AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pattikonda Politics: లోకేష్ పాదయాత్రకు ముందు.. పత్తికొండలో పొలిటికల్ హీట్.. అసలేం జరిగిందంటే..?

కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంచార్జ్ మధ్య రాజకీయం పీక్ స్టేజికి వెళ్లింది. నియోజక అభివృద్ధి దగ్గర నుంచి.. అనేక అంశాలపై ఆరోపణలు.. సవాళ్ల పర్వం మొదలైంది.

Pattikonda Politics: లోకేష్ పాదయాత్రకు ముందు.. పత్తికొండలో పొలిటికల్ హీట్.. అసలేం జరిగిందంటే..?
Pattikonda Politics
Shaik Madar Saheb
|

Updated on: Apr 13, 2023 | 7:29 AM

Share

కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంచార్జ్ మధ్య రాజకీయం పీక్ స్టేజికి వెళ్లింది. నియోజక అభివృద్ధి దగ్గర నుంచి.. అనేక అంశాలపై ఆరోపణలు.. సవాళ్ల పర్వం మొదలైంది. దీంతో పత్తికొండలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే శ్రీదేవి.. టీడీపీ నేత శ్యాంబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నారా లోకేష్ పై విమర్శలు చేసిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి.. పత్తికొండ టిడిపి ఇన్చార్జి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యామ్‌బాబు సవాల్ విసిరారు. నారా లోకేష్‌పై ఎమ్మెల్యే శ్రీదేవి పలు ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్‌ ఇస్తూ శ్యామ్‌బాబు రంగంలోకి దిగారు.

నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే వైస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి భయం పట్టుకుందనీ.. పాదయాత్ర జరిగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలల అవినీతి బయట పెడుతుంటే ఈమె భాగోతం కూడా బయటపడుతుందని ముందే భయపడుతోందని ఆరోపించారు శ్యామ్‌బాబు. 53 చెరువులకు నీళ్లు, పత్తికొండకు తాగు నీరు, ప్రతి గ్రామానికి రోడ్లు, వేసిన చరిత్ర తమదే అన్నారు. పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, రోడ్లు వెడల్పు సహా పలు అంశాలను ప్రస్తావించారు. నాలుగు సంవత్సరాల్లో పత్తికొండ అభివృద్ధి శున్యమనీ.. కేవలం టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. పత్తికొండ నాలుగు స్తంభాల దగ్గర బహిరంగ చర్చకు సిద్ధమా.. అంటూ పత్తికొండ టీడీపీ ఇంఛార్జి కె.ఈ. శ్యాంబాబు సవాల్ విసిరారు.

వీళ్లిద్దరి మధ్య సవాళ్లు, ఆరోపణలతో ఏడాది ముందే పత్తికొండలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..