AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccination: భారత్ మరో మైలురాయి.. 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సినేషన్‌..

India Covid-19 Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందన్న సూచనలతో ప్రభుత్వం

Covid-19 Vaccination: భారత్ మరో మైలురాయి.. 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సినేషన్‌..
Covid 19 Vaccination
Shaik Madar Saheb
|

Updated on: Jul 18, 2021 | 9:46 AM

Share

India Covid-19 Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందన్న సూచనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ముమ్మరంగా చేపడుతోంది. అంతేకాకుండా టీకాల కొరత ఏర్పడకుండా ఉత్పత్తి, సరఫరా ప్రక్రియపై కూడా నిరంతరం సమీక్షిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 40,44,67,526 మందికి టీకా డోసులను అందించినట్లు వెల్లడించింది. వీటిలో.. శనివారం ఒక్కరోజే 46.38 లక్షల మందికి టీకా అందించినట్లు వెల్లడించింది. వారిలో 21,18,682 మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి మొదటి డోసు.. 2,33,019 మందికి రెండో డోసు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను దేశంలో జనవరిలో ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరు నెలలు పూర్తైంది. కానీ దేశ జనాభాలో కేవలం దాదాపు ఆరు శాతం మంది ప్రజలకే ఇప్పటివరకు రెండు డోసుల వ్యాక్సిన్ లభించినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 40 లక్షల మందికి టీకాలను అందిస్తున్నారు.

కాగా, ఈ ఏడాది చివరి నాటికి 70 శాతం మంది ప్రజలకు టీకా వేయాలన్న లక్ష్యాన్ని అందుకోవాలంటే రోజూ 85 లక్షల నుంచి 90 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఉత్పత్తి, సరఫరాలో జాప్యం కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త మందకొడిగా కొనసాగుతోంది. కాగా.. ప్రస్తుతం ఒక డోసు వేసుకున్న వారు జనాభాలో 17 శాతం మంది వరకు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

Also Read:

Tokyo Olympics 2021: ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం.. మరో ఇద్దరికి పాజిటివ్..

Parliament Monsoon Session 2021: రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు.. ఈ ఉదయం అఖిలపక్ష సమావేశం..

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!