు. కానీ, వరకట్న వేధింపులు ఆమెను బలికొన్నాయి. దేశం కానీ దేశంలో ఓ ఫ్లాట్‌లో శవంగా మారిపోయింది. చావుకు ముందు కూడా నరకం చూసి ఉంటుంది పాపం. కన్నీళ్లు పెట్టించే ఓ వివాహిత హత్య ఘటన యూఏఈలో చోటు చేసుకుంది.

కేరళకు చెందిన 29 ఏళ్ల మహిళ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెంది కనిపించగా, ఆమె భర్త కట్నం కోసం వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. 29 ఏళ్ల అతుల్య షార్జాలోని తన ఫ్లాట్‌లో మృతి చెంది కనిపించింది. ఆమె 19 ఏళ్ల వయసులో 2014లో సతీష్‌ను వివాహం చేసుకుంది. జూలై 18, 19 మధ్య సతీష్ అతుల్యను గొంతు కోసి, కడుపులో తన్ని, ప్లేట్ తో తలపై కొట్టాడంతో ఆమె మరణించిందని ఆమె తల్లి ఆరోపించింది. అతుల్య పెళ్లి అయినప్పటి నుంచి కట్నం కోసం వేధింపులకు గురవుతోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సతీష్ కు కట్నంగా 40 తులాలకు పైగా బంగారం, ఒక బైక్ ఇచ్చామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి