AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur: మణిపూర్‌లో శాంతి మంత్రం జపిస్తోన్న కేంద్రం.. గవర్నర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు..

మణిపూర్‌ గవర్నర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ శాంతి స్థాపన కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు సభ్యులుగా ఉంటారు.

Manipur: మణిపూర్‌లో శాంతి మంత్రం జపిస్తోన్న కేంద్రం.. గవర్నర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు..
Assam Cm
Surya Kala
|

Updated on: Jun 11, 2023 | 7:06 AM

Share

మణిపూర్‌ అల్లర్లతో అట్టుడుకుతోంది.. హింసాత్మక ఘటనలతో అలజడులు రేపుతోంది. శుక్రవారం సైతం ముగ్గురు చనిపోయారు. దీంతో.. కేంద్రం శాంతి మంత్రం జపిస్తోంది.. జాతుల మధ్య శాంతి స్థాపన దిశగా కేంద్రం ఓ కమిటీని నియమించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల మణిపూర్‌లో పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి శనివారం కేంద్ర హోం శాఖ నుంచి..శాంతి స్థాపన కమిటీ ప్రకటన జారీ అయ్యింది. పౌరుల మధ్య సామాజిక ఐక్యత, పరస్పర అవగాహనను శాంతి కమిటీ బలోపేతం చేస్తుందని హోంశాఖ తెలిపింది.

మణిపూర్‌లో మే 3 నుంచి దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు సుమారు 100 మంది చనిపోగా, 300 మందికిపైగా గాయపడ్డారు.  35,000 మంది నిర్వాసితులయ్యారు. మణిపూర్‌ గవర్నర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ శాంతి స్థాపన కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు సభ్యులుగా ఉంటారు.

రాష్ట్రంలో శాంతి సూత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో డాక్టర్ శర్మ తన మణిపూర్ కౌంటర్ నొంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్, అనేక మీతేయ్, నాగా గ్రూపుల నాయకులతో పాటు ఎమ్మెల్యేల బృందాన్ని కలిశారు. ఒకరినొకరు సంప్రదించుకోవడం ద్వారా మణిపూర్‌లో వీలైనంత త్వరగా పరిస్థితిలు సాధారణ స్థితికి తీసుకురావడంపై సమావేశం దృష్టి కేంద్రీకరించిందని మణిపూర్ బిజెపి నాయకుడు ఒకరు చెప్పారు.  అస్సాం సీఎం వచ్చే వారం చురచంద్‌పూర్, ఇతర కుకీ-ఆధిపత్య ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

“ఈశాన్య రాష్ట్రాల శ్రేయస్సు కోసం మణిపూర్‌లో శాంతి చాలా ముఖ్యమైనది. మణిపూర్‌లో చూసిన పరిస్థితుల ఆధారంగా ఆధారంగా శాంతిని పునరుద్ధరించడానికి సాధ్యమయ్యే చర్యలపై నివేదికను సమర్పిస్తాను, ”అని డాక్టర్ శర్మ అన్నారు.

‘కుకిలాండ్’ను వ్యతిరేకిస్తూ.. మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఇంఫాల్‌లో ఉన్న 24 మంది ఎమ్మెల్యేలతో మళ్లీ చర్చలు ప్రారంభించారు, రాష్ట్రాన్ని విభజించవద్దని కేంద్రానికి నచ్చజెప్పేందుకు వివిధ వర్గాల వారు న్యూఢిల్లీకి వెళ్లాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక కమ్యూనిటీ ఆధారిత పరిపాలన కోసం 10 మంది కుకీ ఎమ్మెల్యేలు ‘కుకిలాండ్’ డిమాండ్‌ను తెరపై తీసుకొచ్చారు. అంతేకాదు దీనిని ప్రచారం చేస్తున్నారు. ఈ డిమాండ్ ను నాగా ఎమ్మెల్యే లు వ్యతిరేకిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..