AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali: వారెవ్వా.. పతంజలి హవా.. 200 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల సంపాదన..

గత 200 రోజుల్లో పతంజలి కంపెనీ షేర్లు సుమారు 16శాతం పెరిగాయి. ఫలితంగా దాని వాల్యుయేషన్ రూ.9,000 కోట్ల పెరిగింది. ఇటీవల కంపెనీ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను కూడా జారీ చేసింది. కంపెనీ స్టాక్ వేగంగా పుంజుకుంటుందని, భవిష్యత్తులో మరింత లాభాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Patanjali: వారెవ్వా.. పతంజలి హవా.. 200 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల సంపాదన..
Patanjali Foods' Share Price Soars
Krishna S
|

Updated on: Sep 18, 2025 | 6:32 PM

Share

బాబా రామ్‌దేవ్ కంపెనీ పతంజలి ఫుడ్స్ స్టాక్ మార్కెట్‌లో అద్భుతాలు చేస్తోంది. కేవలం 200 రోజుల్లోనే, కంపెనీ షేర్లు రికార్డు కనిష్ట స్థాయిల నుండి దాదాపు 16శాతం పెరిగాయి. దీనితో కంపెనీ మార్కెట్ విలువ రూ.9,000 కోట్లకు పైగా పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కంపెనీ ఆదాయం పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్ షేర్ ధర రూ.600 పైన ట్రేడవుతోంది. ఇటీవల ఈ కంపెనీ తమ పెట్టుబడిదారులకు మొదటిసారిగా బోనస్ షేర్లను కూడా జారీ చేసింది.

షేర్లలో గణనీయమైన పెరుగుదల

BSEలో పతంజలి ఫుడ్స్ షేర్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కంపెనీ షేర్లు రూ.522.81 వద్ద 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే అప్పటి నుండి ఈ షేర్లు దాదాపు 16శాతం పెరిగి, రూ.83కి పైగా లాభపడ్డాయి. ఈ పెరుగుదల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. కంపెనీ స్టాక్ వేగంగా పుంజుకుంటుందని, భవిష్యత్తులో మరింత లాభాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్ క్యాప్‌లో భారీ వృద్ధి

షేర్ ధరల పెరుగుదలతో పాటు కంపెనీ వాల్యుయేషన్ కూడా భారీగా పెరిగింది. ఫిబ్రవరి 28న కంపెనీ వాల్యుయేషన్ రూ.56,872.74 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ 18న ఇంట్రాడే ట్రేడింగ్‌లో షేర్ ధర రూ.605.65కి చేరుకోవడంతో మార్కెట్ క్యాప్ రూ.65,884.31 కోట్లకు పెరిగింది. అంటే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.9,011.57 కోట్లు పెరిగింది. ప్రస్తుతానికి.. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.65,500 కోట్ల కంటే తక్కువగా ట్రేడవుతోంది.

నేడు ఫ్లాట్‌గా ట్రేడింగ్

సెప్టెంబర్ 18న పతంజలి ఫుడ్స్ షేర్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అయినట్లు తెలుస్తోంది. ఉదయం 11:33 గంటలకు BSEలో కంపెనీ స్టాక్ ₹601.80 వద్ద 0.10శాతం స్వల్ప నష్టంతో ట్రేడ్ అయ్యింది. గురువారం ట్రేడింగ్ రూ.602.95 వద్ద ప్రారంభమైంది. అయితే ట్రేడింగ్ సెషన్‌లో ఇది రూ.605.65 గరిష్ట స్థాయిని తాకింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ స్టాక్ భవిష్యత్తులో కూడా పెరుగుదల ధోరణిని కొనసాగించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్