AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పతంజలి ఆయుర్వేద సంస్థ

పతంజలి ఆయుర్వేద సంస్థ

పతంజలి ఆయుర్వేద సంస్థను 1995లో హరిద్వార్‌లో తన స్నేహితుడు బాలకృష్ణతో కలిసి యోగా గురువు బాబా రాందేవ్ ప్రారంభించారు. యోగా, ఆయుర్వేదం రంగాల అభివృద్ధి లక్ష్యంతో రాందేవ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారత ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద సంస్థ రికార్డు సృష్టించింది. దేశంలో దశాబ్దాలుగా పాతుకపోయిన పలు విదేశీ ఎఫ్ఎంసీజీ సంస్థలకు కూడా పతంజలి శరవేగంగా అభివృద్ధి చెందింది. పతంజలి ఆయుర్వేద పలు విదేశాలకు కూడా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

ఇప్పటికే 1000కి పైగా ఆయుర్వేద ఉత్పత్తులను చేస్తున్న పతంజలి సంస్థ.. మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు విస్తృత పరిశోధనలు చేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థకు దేశంలో 50 వేలకు పైగా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. మరో 5-10 ఏళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్ స్థాయికి కంపెనీని తీసుకెళ్లాలని రాందేవ్, బాలకృష్ణ లక్ష్యంగా పెట్టుకున్నారు. పతంజలి ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో రాందేవ్ కీలకంగా వ్యవహరిస్తున్నా.. ఆ సంస్థ నిర్వహణలో బాలకృష్ణ విశేష కృషిచేస్తున్నారు. పతంజలి ఆయుర్వేద సంస్థలో 94 శాతం వాటాలు బాలకృష్ణదే.

ఇంకా చదవండి

Patanjali: అదంతా తప్పుడు ప్రచారం.. నెయ్యి నాణ్యత వివాదంపై ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్‌కు పతంజలి

పతంజలి తమ ఆవు నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. NABL గుర్తింపు లేని ల్యాబ్‌లో పరీక్షలు జరిగాయని, గడువు ముగిసిన శాంపిల్‌పై కోర్టు ఉత్తర్వులు అన్యాయమని తెలిపింది. RM విలువ లోపాలు సహజమని, ఇది నాణ్యతను ప్రభావితం చేయదని స్పష్టం చేసింది. ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది.

Patanjali: ఆయుర్వేద ప్రొడక్ట్స్ అమ్మకాల్లో పతంజలి హవా.. ఎక్కువమంది కొంటున్నవి ఏంటో తెలుసా..?

పతంజలి ఉత్పత్తులకు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. భారత్‌లో ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా ప్రజలు వినియోగిస్తున్నారు. దీని ద్వారా పతంజలి అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న పతంజలి ప్రొడక్ట్స్‌లో ఏవేవీ ఉన్నాయి? అనే విషయాలు ఇందులో చూద్దాం.

Patanjali: రూ.5 లక్షల కోట్లతో పతంజలి సరికొత్త ప్రణాళిక.. ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర!

Patanjali: ఆయుర్వేద ఉత్పత్తులు ప్రతి భారతీయ ఇంటికి చేరేలా చూడటం, యోగా, ప్రాణాయామం వంటి పురాతన పద్ధతులు ఆధునిక జీవితంలో అంతర్భాగంగా మారేలా చూడటం కంపెనీ లక్ష్యం. పతంజలి ప్రకారం.. వారి లక్ష్యం ఉత్పత్తులను అమ్మడానికే పరిమితం కాకుండా, సంపూర్ణ ఆరోగ్యం..

Organic Farming: సేంద్రీయ వ్యవసాయం నుండి సౌరశక్తి వరకు.. పతంజలి పర్యావరణాన్ని ఎలా కాపాడుతోంది?

Patanjali Organic Farming: నీటి సంరక్షణ, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలకు కూడా తమ కంపెనీ ప్రాధాన్యత ఇచ్చిందని పతంజలి తెలిపింది. నీటిని ఆదా చేసే సాంకేతికతలను కంపెనీ స్వీకరించి, పెద్ద ఎత్తున చెట్ల పెంపకం ప్రచారాలను ప్రారంభించింది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి..

Patanjali: పతంజలి కిసాన్ సమృద్ధి స్కీమ్‌తో రైతుల ఆదాయం డబుల్.. ఎలా అంటే..?

పతంజలి కిసాన్ సమృద్ధి కార్యక్రమం భారతీయ వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో అనుసంధానిస్తూ రైతులను శక్తివంతం చేస్తుంది. సేంద్రీయ వ్యవసాయం, శిక్షణ, మెరుగైన సరఫరా గొలుసు ద్వారా రైతు ఆదాయాలు పెంచడం, నేల ఆరోగ్యాన్ని కాపాడటం, పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం దీని లక్ష్యం. సవాళ్లను అధిగమిస్తూ, ఈ కార్యక్రమం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది.

Swami Ramdev: చిన్న వయసులోనే జుట్టు రాలుతోందా.. స్వామి రామ్‌దేవ్ అద్భుత పరిష్కారాలు ఇవే..

ఈ రోజుల్లో జుట్టు రాలడం ఒక పెద్ద సమస్యగా మారింది. దీనికి స్వామి రామ్‌దేవ్ ఆయుర్వేద పరిష్కారాలను సూచించారు. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి ఆయిల్ మసాజ్, యోగాతో పాటు ఉసిరి, నువ్వులు, అవిసె గింజలు వంటి పౌష్టికాహారం తీసుకోవాలని ఆయన తెలిపారు. సరైన జీవనశైలి, రసాయనాలకు దూరంగా ఉండటం జుట్టు ఆరోగ్యానికి కీలకం.

తరచూ నోటి పూతలతో బాధపడుతున్నారా?.. బాబా రామ్‌దేవ్‌ చెప్పిన ఈ సింపుల్‌ టిప్స్‌తో ఈజీగా చెక్‌పెట్టండి!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో నోటి పూత కూడా ఒకటి. ఇది ట్రీట్మెంట్‌ తీసుకున్న కొన్ని రోజులూ తగ్గినట్టూ అనిపించినా.. పదే పదే వస్తూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాలు మందులు వాడినా ఫలితం పొందలేకపోయారు. అందుకే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు స్వామి రామ్‌దేవ్ కొన్ని ఆయుర్వేద చిట్కాలను సూచించారు. అవేంటి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

  • Anand T
  • Updated on: Nov 15, 2025
  • 1:46 pm

Baba Ramdev: హైబీపీకి చెక్.. బాబా రామ్‌దేవ్ చెప్పిన ఈ 5 యోగాసనాలతో వెంటనే కంట్రోల్..

అధిక రక్తపోటు గుండె, మెదడుకు ప్రమాదకరం. దీనిని నియంత్రించడానికి బాబా రామ్‌దేవ్ సూచించిన అనులోమ విలోమ, భ్రమరి వంటి యోగాసనాలు, ప్రాణాయామం అద్భుతంగా పనిచేస్తాయి. సరైన ఆహారం, నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి జీవనశైలి మార్పులతో కలిపి ఈ యోగాభ్యాసం రక్తపోటును సమర్థవంతంగా అదుపులో ఉంచుతుంది.

‘ఈ కూరతో చిరుధాన్యాల రోటీ తింటే ఒంట్లో రోగాలన్నీ మటాష్‌..’ ఎలా వండాలో చెప్పిన బాబా రాందేవ్‌

శీతాకాలంలో మిల్లెట్స్‌ను ఆహారంగా తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, బలాన్ని అందించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం కూడా వీటివల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతుంది. ఇప్పటికీ రాజస్థాన్‌ సహా దేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాలు స్వచ్ఛమైన నెయ్యితో మిల్లెట్ రోటీలు చేసుకుని భుజిస్తుంటారు. వెల్లుల్లి చట్నీతో దీని రుచి మరింత అద్భుతంగా ఉంటుంది..

యోగా చేస్తున్నారా.. హనుమాన్‌ అంతటి బలం కోసం ఈ ఆసనం ట్రై చేయండి..!

మీ రోజువారి పనుల్లో కొంత సమయం యోగా సాధన కోసం కేటాయిస్తే మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. మొదట, ఇది మీ శరీరాన్ని చురుకుగా, సరళంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది సమతుల్యతను మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యోగా గురువు బాబా రామ్‌దేవ్ కూడా ప్రతి ఒక్కరు తమ మెరుగైన ఆరోగ్యం కోసం యోగా సాధన చేయాలని సూచిస్తున్నారు.