AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిపబ్లిక్ డే 2026

రిపబ్లిక్ డే 2026

భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. బ్రిటీష్ పాలనతో పూర్తి తెగతెంపులు చేసుకుంటూ.. నాటి నుంచే భారత్ స్వతంత్ర గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రతి యేటా ఆ రోజున రిపబ్లిక్ డే‌గా యావత్ దేశం వేడుకలు జరుపుకుంటుంది. దేశ విజయ గాథలను స్మరించుకుంటూ.. నూతన ఉత్తేజంతో కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయించేందుకు దేశ పౌరులకు రిపబ్లిక్ డే పండుగ ప్రేరణగా నిలుస్తోంది. దేశానికి సంబంధించి మూడు జాతీయ సెలవు దినాల్లో ఇది కూడా ఒకటి. భారత స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2)ని కూడా జాతీయ సెలవు దినాలుగా జరుపుకుంటున్నాం. ప్రజలను మమేకం చేస్తూ రిపబ్లిక్ డే వేడుకలను కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి.

76వ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని రాజ్‌పథ్‌ దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జాతీయ పతాకను ఎగురవేస్తారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ అతిథులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే పరేడ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశ త్రివిధ దళాలు తమ శక్తిసామర్థ్యాలు, ఆయుధ సంపత్తిని పరోడ్‌లో ప్రదర్శిస్తాయి. భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వానికి ఈ పరేడ్ అద్దంపడుతుంది. పరేడ్‌లో పాల్గొనే వివిధ రాష్ట్రాల కళాకారులు, శకటాలు తమ సాంస్కృతిక వైభవాన్ని చాటుతాయి. రిపబ్లిక్ సందర్భంగా పలు పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించేలా వ్యాస రచన వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. రిపబ్లిక్ డే రోజున దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించిన వారికి, వివిధ రంగాల్లో సేవలందించిన వారికి రాష్ట్రపతి పద్మా అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.

2007లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్, 2015లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. 2024 రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సారి(2025) దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరవుతారు. పరేడ్ వేడుకల్లో దేశ నలుమూలల నుంచి 10 వేల మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొంటుండగా.. తెలంగాణ నుంచి వివిధ రంగాలకు చెందిన 41 మంది హాజరవుతారు.

ఇంకా చదవండి

లీటర్ పెట్రోల్ కేవలం రూ.50?! అసలు మ్యాటర్ తెలిస్తే ఫిదా కావాల్సిందే!

తమిళనాడులోని తంజావూరు జిల్లా ఆడుతురైలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ యజమాని అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. హెల్మెట్ ధరించి వచ్చే ద్విచక్ర వాహనదారులకు గంటపాటు లీటర్ పెట్రోల్ కేవలం ₹50కే అందించారు. సాధారణంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, ఈ ప్రత్యేక ఆఫర్ స్థానికులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. 500 మందికి పైగా ఈ చౌక పెట్రోల్ కోసం క్యూ కట్టారు.

Vizag: కడలి గర్భంలో మువ్వన్నెల పతాకం రెపరెపలు..

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగర గర్భంలో స్కూబా డైవర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేవీ మాజీ అధికారి, స్కూబా ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో 77 అడుగుల లోతులో మువ్వన్నెల జెండాను ప్రదర్శించి దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. ..

Republic Day 21 Gun Salute: గణతంత్ర వేడుకల్లో 21 గన్ సెల్యూట్ ఎందుకు చేస్తారు..? దీని వెనుక అసలు కథ ఇదే

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించే కవాతు కేవలం కనువిందు కోసం మాత్రమే కాదు.. వినడానికి కూడా ఒక అద్భుతమైన అనుభవం. రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించే ముందు పరేడ్‌లో చేసే 21 గన్‌ సెల్యూట్‌ తుపాకుల గర్జన ఒక అద్భుతమైన అనుభూతి. సరిగ్గా 'జనగణమన' జాతీయ గీతం మొదలైన మొదటి సెకనుకే మొదటి గన్ ఫైర్ అవుతుంది. జాతీయ గీతం ముగిసేసరికి సరిగ్గా 21వ రౌండ్ పూర్తవుతుంది. అసలు 21-గన్ సెల్యూట్ చరిత్ర ఏమిటో? ఇది ఎప్పటి నుంచి అనుసరిస్తున్నారో చాలా మందికి తెలియదు. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

రిపబ్లిక్ డే స్పెషల్.. మీ పిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే!

గణతంత్ర దినోత్సవం వచ్చేస్తోంది. దీంతో చాలా మంది తల్లులు తమ పిల్లలకు డిఫరెంట్‌గా, దేశ భక్తిని చాటే విధంగా టిఫిన్స్ చేసి పెట్టాలని ఆరాటపడుతుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన టిప్స్, కాగా మీరు మీ పిల్లలకు త్రివర్ణపతాకాన్ని సూచించే విధంగా టిఫిన్ చేయాలి అనుకుంటే, ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

Rupublic Day: సూర్యాస్త్ర వ్యవస్థ, భైరవ బెటాలియన్, బాక్టీరియన్ ఒంటెలు.. తొలిసారి కదం తొక్కనున్న భారత సైనిక శక్తి!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే 77వ గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి కర్తవ్య పథ్ కేవలం పరేడ్ గ్రౌండ్‌లా కాకుండా, భీకర సమరక్షేత్రంలా ముస్తాబవుతోంది! రణక్షేత్రంలో అమలు చేసే లైవ్ యాక్షన్ వ్యూహాలతో భారత సైన్యం తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపబోతోంది. ఈ గ్రాండ్ కవాతులో సుమారు 6,065 మంది సిబ్బంది పాల్గొంటారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి లెఫ్టినెంట్ జనరల్ భావ్‌నీష్ కుమార్ నాయకత్వం వహిస్తారు.

గణతంత్ర దినోత్సవ వేళ ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. భారీగా బయటపడ్డ ఆర్డీఎక్స్‌..!

పంజాబ్‌లో బబ్బర్‌ఖల్సా ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. రెండున్నర కేజీల ఆర్డీఎక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫతేగడ్‌ సాహిబ్‌లో రైల్వే ట్రాక్‌ పేల్చివేత ఘటనపై చురుగ్గా దర్యాప్తు జరుగుతోంది. ఉగ్రకదలికలతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. సింగ్‌ బోర్డర్‌లో ప్రతి వాహనాన్ని చెక్‌ చేసిన తరువాత ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. కమెండోలను కూడా మోహరించారు.

రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. అన్నదాతలకు ప్రత్యేక ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి తొలిసారి గణంతంత్ర దినోత్సవ వేడుకలకు వేదిక అయ్యింది. అమరావతి వైభవాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీన నేలపాడులోని హైకోర్టు భవనంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరిపేందుకు రెడీ అయ్యింది. రాజధానిలో జరగబోయే ఈ వేడుకల కోసం శరవేగంగా ఏర్పాట్లు కొసాగుతున్నాయి.

Republic Day 2026: లోకల్ టు గ్లోబల్.. రిపబ్లిక్ డే వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా బిహార్ మఖానా..

భారత గణతంత్ర వేడుకలకు వేదికైన 'కర్తవ్య పథ్' ఈ ఏడాది ఒక ప్రత్యేకమైన వ్యవసాయ అద్భుతాన్ని సాక్షాత్కరించబోతోంది. బీహార్ రాష్ట్రానికి గర్వకారణమైన, ప్రపంచవ్యాప్తంగా 'సూపర్‌ఫుడ్'గా గుర్తింపు పొందిన 'మఖానా' (Makhana) ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బీహార్ ప్రభుత్వం ఈ ఏడాది తన అధికారిక శకటం కోసం 'మఖానా'ను థీమ్‌గా ఎంచుకుంది. స్థానిక మార్కెట్ల నుండి అంతర్జాతీయ స్థాయికి ఈ ఫాక్స్ నట్స్ ఎలా ఎదిగాయో ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశ్యం.

  • Bhavani
  • Updated on: Jan 23, 2026
  • 5:59 pm

Republic Day-2026: ఈసారి అద్వితీయంగా రిపబ్లిక్‌ వేడుకలు.. సైనిక పరేడ్ కాదు.. ప్రత్యక్ష యుద్ధ రంగం!

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబవుతోంది. ఈసారి కర్తవ్య పథ్ కేవలం పరేడ్ గ్రౌండ్‌లా కాకుండా, భీకర సమరక్షేత్రంలా ముస్తాబవుతోంది! రణక్షేత్రంలో అమలు చేసే లైవ్ యాక్షన్ వ్యూహాలతో భారత సైన్యం తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపబోతోంది.

Republic Day 2026: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం థీమ్ ఇదే.. ముఖ్య అతిథులు, పూర్తి వివరాలు ఇవే!

Republic Day 2026: ఈ ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకలు ప్రత్యేకంగా ఉండనున్నాయి. ఎన్నో థీమ్స్‌, కవాతులుతో వేడుకలు ప్రత్యేకం కానున్నాయి. తొలిసారిగా భారత సైన్యం కవాతు సందర్భంగా బ్యాటిల్ అర్రే ఫార్మేషన్‌ను ప్రదర్శిస్తుంది. సైనిక ప్రదర్శనలో కవాతు బృందాలు, యాంత్రిక స్తంభాలు, ఆధునిక ఆయుధ వ్యవస్థలు, డ్రోన్‌లు, ట్యాంకులు

Republic Day: పనీర్ టిక్కా నుండి ముఫ్ఫిన్స్ వరకు.. రిపబ్లిక్ డే రోజున పిల్లలు మెచ్చే వెరైటీలు ఇవే!

భారత గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పరేడ్లు, జెండా వందనాలే కాదు, మన దేశం పట్ల మనకున్న ప్రేమను చాటుకునే ఒక గొప్ప సందర్భం. ఈ వేడుకను మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి మీ డైనింగ్ టేబుల్‌పై త్రివర్ణ శోభను తీసుకురావాలని అనుకుంటున్నారా? జెండాలోని మూడు రంగుల స్ఫూర్తితో తయారయ్యే ఈ వంటకాలు కేవలం చూడటానికే కాదు, తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఎటువంటి కృత్రిమ రంగులు వాడకుండా, ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో చేసే ఈ 7 రెసిపీలు పండుగ వాతావరణాన్ని మీ ఇంట్లోకి తెస్తాయి.

  • Bhavani
  • Updated on: Jan 21, 2026
  • 7:50 pm

దేశ చరిత్రలోనే తొలిసారి.. పురుషుల CRPF బృందానికి సారధిగా శివంగి..!

రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఆర్డీ ప‌రేడ్‌లో సీఆరీపీఎఫ్ మార్చింగ్ బృందానికి సిమ్ర‌న్ బాలా క‌మాండెంట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అంతక ముందు జరిగిన ఆర్డీ ప‌రేడ్ లో పురుషుల బృందాల‌కు సీఆర్పీఎఫ్ మ‌హిళా ఆఫీస‌ర్లలో ఎంతో మంది క‌మాండ్ చేశారు.