AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: త్వరలోనే రైలు చార్జీల బాదుడు షురూ.. ఆ వర్గాల తీవ్ర ప్రభావం

భారతదేశంలోని ప్రజలకు చౌకైన ప్రయాణ సాధనంగా భారత రైల్వేలు ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే మొదటగా రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తారు. అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత రైలు చార్జీలను సవరించేందకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రైలు చార్జీల పెంపు ఏయే వర్గాల ప్రయాణికులపై ప్రభావం చూపుతుందో? ఓ సారి తెలుసుకుందాం.

Indian Railways: త్వరలోనే రైలు చార్జీల బాదుడు షురూ.. ఆ వర్గాల తీవ్ర ప్రభావం
railway charges
Nikhil
|

Updated on: Jun 28, 2025 | 4:28 PM

Share

జూలై 1, 2025 నుంచి రైలు చార్జీలు పెంచే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ సుదూర మార్గాల్లో ఏసీ క్లాస్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఛార్జీలను పెంచాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం రైల్వే ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ఏసీ క్లాసెస్‌పై కిలోమీటరుకు 2 పైసల పెంపు, స్లీపర్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్) కిలోమీటరుకు ఒక పైస పెంపు, సెకండ్ క్లాస్‌కు అయితే కిలోమీటరుకు 0.5 పైసల పెరుగుదల ఉంటుంది. అయితే ఈ పెంపు కేవలం 500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.  2020 తర్వాత రైలు ధరలు పెరగనున్నాయి. అయితే గతంలో పోలిస్తే ఇది అత్యల్ప పెరుగుదల అని రైల్వే అధికారులు చెబుతున్నారు.

సబర్బన్ రైళ్లతో పాటు నెలవారీ సీజన్ పాస్‌లను ఉపయోగించే ప్రయాణికులపై కొత్త ఛార్జీల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ నిర్ణయం రోజువారీ ప్రయాణానికి లోకల్ ట్రైన్స్‌పై ఆధారపడే లక్షలాది మందికి ఉపశమనాన్ని ఇస్తుంది. డిసెంబర్ 2024లో రైల్వేలపై స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. ఛార్జీల ధరలను ముఖ్యంగా ఏసీ క్లాసెస్‌కు నిర్వహణ ఖర్చులతో సమలేఖనం చేయాలని ఆ కమిటీ మంత్రిత్వ శాఖను కోరింది. 

2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ.92,800 కోట్లు ఆదాయం వస్తుందని రైల్వేలు అంచనా వేస్తున్నాయి. ఛార్జీల పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో అదనంగా రూ.700 కోట్లు ఆదాయం రావచ్చు. రైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులో, సరసమైనదిగా ఉండేలా చూసుకోవడంతో పాటు నష్టాలను తగ్గించడం కోసమే రైలు చార్జీలను పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే