AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona: ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..!

AP Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక దేశంలోని రాష్ట్రాలో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నాయి. ఒక వైపు వ్యాక్సినేషన్‌, మరో వైపు..

AP Corona: ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..!
Subhash Goud
|

Updated on: Jul 18, 2021 | 5:38 PM

Share

AP Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక దేశంలోని రాష్ట్రాలో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నాయి. ఒక వైపు వ్యాక్సినేషన్‌, మరో వైపు లాక్‌డౌన్‌ ఆంక్షలు తదితర కఠినమైన చర్యల వల్ల ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి అదుపులో వచ్చింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,05,024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,974 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక తాజాగా కోవిడ్‌తో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మొత్తం 17 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,132 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1940096 ఉండగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 24,708గా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో 3,290 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1902256 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,35,93,055 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

తాజాగా జిల్లాల వారిగా నమోదైన కేసులు

అనంతపురం జిల్లాలో-98, చిత్తూరు -501, ఈస్ట్‌గోదావరి -577, గుంటూరు -179, కడప-106, కృష్ణా -311, కర్నూలు -65, నెల్లూరు -282, ప్రకాశం -349, శ్రీకాకుళం -73, విశాఖ – 120, విజయనగరం – 33, వెస్ట్‌గోదావరి -280 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కాగా, గతంలో ఏపీ రాష్ట్రంలో 20వేలకుపైగా నమోదయ్యే కేసులు.. ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అనేకమైన చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించినా.. ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో కొంత కఠిన ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. కరోనాను మిరంతగా కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. గతంలో మాస్కులు ధరించనివారికి జరిమానా కూడా విధించారు. కరోనా కట్టడికి పోలీసులు కూడా తీవ్రమైన చర్యలు చేపట్టారు. ఇలాంటి చర్యలతో ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.

Ap

ఇవీ కూడా చదవండి

India Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో 518 మంది మృత్యువాత..

Covid-19 Vaccination: భారత్ మరో మైలురాయి.. 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సినేషన్‌..

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!