AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోంగూర చేపల పులుసు ఇలా వండితే ఆ సమస్యలన్ని మాయం.. ఓ సారి ట్రై చేయండి

గోంగూర తినడానికి పుల్ల పుల్లగా ఉంటుంది దీనితో చేపల పులుసు చేస్తే రుచికరంగా ఉంటుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఇప్పటికి ఎంతో మంది ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 28, 2026 | 7:49 PM

Share

కావాల్సిన పదార్ధాలు : 500గ్రాములు పచ్చి చేపలు, ఒక కట్ట గోంగూర, ఉల్లిపాయలు,  రెండు టమాటాలు, రెండు కప్పులు చింత పండు రసం, పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఉప్పు,  అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : 500గ్రాములు పచ్చి చేపలు, ఒక కట్ట గోంగూర, ఉల్లిపాయలు, రెండు టమాటాలు, రెండు కప్పులు చింత పండు రసం, పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా పచ్చి చేపలను తీసుకుని ఉప్పుతో ఒకసారి, పసుపుతో ఒకసారి కడిగి శుభ్రపరచుకోవాలి ఇలా చేస్తే దీని నీచు వాసన రాకుండా ఉంటుంది.

ముందుగా పచ్చి చేపలను తీసుకుని ఉప్పుతో ఒకసారి, పసుపుతో ఒకసారి కడిగి శుభ్రపరచుకోవాలి ఇలా చేస్తే దీని నీచు వాసన రాకుండా ఉంటుంది.

2 / 5

కడిగిన చేపలను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో నూనె, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, చింత పండు రసం పోసి స్టవ్ వెలిగించి పొయ్యి మీదే పెట్టాలి.

కడిగిన చేపలను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో నూనె, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, చింత పండు రసం పోసి స్టవ్ వెలిగించి పొయ్యి మీదే పెట్టాలి.

3 / 5

మధ్యలో మూత తీసి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి స్టవ్ మీదే 15 నిముషాల ఉంచండి.

మధ్యలో మూత తీసి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి స్టవ్ మీదే 15 నిముషాల ఉంచండి.

4 / 5

చేపలు ఉడికిన తర్వాత  ఉడకపెట్టిన గోంగూరను వేసి 10 నిముషాల పాటు మగ్గనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసి మీడియం మంటపై ఉంచి  దించేయండి. అంతే, వేడి వేడి గోంగూర చేపల పులుసు రెడీ.

చేపలు ఉడికిన తర్వాత ఉడకపెట్టిన గోంగూరను వేసి 10 నిముషాల పాటు మగ్గనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసి మీడియం మంటపై ఉంచి దించేయండి. అంతే, వేడి వేడి గోంగూర చేపల పులుసు రెడీ.

5 / 5
Follow Us