AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాభవం.. అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు చారిత్రాత్మక పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఘోర ఓటమి క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేయగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీంతో అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైన బోర్డు పెద్దలు, జట్టులో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు.

Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 12:59 PM

Share
2026 టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన తర్వాత భారత జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లు, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మూడు మ్యాచ్‌లు.. ఇలా వరుసగా ఐదు పోరాటాల్లో కనీసం ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేక చతికిలపడింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో కేవలం 76 పరుగులకే కుప్పకూలి, 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడటం భారత క్రికెట్ చరిత్రలోనే ఒక చేరని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఘోర వైఫల్యంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ల వ్యూహాలపై బోర్డు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

2026 టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన తర్వాత భారత జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లు, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మూడు మ్యాచ్‌లు.. ఇలా వరుసగా ఐదు పోరాటాల్లో కనీసం ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేక చతికిలపడింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో కేవలం 76 పరుగులకే కుప్పకూలి, 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడటం భారత క్రికెట్ చరిత్రలోనే ఒక చేరని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఘోర వైఫల్యంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ల వ్యూహాలపై బోర్డు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

1 / 7
అర్ధరాత్రి బీసీసీఐ అత్యవసర సమావేశం.. గంభీర్, అయ్యర్‌లపై ప్రశ్నల వర్షం: మూడో టీ20లో పరాభవం ఎదురైన వెంటనే, బీసీసీఐ ఉన్నతాధికారులు అర్ధరాత్రి ఆన్‌లైన్ ay అత్యవసరంగా సమావేశమయ్యారు. జట్టును మళ్లీ విజయాల బాట పట్టించడం ఎలా అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచకప్ లాంటి ఒత్తిడితో కూడిన టోర్నీలో అద్భుతంగా రాణించి, భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌ను అసలు జట్టు నుంచి ఎందుకు పక్కన పెట్టారంటూ బోర్డు నిర్వాహకులు సెలెక్టర్లను గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం.

అర్ధరాత్రి బీసీసీఐ అత్యవసర సమావేశం.. గంభీర్, అయ్యర్‌లపై ప్రశ్నల వర్షం: మూడో టీ20లో పరాభవం ఎదురైన వెంటనే, బీసీసీఐ ఉన్నతాధికారులు అర్ధరాత్రి ఆన్‌లైన్ ay అత్యవసరంగా సమావేశమయ్యారు. జట్టును మళ్లీ విజయాల బాట పట్టించడం ఎలా అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచకప్ లాంటి ఒత్తిడితో కూడిన టోర్నీలో అద్భుతంగా రాణించి, భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌ను అసలు జట్టు నుంచి ఎందుకు పక్కన పెట్టారంటూ బోర్డు నిర్వాహకులు సెలెక్టర్లను గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం.

2 / 7
దీంతో పాటు, ప్రస్తుత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు కనీసం సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నారని, కేవలం భారీ షాట్లకే పరిమితమవుతున్నారని విమర్శలు వచ్చాయి. అలాగే జట్టులో శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లంతా ఎడమచేతి వాటం వారే కావడం కూడా జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోందని బోర్డు అభిప్రాయపడింది.

దీంతో పాటు, ప్రస్తుత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు కనీసం సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నారని, కేవలం భారీ షాట్లకే పరిమితమవుతున్నారని విమర్శలు వచ్చాయి. అలాగే జట్టులో శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లంతా ఎడమచేతి వాటం వారే కావడం కూడా జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోందని బోర్డు అభిప్రాయపడింది.

3 / 7
వన్ డౌన్ స్థానంలో సంజూ శాంసన్.. ఇకపై జట్టులో శాశ్వత చోటు..: ఈ అర్ధరాత్రి చర్చల అనంతరం బీసీసీఐ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. సంజూ శాంసన్‌కు ఇకపై టీ20 తుది జట్టులో (ప్లేయింగ్ 11) నిరంతరం అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మూడో స్థానం (వన్ డౌన్) నుంచి ఇషాన్ కిషన్‌ను తప్పించి, ఆ స్థానంలో సంజూ శాంసన్‌ను బరిలోకి దించనున్నారు. శాంసన్ పిచ్ పరిస్థితిని బట్టి అటు క్లాస్ ఇన్నింగ్స్, ఇటు మాస్ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు. అంతేకాకుండా, అతడి రాకతో బ్యాటింగ్ ఆర్డర్‌లో కుడి, ఎడమచేతి వాటం కలయిక (రైట్-లెఫ్ట్ కాంబినేషన్) కుదురుతుందని బీసీసీఐ భావిస్తోంది.

వన్ డౌన్ స్థానంలో సంజూ శాంసన్.. ఇకపై జట్టులో శాశ్వత చోటు..: ఈ అర్ధరాత్రి చర్చల అనంతరం బీసీసీఐ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. సంజూ శాంసన్‌కు ఇకపై టీ20 తుది జట్టులో (ప్లేయింగ్ 11) నిరంతరం అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మూడో స్థానం (వన్ డౌన్) నుంచి ఇషాన్ కిషన్‌ను తప్పించి, ఆ స్థానంలో సంజూ శాంసన్‌ను బరిలోకి దించనున్నారు. శాంసన్ పిచ్ పరిస్థితిని బట్టి అటు క్లాస్ ఇన్నింగ్స్, ఇటు మాస్ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు. అంతేకాకుండా, అతడి రాకతో బ్యాటింగ్ ఆర్డర్‌లో కుడి, ఎడమచేతి వాటం కలయిక (రైట్-లెఫ్ట్ కాంబినేషన్) కుదురుతుందని బీసీసీఐ భావిస్తోంది.

4 / 7
బౌలర్ల వైఫల్యంపై ఆగ్రహం.. కోచ్, కెప్టెన్ల అధికారాలకు కత్తెర..: ప్రస్తుతం జట్టులో ప్రధాన బౌలర్లుగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ప్రత్యర్థి బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. పరుగులను నియంత్రించడంలో, వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసిన వెంటనే బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

బౌలర్ల వైఫల్యంపై ఆగ్రహం.. కోచ్, కెప్టెన్ల అధికారాలకు కత్తెర..: ప్రస్తుతం జట్టులో ప్రధాన బౌలర్లుగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ప్రత్యర్థి బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. పరుగులను నియంత్రించడంలో, వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసిన వెంటనే బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

5 / 7
అన్నింటికంటే ముఖ్యంగా, ఇకపై టీ20 జట్టు ఎంపికలో ప్రధాన కోచ్, కెప్టెన్ల జోక్యం అస్సలు ఉండకూడదని బీసీసీఐ కరాఖండిగా తేల్చిచెప్పింది. జట్టు ఎంపికపై పూర్తి అధికారం కేవలం సెలెక్షన్ కమిటీకే ఉంటుందని స్పష్టం చేసింది. కేవలం యువ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తూ సమర్థులైన సీనియర్లను విస్మరించవద్దని సెలెక్టర్లకు సూచించింది. ఇప్పటికే టెస్టు జట్టులో కేవలం యువకులకే అవకాశాలిచ్చి జట్టును బలహీనపరిచామని, ఇప్పుడు టీ20 జట్టు విషయంలోనూ అదే తప్పును పునరావృతం చేయనివ్వబోమని బోర్డు గట్టిగా ప్రకటించింది.

అన్నింటికంటే ముఖ్యంగా, ఇకపై టీ20 జట్టు ఎంపికలో ప్రధాన కోచ్, కెప్టెన్ల జోక్యం అస్సలు ఉండకూడదని బీసీసీఐ కరాఖండిగా తేల్చిచెప్పింది. జట్టు ఎంపికపై పూర్తి అధికారం కేవలం సెలెక్షన్ కమిటీకే ఉంటుందని స్పష్టం చేసింది. కేవలం యువ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తూ సమర్థులైన సీనియర్లను విస్మరించవద్దని సెలెక్టర్లకు సూచించింది. ఇప్పటికే టెస్టు జట్టులో కేవలం యువకులకే అవకాశాలిచ్చి జట్టును బలహీనపరిచామని, ఇప్పుడు టీ20 జట్టు విషయంలోనూ అదే తప్పును పునరావృతం చేయనివ్వబోమని బోర్డు గట్టిగా ప్రకటించింది.

6 / 7
భారత టీ20 జట్టులో రాబోయే రోజుల్లో పెను మార్పులు ఖాయమని బీసీసీఐ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. సంజూ శాంసన్‌కు దక్కిన ఈ కొత్త బాధ్యత జట్టులో ఎలాంటి సానుకూల మార్పులు తెస్తుందో, అలాగే కోచ్, కెప్టెన్ల ప్రమేయం లేని సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు భారత క్రికెట్‌ను మళ్లీ ఏ మేరకు అగ్రపథాన నిలుపుతాయో వేచి చూడాలి.

భారత టీ20 జట్టులో రాబోయే రోజుల్లో పెను మార్పులు ఖాయమని బీసీసీఐ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. సంజూ శాంసన్‌కు దక్కిన ఈ కొత్త బాధ్యత జట్టులో ఎలాంటి సానుకూల మార్పులు తెస్తుందో, అలాగే కోచ్, కెప్టెన్ల ప్రమేయం లేని సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు భారత క్రికెట్‌ను మళ్లీ ఏ మేరకు అగ్రపథాన నిలుపుతాయో వేచి చూడాలి.

7 / 7
Follow Us
అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?
అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?
పేదోళ్ల ఇంట్లో ఈ వంటకానికే మొదటి స్థానం.. ఒక్క ముద్ద తింటే చాలు
పేదోళ్ల ఇంట్లో ఈ వంటకానికే మొదటి స్థానం.. ఒక్క ముద్ద తింటే చాలు
నెట్టింట గత్తరలేపుతున్న మొగలిరేకులు సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..
నెట్టింట గత్తరలేపుతున్న మొగలిరేకులు సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..
ఎగ్ రైస్ ఇలా చేస్తే భలే రుచిగా ఉంటుంది..
ఎగ్ రైస్ ఇలా చేస్తే భలే రుచిగా ఉంటుంది..
WhatsAppలో నకిలీ వాటర్ బిల్లు మెసేజ్.. ఒక్క క్లిక్‌తో 4 లక్షలు..
WhatsAppలో నకిలీ వాటర్ బిల్లు మెసేజ్.. ఒక్క క్లిక్‌తో 4 లక్షలు..
ఎనర్జీ డ్రింక్స్‌పై తాగే వారికి హెచ్చరిక!డార్క్ రియాలిటీ తెలిస్తే
ఎనర్జీ డ్రింక్స్‌పై తాగే వారికి హెచ్చరిక!డార్క్ రియాలిటీ తెలిస్తే
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌
వర్షాకాలంలో స్పైసీ స్నాక్.. చెట్టినాడ్ స్టైల్ రొయ్యల ఫ్రై
వర్షాకాలంలో స్పైసీ స్నాక్.. చెట్టినాడ్ స్టైల్ రొయ్యల ఫ్రై