ఆధార్‌ ఉన్న వారికి గుడ్‌న్యూస్.. మరో ఏడాది పాటు ఉచితంగానే..!

May 19, 2026

Subhash

UIDAI ఆధార్ కార్డుదారులకు ఒక ముఖ్యమైన ఉపశమనాన్ని అందించింది. UIDAI, myAadhaar పోర్టల్‌లో ఉచిత ఆధార్ పత్రాల అప్‌డేట్ సేవను మరో ఏడాది పాటు పొడిగించింది.

UIDAI 

ఇప్పుడు, ప్రజలు జూన్ 14, 2027 వరకు తమ ఆధార్ సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో ఎటువంటి రుసుము లేకుండా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఎటువంటి రుసుము లేకుండా 

ఇంతకుముందు ఈ సౌకర్యం జూన్ 14, 2026 వరకు అందుబాటులో ఉండేది. సానుకూల స్పందన రావడంతో ఈ సేవను కొనసాగించాలని నిర్ణయించినట్లు UIDAI తెలిపింది.

ఇంతకుముందు

పాత mAadhaar యాప్‌ను వెంటనే నిలిపివేసి, కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా వినియోగదారులకు సూచించింది.

mAadhaar యాప్‌

2027 జూన్ 14 వరకు ఆధార్ అప్‌డేట్ ఉచితంగా లభిస్తుంది. ఆధార్ కార్డుదారులు ఇకపై myAadhaar పోర్టల్ ద్వారా తమ పత్రాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోగలరు.

 2027 జూన్ 14 వరకు 

ఈ సదుపాయం మొదట్లో పరిమిత కాలానికి మాత్రమే అందించింది. కానీ ఇప్పుడు మరో సంవత్సరానికి పొడిగించింది. దీని వల్ల వినియోగదారులకు ఎంతో  ప్రయోజనం చేకూరుతుంది.

ఈ సదుపాయం

ఆధార్ డేటాబేస్ కచ్చితంగా, తాజాగా ఉండేలా చూసేందుకు, ప్రజలు తమ గుర్తింపు మరియు చిరునామాకు సంబంధించిన పత్రాలను అప్‌డేట్ చేసుకోవాలని UIDAI నిరంతరం కోరుతోంది.

ఆధార్ డేటాబేస్

ఉచిత పత్రాల అప్‌డేట్‌ సౌకర్యం myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తమ పత్రాలను అప్‌డేట్‌ చేసుకోవడానికి ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శిస్తే రూ.75 ఉంటుంది.

ఉచిత పత్రాల అప్‌డేట్‌