May 22, 2026
Subhash
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు గట్టి షాకిచ్చింది. ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.
వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను 30 వేల రూపాయల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది.
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడంతోపాటు ప్రతికూల వ్యయాలు పెరుగడం వల్లనే ధరలు సవరించాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
గడిచిన కొన్ని నెలలుగా నిర్వహణ ఖర్చులు అధికమైనప్పటికీ పొదుపు చర్యలకు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒత్తిళ్లు అధికం కావడంతో ధరలు సవరించాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.
UIDAI ఆధార్ కార్డుదారులకు ఒక ముఖ్యమైన ఉపశమనాన్ని అందించింది. UIDAI, myAadhaar పోర్టల్లో ఉచిత ఆధార్ పత్రాల అప్డేట్ సేవను మరో ఏడాది పాటు పొడిగించింది.
గత సంవత్సరం జీఎస్టీ ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా వాహన ధరలను రూ.1.30 లక్షల వరకు తగ్గించిన విషయం తెలిసిందే.
అయితే ఈ ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత వినియోగదారులపై మరింత భారం పడనుంది. అందుకే కారు కొనే వారు ముందుగానే కొనుగోలు చేయడం మంచిది.