AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో రూ.46 కోట్ల‌తో సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్..దేశవాళీ గో జాతుల అభివృద్ధికి పెద్ద పీట..

మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ ద్వారా ఐదేళ్ల కాలంలో రూ. 4614.50 లక్షల కార్పస్ ఫండ్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్ర‌తి రోజు తిరుమ‌ల‌ శ్రీవేంకటేశ్వర స్వామి అన్ని సేవల‌కు 60 నుంచి 100 కిలోల నెయ్యి, మూడు వేల‌ లీటర్లపాలు దేశవాళీ గో జాతుల నుండి ఉత్ప‌త్తి చేయ‌డానికి దేశవ‌ళి గోవుల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీటీడీ ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు.

తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో రూ.46 కోట్ల‌తో సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్..దేశవాళీ గో జాతుల అభివృద్ధికి పెద్ద పీట..
Tirumala Temple
Raju M P R
| Edited By: |

Updated on: Oct 18, 2023 | 1:54 PM

Share

తిరుమల18, అక్టోబరు 2023: దేశవాళీ గో జాతుల అభివృద్ధిలో టిటిడి మరో అడుగు ముందుకేసింది. జన్యుపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణ శాలలో జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, టీటీడీ సంయుక్తంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తిరుమలలో టిటిడి ఈవో ధర్మారెడ్డి అధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, శ్రీ‌జ మ‌హిళా మిల్క్ ప్రొడ్యుస‌ర్ ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌దేవి, ఎన్‌డిడిబి ఎండి డా. దేవానంద్‌, టిటిడి జేఈవో సదా భార్గవి, ఎఫ్ఎ అండ్ సిఎవో బాలాజి తో చర్చించారు.

Ttd Board Members

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ.. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ ద్వారా ఐదేళ్ల కాలంలో రూ. 4614.50 లక్షల కార్పస్ ఫండ్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్ర‌తి రోజు తిరుమ‌ల‌ శ్రీవేంకటేశ్వర స్వామి అన్ని సేవల‌కు 60 నుంచి 100 కిలోల నెయ్యి, మూడు వేల‌ లీటర్లపాలు దేశవాళీ గో జాతుల నుండి ఉత్ప‌త్తి చేయ‌డానికి దేశవ‌ళి గోవుల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీటీడీ ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు.

జన్యు మార్పిడి ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృత్రిమ గర్భధారణ, పిండ బదిలీ వంటి అధునాతన పునఃరుత్పత్తి సాంకేతికతలపై కేంద్రం దృష్టి సారిస్తోంద‌న్నారు. జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, డెయిరీ సర్వీసెస్, రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఎన్‌డిడిబి విడుదల చేసిన నిధుల ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుందన్నారు ఈవో ధర్మారెడ్డి. టీటీడీకి చెందిన ఎస్వీ గోసంరక్షణ శాలలో ఇప్పటికే దేశీ గోవుల పెంపకం, అభివృద్ధి దిశగా అనేక‌ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..