Parliament Monsoon Session 2021: రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు.. ఈ ఉదయం అఖిలపక్ష సమావేశం..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి ఆగస్ట్‌ 13 వరకు ఈ సెషన్స్‌ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం ఆల్‌పార్టీ మీటింగ్‌ జరగనుంది.

Parliament Monsoon Session 2021: రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు.. ఈ ఉదయం అఖిలపక్ష సమావేశం..
Parliament Monsoon Session
Follow us

|

Updated on: Jul 18, 2021 | 9:25 AM

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి ఆగస్ట్‌ 13 వరకు ఈ సెషన్స్‌ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం ఆల్‌పార్టీ మీటింగ్‌ జరగనుంది. కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని విపక్షాలను కోరనున్నారు ప్రధాని మోడీ. మరోవైపు అఖిలపక్ష నేతలతో సమావేశమవనున్నారు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా. సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని సభ్యులను కోరనున్నారు.  మొత్తం 19 రోజులు సమావేశాలు జరగనున్నాయి.

ఇక ఇవాళ కాంగ్రెస్‌ ఎంపీలతో సమావేశమవనున్నారు అధినేత్రి సోనియాగాంధీ. వర్చువల్‌గా నిర్వహించే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు పాల్గొననున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ సమావేశాల్లో 15 బిల్లులను కేంద్రం..పార్లమెంటు ముందుకు తీసుకురానుంది.

కరోనా థర్డ్‌వేవ్‌ భయాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ తరువాత వచ్చిన తొలి సమావేశాలు ఇదే కావడం విశేషం. అలా పలువురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించాక సభలో ప్రతిపక్షాలను తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న తొలి పార్లమెంట్‌ సమావేశాలూ ఇవే. అలా ఈ ఏడాది జరగనున్న వర్షాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం తన అజెండాను ముందుకు తీసుకురావాలనీ, ప్రతిపక్షాలు తమ వాణిని వినిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనీ ప్రయత్నించే వేళ… మొత్తం 19 రోజులు పార్లమెంట్‌ సమావేశం కానుంది.

ఇవి కూడా చదవండి: viral video: కుక్కలు వెంటాడితే ఇలా కూడా చేస్తారా.. యువతి చేసిన పని చూస్తే మతి పోవడం ఖాయం..

IRCTC Tatkal Ticket: ఈ చిన్న చిట్కాతో తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. ఓ సారి మీరు ట్రై చేయండి..

Tirumala Laddu: కొత్త ప్యాకింగ్‌లో తిరుమల లడ్డూ.. కూరగాయల వ్యర్థాలతో లడ్డు బ్యాగ్.. ఎలా తయారు చేస్తారో తెలుసా..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు