పతంజలి ఆయుర్వేద సంస్థ
పతంజలి ఆయుర్వేద సంస్థను 1995లో హరిద్వార్లో తన స్నేహితుడు బాలకృష్ణతో కలిసి యోగా గురువు బాబా రాందేవ్ ప్రారంభించారు. యోగా, ఆయుర్వేదం రంగాల అభివృద్ధి లక్ష్యంతో రాందేవ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారత ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద సంస్థ రికార్డు సృష్టించింది. దేశంలో దశాబ్దాలుగా పాతుకపోయిన పలు విదేశీ ఎఫ్ఎంసీజీ సంస్థలకు కూడా పతంజలి శరవేగంగా అభివృద్ధి చెందింది. పతంజలి ఆయుర్వేద పలు విదేశాలకు కూడా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
ఇప్పటికే 1000కి పైగా ఆయుర్వేద ఉత్పత్తులను చేస్తున్న పతంజలి సంస్థ.. మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు విస్తృత పరిశోధనలు చేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థకు దేశంలో 50 వేలకు పైగా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. మరో 5-10 ఏళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్ స్థాయికి కంపెనీని తీసుకెళ్లాలని రాందేవ్, బాలకృష్ణ లక్ష్యంగా పెట్టుకున్నారు. పతంజలి ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో రాందేవ్ కీలకంగా వ్యవహరిస్తున్నా.. ఆ సంస్థ నిర్వహణలో బాలకృష్ణ విశేష కృషిచేస్తున్నారు. పతంజలి ఆయుర్వేద సంస్థలో 94 శాతం వాటాలు బాలకృష్ణదే.
ఎన్నో రోగాలకు దేవుడిచ్చిన ప్రసాదం సొరకాయ.. బాబా రామ్దేవ్ చెప్పిన రహస్యాలు ఇవే..
యోగా గురువు బాబా రామ్దేవ్ తన ఆయుర్వేద నివారణలకు ప్రసిద్ధి చెందారు. యోగాతో పాటు, బాబా రామ్దేవ్ ఇంట్లోనే వివిధ వ్యాధులు, ఆరోగ్య సమస్యలను ఎలా వదిలించుకోవాలో వివరిస్తూ ఉంటారు. ఇక్కడ, సొరకాయ ఏ వ్యాధుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది..? ఎలా తీసుకోవాలో బాబా రామ్దేవ్ చెప్పారు.. అవేంటో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Jan 15, 2026
- 6:38 pm
Baba Ramdev: చలికాలంలో రక్తహీనతకు చెక్.. బాబా రాందేవ్ చెప్పిన ABC జ్యూస్ మ్యాజిక్ తెలుసా..?
చలికాలంలో గడ్డకట్టే చలి నుంచి తప్పించుకోవడానికి మీరు స్వెటర్లు, దుప్పట్లపై ఆధారపడుతున్నారా? అయితే ఆగండి! మీ శరీరం లోపల రక్తం తక్కువగా ఉన్నా కూడా మీకు ఇతరులకన్నా ఎక్కువ చలి వేస్తుంది. యోగా గురువు బాబా రాందేవ్ చలికాలపు అనారోగ్యాలకు స్వదేశీ పరిష్కారాలను చూపారు. రక్తహీనత నుంచి జీర్ణక్రియ సమస్యల వరకు.. మన వంటింట్లో దొరికే పదార్థాలతో ఎలా చెక్ పెట్టవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- Krishna S
- Updated on: Jan 14, 2026
- 12:32 pm
Patanjali: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. పతంజలి శ్వాసరి వటితో మీ ఊపిరితిత్తులు సేఫ్..
చలికాలం వచ్చిందంటే చాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు విలయతాండవం చేస్తున్నాయి. ఈ గాలి కాలుష్యం నుండి మీ ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి పతంజలి ఆయుర్వేదం ఒక ప్రకృతి సిద్ధమైన పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. అదే శ్వాసరి వటి.. అసలు ఈ ఔషధం ఎలా పనిచేస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Jan 13, 2026
- 3:09 pm
Patanjali: అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్ పెట్టండి..
రోజంతా పని చేసి అలసిపోతున్నారా? వయసు పెరుగుతున్న కొద్దీ నీరసం వేధిస్తోందా? మీ శరీరానికి కావాల్సిన పోషణ, శక్తిని అందించే పతంజలి యౌవనామృత్ వటి గురించి మీకు తెలుసా? జాపత్రి, కుంకుమపువ్వు వంటి అరుదైన మూలికలతో తయారైన ఈ ఔషధం ఎలా పనిచేస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Jan 12, 2026
- 8:40 pm
Patanjali: పంటి సమస్యలకు దివ్యౌషధం.. పతంజలి దంత్మంజన్తో కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే..
నేటి దంత సమస్యలకు పురాతన ఆయుర్వేద విజ్ఞానం ఉత్తమ పరిష్కారం అందిస్తుంది. పతంజలి దివ్య దంత్మంజన్ వంటి సహజ ఉత్పత్తులు చిగుళ్లను బలోపేతం చేసి, బ్యాక్టీరియాను తొలగిస్తాయి. వేప, లవంగం, వజ్రదంతి వంటి మూలికలతో కూడిన ఇది పంటి నొప్పి నుండి ఉపశమనం, తాజా శ్వాసను అందించి దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- Krishna S
- Updated on: Jan 6, 2026
- 5:29 pm
చర్మ సమస్యలతో బాధపడుతున్నారా..? పతంజలి నూనెతో ఇట్టే చెక్ పెట్టొచ్చు.. ఎలా ఉపయోగించాలంటే..
ఉరుకులు పరుగులు నేటి జీవితంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పతంజలి ఆయుర్వేద నూనె అటువంటి పరిస్థితులలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నూనె ఏ సమస్యలకు ఉపయోగపడుతుంది..? దానిని సరిగ్గా ఎలా ఉపయోగించాలి..? అనే వివరాలను తెలుసుకుందాం.
- Shaik Madar Saheb
- Updated on: Jan 4, 2026
- 2:58 pm
బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్.. చలికాలంలో రక్తపోటును అదుపు చేసే రామ్దేవ్ బాబా యోగాసనాలు ఇవే..
ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి బీపీ పెరుగుతుంది. దీనిని నియంత్రించకపోతే గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. స్వామి రామ్దేవ్ సూచించినయోగాసనాలతో పాటు ఉప్పు తగ్గించడం, నడక, నిద్ర ద్వారా బీపీని సహజంగా అదుపులో ఉంచుకోవచ్చు.
- Krishna S
- Updated on: Jan 2, 2026
- 7:13 pm
Patanjali Foods Shares: స్టాక్ మార్కెట్లో దిగ్గజాలను ఓడిస్తున్న పతంజలి.. ఐదేళ్లలో ఎంత సంపాదించిందంటే..
Patanjali Foods Shares: మార్కెట్లో పతంజలి తనదైన శైలిలో దూసుకుపోతోంది. తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటూ లాభాలను గడిస్తోంది. పతంజలి ఫుడ్స్ స్టాక్ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి తన పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందిస్తోంది. గత ఐదు సంవత్సరాలలో చూసి భారీగా సంపాదించుకుంది..
- Subhash Goud
- Updated on: Dec 29, 2025
- 1:53 pm
Patanjali Medicines: తక్కువ ధరల్లోనే పతంజలి ఆయుర్వేద మందులు.. ఎలా ఆర్డర్ చేయాలంటే..!
Patanjali Medicines: ప్రజల బడ్జెట్ను అర్థం చేసుకుని తక్కువ ధరల్లోనే మందులను అందుబాటులోకి తీసుకువస్తోంది పతంజలి. అందుకే ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, మందులు అదనపు తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు దివ్య మధునాషిని వాటి ఎక్స్ట్రా పవర్, దివ్య ఇమ్యునోగ్రిట్, దివ్య మెమరీగ్రిట్ వంటి వాటిపై 4.13% వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అంటే అదనపు పొదుపు కోసం గొప్ప అవకాశం ఉంటుంది.
- Subhash Goud
- Updated on: Dec 23, 2025
- 3:14 pm
Patanjali: 4 రోజులుగా పెరుగుతున్న పతంజలి ఫుడ్స్ షేర్లు.. ఇన్వెస్టర్లకు రూ.3900 కోట్ల లాభం
Patanjali Foods Shares: కంపెనీ షేర్లు వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 15వ తేదీ సోమవారం నుండి కంపెనీ షేర్లు క్రమంగా పెరుగుతున్నాయి. BSE డేటా ప్రకారం.. కంపెనీ షేర్లు డిసెంబర్ 15వ తేదీన రూ.531.20 వద్ద ముగిశాయి..
- Subhash Goud
- Updated on: Dec 19, 2025
- 4:43 pm
Baba Ramdev: జలుబు, దగ్గుతో సమస్యా.. బాబా రాందేవ్ చెప్పిన ఈ చిట్కాలతో క్షణాల్లో చెక్ పెట్టండి!
దేశంలోని చాలా నగరాల్లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో గాలి నాణ్యత చాలా వరకు తగ్గిపోతుంది. దీని వలన జనాలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం పొందేందుకు యోగా గురువు బాబా రాందేవ్. కొన్ని నివారణ చట్కాలను సూచించారు. అవేంటో తెలుసుకుందాం పదండి.
- Anand T
- Updated on: Dec 16, 2025
- 1:28 pm
Gyan Bharatam Mission: పతంజలి వర్సిటీ మరో ఘతన.. జ్ఞాన్ భారతం మిషన్ క్లస్టర్ సెంటర్గా గుర్తింపు
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి విశ్వవిద్యాలయం మరో ఘనత సాధించింది. పతంజలి విశ్వవిద్యాలయాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన జ్ఞాన్ భారతం మిషన్ క్లస్టర్ సెంటర్గా గుర్తించింది. ఈ చొరవకు గాను యోగా గురువు స్వామి రామ్దేవ్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
- Anand T
- Updated on: Dec 15, 2025
- 3:52 pm