పతంజలి ఆయుర్వేద సంస్థ
పతంజలి ఆయుర్వేద సంస్థను 1995లో హరిద్వార్లో తన స్నేహితుడు బాలకృష్ణతో కలిసి యోగా గురువు బాబా రాందేవ్ ప్రారంభించారు. యోగా, ఆయుర్వేదం రంగాల అభివృద్ధి లక్ష్యంతో రాందేవ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారత ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద సంస్థ రికార్డు సృష్టించింది. దేశంలో దశాబ్దాలుగా పాతుకపోయిన పలు విదేశీ ఎఫ్ఎంసీజీ సంస్థలకు కూడా పతంజలి శరవేగంగా అభివృద్ధి చెందింది. పతంజలి ఆయుర్వేద పలు విదేశాలకు కూడా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
ఇప్పటికే 1000కి పైగా ఆయుర్వేద ఉత్పత్తులను చేస్తున్న పతంజలి సంస్థ.. మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు విస్తృత పరిశోధనలు చేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థకు దేశంలో 50 వేలకు పైగా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. మరో 5-10 ఏళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్ స్థాయికి కంపెనీని తీసుకెళ్లాలని రాందేవ్, బాలకృష్ణ లక్ష్యంగా పెట్టుకున్నారు. పతంజలి ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో రాందేవ్ కీలకంగా వ్యవహరిస్తున్నా.. ఆ సంస్థ నిర్వహణలో బాలకృష్ణ విశేష కృషిచేస్తున్నారు. పతంజలి ఆయుర్వేద సంస్థలో 94 శాతం వాటాలు బాలకృష్ణదే.
Baba Ramdev: జలుబు, దగ్గుతో సమస్యా.. బాబా రాందేవ్ చెప్పిన ఈ చిట్కాలతో క్షణాల్లో చెక్ పెట్టండి!
దేశంలోని చాలా నగరాల్లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో గాలి నాణ్యత చాలా వరకు తగ్గిపోతుంది. దీని వలన జనాలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం పొందేందుకు యోగా గురువు బాబా రాందేవ్. కొన్ని నివారణ చట్కాలను సూచించారు. అవేంటో తెలుసుకుందాం పదండి.
- Anand T
- Updated on: Dec 16, 2025
- 1:28 pm
Gyan Bharatam Mission: పతంజలి వర్సిటీ మరో ఘతన.. జ్ఞాన్ భారతం మిషన్ క్లస్టర్ సెంటర్గా గుర్తింపు
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి విశ్వవిద్యాలయం మరో ఘనత సాధించింది. పతంజలి విశ్వవిద్యాలయాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన జ్ఞాన్ భారతం మిషన్ క్లస్టర్ సెంటర్గా గుర్తించింది. ఈ చొరవకు గాను యోగా గురువు స్వామి రామ్దేవ్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
- Anand T
- Updated on: Dec 15, 2025
- 3:52 pm
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్లో బెస్ట్ పిజ్జా.. బాబా రామ్దేవ్ చెప్పిన అద్భుతమైన రెసిపీ ఇదే..
బాబా రామ్దేవ్ యోగా, ఆయుర్వేదం, స్వదేశీ ఉత్పత్తుల గురించి అవగాహన పెంచుతూనే ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు.. అక్కడ ఆయన క్రమం తప్పకుండా ఆరోగ్యం - ఫిట్నెస్ చిట్కాలను పంచుకుంటారు. ఈసారి, యోగా గురువు బాబా రామ్దేవ్ శీతాకాలపు సూపర్ఫుడ్లతో తయారు చేసిన ఆరోగ్యకరమైన పిజ్జా కోసం ఒక రెసిపీని పంచుకున్నారు. అదేంటో చూద్దాం..
- Shaik Madar Saheb
- Updated on: Dec 14, 2025
- 12:02 pm
చలికాలంలో ఆ బాధలు పోవాలంటే.. బాబా రామ్దేవ్ చెప్పిన అద్భుత స్నాక్ తినాల్సిందే..
Baba Ramdev: చలికాలంలో చాలా మంది నీరసంగా, అలసటతో బాధపడతుంటారు. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఈ సమయంలో ఫాస్ట్ ఫుడ్కు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. యోగా గురువు బాబా రామ్దేవ్ చుర్మాను సిఫార్సు చేస్తున్నారు. నెయ్యి, చక్కెర మిల్లెట్ రోటీతో తయారయ్యే ఈ దేశీ చిరుతిండితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
- Krishna S
- Updated on: Dec 12, 2025
- 1:01 pm
Winter Drink: శరీరానికి శక్తినిచ్చే బాబా రాందేవ్ సూపర్ టానిక్ డ్రింక్.. చలికాలంలో తప్పక ట్రై చేయండి..
శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరాల నుంచి రక్షణకు బాబా రామ్దేవ్ అద్భుతమైన 'సూపర్ టానిక్' డ్రింక్ను పరిచయం చేశారు. ఇంట్లో లభించే అల్లం, పసుపు, కుంకుమపువ్వు, తేనె, శిలాజిత్ వంటి సహజ పదార్థాలతో దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, శరీరాన్ని వెచ్చగా ఉంచి చలి నుండి కాపాడుతుంది. పాలు ఇష్టపడని వారికి ప్రత్యామ్నాయంగా నీటితో తయారు చేసుకునే విధానం కూడా ఉంది.
- Jyothi Gadda
- Updated on: Dec 10, 2025
- 1:10 pm
తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయ్.. బాబా రామ్దేవ్ ఏం చెప్పారంటే..
పతంజలి వ్యవస్థాపకుడు - యోగా గురువు బాబా రామ్దేవ్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం గురించి సమాచారాన్ని క్రమం తప్పకుండా అందిస్తారు. ఇప్పుడు, బాబా రామ్దేవ్ ఆరోగ్యంగా ఉండటానికి మీరు తినేటప్పుడు నివారించాల్సిన తప్పుల గురించి వెల్లడించారు. ఆయనేం చెప్పారో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Dec 9, 2025
- 1:40 pm
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? బాబా రామ్దేవ్ చెప్పిన ఈ 4 యోగాసనాలతో వెంటనే ఉపశమనం
ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం అనే సమస్య సర్వసాధారణంగా మారుతోంది. దీనిని విస్మరించకూడదు.. ఎందుకంటే ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో, బాబా రామ్దేవ్ సూచించిన యోగా ఆసనాలు యూరిక్ యాసిడ్ను నియంత్రించడంలో చాలా సహాయపడతాయి.. అవేంటో తెలుసుకుందాం.
- Shaik Madar Saheb
- Updated on: Dec 8, 2025
- 7:09 pm
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు ఇవే..
ఆధునిక జీవనశైలి కారణంగా యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్, ఒత్తిడి ప్రధాన కారణాలు. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి యోగా, జీవనశైలి మార్పులు అవసరం. స్వామి రామ్దేవ్ సూచించిన సూర్య నమస్కారం, భుజంగాసనం వంటి ఆసనాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర గుండెపోటును నివారించడంలో సహాయపడతాయి.
- Krishna S
- Updated on: Dec 8, 2025
- 9:57 am
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్దేవ్ చెప్పిన ఈ యోగాసనాలతో వెంటనే రిలీఫ్..
చాలా మందిని మోకాళ్ల నొప్పి పట్టి పీడిస్తుంది. దీన్ని విస్మరించడం ప్రమాదకరం. యోగా మోకాళ్లకు రక్త ప్రసరణను పెంచి, కీళ్లను బలోపేతం చేస్తుంది. స్వామి రామ్దేవ్ సూచించిన విరాసనం, మకరాసనం వంటి ఆసనాలు మోకాళ్ల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. సరైన జీవనశైలి చిట్కాలు పాటించడం ద్వారా మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
- Krishna S
- Updated on: Dec 6, 2025
- 7:55 pm
Fatty Liver Control: మీరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలతో ఉపశమనం
Fatty Liver Control: ఉష్ట్రసనం ఛాతీ, ఉదర భాగాలను సమర్థవంతంగా తెరుస్తుంది. తద్వారా సాగదీయడం, కాలేయ ప్రాంతానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ ఆసనం బొడ్డు కొవ్వును తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా..
- Subhash Goud
- Updated on: Dec 6, 2025
- 2:08 pm
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా, అలర్జీకి చెక్..
ప్రస్తుత వాయు కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అలెర్జీలు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను పెంచుతోంది. ఈ సమస్యకు యోగా ఒక సహజ పరిష్కారం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి స్వామి రామ్దేవ్ కపాలాభాతి, భుజంగాసనం వంటి యోగాసనాలను, ప్రాణాయామాన్ని సూచిస్తున్నారు. ఈ వ్యాయామాలు ఊపిరితిత్తులను బలోపేతం చేసి, కాలుష్య ప్రభావాల నుండి రక్షిస్తాయి.
- Krishna S
- Updated on: Dec 5, 2025
- 4:08 pm
Patanjali: అదంతా తప్పుడు ప్రచారం.. నెయ్యి నాణ్యత వివాదంపై ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్కు పతంజలి
పతంజలి తమ ఆవు నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. NABL గుర్తింపు లేని ల్యాబ్లో పరీక్షలు జరిగాయని, గడువు ముగిసిన శాంపిల్పై కోర్టు ఉత్తర్వులు అన్యాయమని తెలిపింది. RM విలువ లోపాలు సహజమని, ఇది నాణ్యతను ప్రభావితం చేయదని స్పష్టం చేసింది. ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్లో అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది.
- Krishna S
- Updated on: Dec 1, 2025
- 2:46 pm