AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పతంజలి ఆయుర్వేద సంస్థ

పతంజలి ఆయుర్వేద సంస్థ

పతంజలి ఆయుర్వేద సంస్థను 1995లో హరిద్వార్‌లో తన స్నేహితుడు బాలకృష్ణతో కలిసి యోగా గురువు బాబా రాందేవ్ ప్రారంభించారు. యోగా, ఆయుర్వేదం రంగాల అభివృద్ధి లక్ష్యంతో రాందేవ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారత ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద సంస్థ రికార్డు సృష్టించింది. దేశంలో దశాబ్దాలుగా పాతుకపోయిన పలు విదేశీ ఎఫ్ఎంసీజీ సంస్థలకు కూడా పతంజలి శరవేగంగా అభివృద్ధి చెందింది. పతంజలి ఆయుర్వేద పలు విదేశాలకు కూడా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

ఇప్పటికే 1000కి పైగా ఆయుర్వేద ఉత్పత్తులను చేస్తున్న పతంజలి సంస్థ.. మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు విస్తృత పరిశోధనలు చేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థకు దేశంలో 50 వేలకు పైగా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. మరో 5-10 ఏళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్ స్థాయికి కంపెనీని తీసుకెళ్లాలని రాందేవ్, బాలకృష్ణ లక్ష్యంగా పెట్టుకున్నారు. పతంజలి ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో రాందేవ్ కీలకంగా వ్యవహరిస్తున్నా.. ఆ సంస్థ నిర్వహణలో బాలకృష్ణ విశేష కృషిచేస్తున్నారు. పతంజలి ఆయుర్వేద సంస్థలో 94 శాతం వాటాలు బాలకృష్ణదే.

ఇంకా చదవండి

Patanjali for Ear Problems: చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుత చికిత్స.. నో సైడ్‌ ఎఫెక్ట్స్‌!

మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం.. చెవి. చెవులు వినికిడికి మాత్రమే కాకుండా శరీర సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ నేటి కాలంలో చెవి సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. మారుతున్న జీవనశైలి, హెడ్‌ఫోన్‌ల అధిక వినియోగం, చెవులను సరిగ్గా శుభ్రం చేయకపోవడం దీనికి ప్రధాన కారణాలు..

Patanjali: 7 రోజుల్లో రూ.1500 కోట్ల లాభం.. పతంజలి షేర్ల జోరుతో ఇన్వెస్టర్ల పంట పండినట్లే..

స్టాక్ మార్కెట్లో పతంజలి ఫుడ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది.. త్రైమాసిక ఫలితాలు వెల్లడైనప్పటి నుండి ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కేవలం ఏడు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.1,500 కోట్లు పెరగడం గమనార్హం. లాభాల్లో 60 శాతం వృద్ధిని నమోదు చేస్తూ మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

Patanjali Foods: పతంజలికి భారీ లాభాలు.. ధనవంతులైన పెట్టుబడిదారులు.. విదేశీ కంపెనీలకు గట్టి పోటీ

Patanjali Foods: రోజువారీ వినియోగ ఉత్పత్తులలో విదేశీ బ్రాండ్లు ఇప్పుడు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. భారతదేశ దంత సంరక్షణ విభాగంలో సగానికి పైగా పతంజలి కోల్‌గేట్‌ను అధిగమించిందని స్వామి రామ్‌దేవ్ స్పష్టం చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో పతంజలి దేశంలో తిరుగులేని నంబర్ వన్ బ్రాండ్‌గా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు..

Patanjali Immuno Charge: రోగనిరోధక శక్తిని పెంచే పతంజలి ఇమ్యునోచార్జ్.. స్వామీ రాందేవ్‌ సూచనలు విన్నారా?

నేటి మారుతున్న జీవనశైలి కారణంగా ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా మందిలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల తరచూ జలుబు, దగ్గు, అలసట, ఇన్ఫెక్షన్లు, బలహీనత వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, అధిక ఒత్తిడి, కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం కూడా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి..

ఎన్నో సమస్యలను దూరం చేసే ప్రాణాయామం.. ప్రతి రోజూ తప్పనిసరి: బాబా రామ్‌దేవ్ ఏమన్నారంటే..

ప్రాణాయామం భారతీయ యోగా సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం.. ఇది శరీరం, మనస్సు రెండింటినీ సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల, యోగా గురువు బాబా రామ్‌దేవ్ సిఫార్సు చేసిన కొన్ని ప్రాణాయామ వ్యాయామాలను అవలంబించడం.. మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకోండి..

Patanjali Lohasava: రక్తహీనతకు ఆయుర్వేదంతోనూ చెక్.. పతంజలి టానిక్‌ సీక్రెట్ చెప్పిన బాబా రాందేవ్‌

రక్తహీనత సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఇది సర్వసాధారణం. రక్తహీనత నుంచి బయటపడేందుకు డాక్టర్లు ఐరన్‌ మందులు, సిరప్‌లు, సప్లిమెంట్లను సూచిస్తుంటారు. అయితే ఆయుర్వేదంలో రక్తహీనతకి నివారణ ఉందా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ సమస్యపై స్వామి రామ్‌దేవ్ తాజాగా ప్రస్తావించారు..

మార్కెట్‌లో తుఫానులా దూసుకుపోతున్న పతంజలి ఫుడ్స్.. 9 నెలల్లో రికార్డు స్థాయిలో ఆదాయం!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో, రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ ఆదాయాల పరంగా రికార్డు సృష్టించింది. తొలిసారిగా, తొమ్మిది నెలల ఆదాయం రూ. 29,000 కోట్లను అధిగమించింది. ఇది ఇంతకు ముందు ఎన్నడూ చూడని రికార్డు. మూడవ త్రైమాసికంలో, కంపెనీ ఆదాయం రూ. 10,500 కోట్లకు చేరుకుంది.

కీమో సైడ్‌ఎఫెక్ట్స్‌ తగ్గాలంటే? చికిత్సతో పాటు చక్కని ఆహారం.. క్యాన్సర్ రోగులకు ఆయుర్వేద సలహాలు

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, అల్లోపతి చికిత్స తప్పనిసరి అయినప్పటికీ, సహాయక చికిత్స కోసం ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. స్వామి రామ్‌దేవ్ బాబా ప్రకారం, ఆయుర్వేదం క్యాన్సర్‌ను నయం చేయదు కానీ, రోగనిరోధక శక్తిని పెంచి, చికిత్స దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. సరైన ఆహారం, జీవనశైలితో రోగులు త్వరగా కోలుకోవచ్చు. బార్లీ నీరు, వీట్ గ్రాస్, పప్పులు వంటివి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆయన సూచిస్తున్నారు.

Baba Ramdev Diet Tips: ఈ ఆహారాలు ‘తెల్లని విషం’.. పూర్ణాయుష్షుకు బాబా రాందేవ్‌ ఆరోగ్య సూత్రాలు ఇవే!

అనారోగ్యకరమైన జీవనశైలి నెమ్మదిగా అనారోగ్యానికి దారితీస్తుంది. ఇది ఏ విధంగా జరుగుతుందో చెప్పలేం. దీంతో డాక్టర్ల వెంట పరుగులు తీస్తాం. ఇది ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాకుండా అపారమైన శారీరక, మానసిక అలసటకు దారితీస్తుంది. అందువల్ల నివారణ చికిత్స కంటే ఉత్తమం. మన జీవితం నుంచి కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లను తొలగిస్తేనే ఇది సాధ్యమవుతుందని బాబా రాందేవ్‌ అంటున్నారు..

Kidney Diseases: మీ కిడ్నీలు కడిగిన ముత్యంలా మారాలంటే ఉలవలు, బార్లీ ఇలా తీసుకోండి.. బాబా రాందేవ్‌

నేటి జీవనశైలి కారణంగా కిడ్నీలో రాళ్లు, మంట, దెబ్బతినడం వంటి సమస్యలు సర్వసాధారమయ్యాయి. నీళ్లు అధికంగా తీసుకోకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక ఐరన్ స్థాయిలు.. వంటి కారణాలు కిడ్నీ సమస్యలకు దోహదం చేస్తాయి. కిడ్నీ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే అవి తీవ్రమైన వ్యాధులుగా మారే ప్రమాదం లేకపోలేదు..

Baba Ramdev: జుట్టు రాలుతోందా.. షాంపూలు మార్చడం కాదు.. బాబా రామ్‌దేవ్ చెప్పిన ఈ సీక్రెట్ పాటించండి..

జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా? రకరకాల షాంపూలు, ఆయిల్స్ వాడి అలసిపోయారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్.. జుట్టు రాలడానికి అసలు కారణం మన శరీరంలోనే ఉంది అంటున్నారు యోగా గురువు బాబా రామ్‌దేవ్. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఇంట్లోనే దొరికే వాటితో జుట్టును మళ్ళీ ఒత్తుగా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం..

Vata Dosha: వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..? వంటింట్లోనే దివ్యౌషధాలు..

పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు స్వామి రాందేవ్ ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేద పద్ధతులను అవలంబించాలని, యోగా సాధన చేయాలని సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో కూడా సహజంగా ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి, ప్రతిరోజూ యోగా సాధన చేయాలని బాబా రాందేవ్ అంటున్నారు. యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన బాబా రాందేశ్‌ మన దేశంలో యోగాకు ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. అందుకే ఆయన వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌ అవుతుంటాయి. ఈ వీడియోల్లో ఆయన వివిధ వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు చికిత్సను ఇంటి చిట్కాల ద్వారా వివరిస్తుంటారు..