Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిపబ్లిక్ డే 2025

రిపబ్లిక్ డే 2025

భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. బ్రిటీష్ పాలనతో పూర్తి తెగతెంపులు చేసుకుంటూ.. నాటి నుంచే భారత్ స్వతంత్ర గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రతి యేటా ఆ రోజున రిపబ్లిక్ డే‌గా యావత్ దేశం వేడుకలు జరుపుకుంటుంది. దేశ విజయ గాథలను స్మరించుకుంటూ.. నూతన ఉత్తేజంతో కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయించేందుకు దేశ పౌరులకు రిపబ్లిక్ డే పండుగ ప్రేరణగా నిలుస్తోంది. దేశానికి సంబంధించి మూడు జాతీయ సెలవు దినాల్లో ఇది కూడా ఒకటి. భారత స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2)ని కూడా జాతీయ సెలవు దినాలుగా జరుపుకుంటున్నాం. ప్రజలను మమేకం చేస్తూ రిపబ్లిక్ డే వేడుకలను కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి.

76వ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని రాజ్‌పథ్‌ దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జాతీయ పతాకను ఎగురవేస్తారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ అతిథులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే పరేడ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశ త్రివిధ దళాలు తమ శక్తిసామర్థ్యాలు, ఆయుధ సంపత్తిని పరోడ్‌లో ప్రదర్శిస్తాయి. భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వానికి ఈ పరేడ్ అద్దంపడుతుంది. పరేడ్‌లో పాల్గొనే వివిధ రాష్ట్రాల కళాకారులు, శకటాలు తమ సాంస్కృతిక వైభవాన్ని చాటుతాయి. రిపబ్లిక్ సందర్భంగా పలు పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించేలా వ్యాస రచన వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. రిపబ్లిక్ డే రోజున దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించిన వారికి, వివిధ రంగాల్లో సేవలందించిన వారికి రాష్ట్రపతి పద్మా అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.

2007లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్, 2015లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. 2024 రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సారి(2025) దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరవుతారు. పరేడ్ వేడుకల్లో దేశ నలుమూలల నుంచి 10 వేల మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొంటుండగా.. తెలంగాణ నుంచి వివిధ రంగాలకు చెందిన 41 మంది హాజరవుతారు.

ఇంకా చదవండి

Andhra Pradesh: రాజమండ్రి కంబాల చెరువు వద్ద గణతంత్ర వేడుకలు.. కళ్లు చెదిరిపోయేలా కంబాల చెరువు వద్ద ఏర్పాట్లు..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాల చెరువు వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. రాజమండ్రి కంబాల చెరువు వద్ద వినూత్న రీతిలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. స్థానిక సర్పం గాంధీ బొమ్మ వద్ద 76 జాతీయ జెండాలను చిన్నారులతో ఎగురవేయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఐరన్ రూపులతో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు.స్థానిక మహా సందేశ్ సంస్థ ట్రస్ట్ చైర్మన్..

Republic Day 2025: ఊరూ, వాడా గణతంత్ర వేడుకలు.. అబ్బురపరిచే రీతిలో త్రివర్ణ పతాక రెపరెపలు..

అటు,ఆంధ్రప్రదేశ్‌లోనూ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ గ్రౌండ్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ పలువురు పాల్గొన్నారు.

మారిన కాశ్మీరం.. పుల్వామా త్రాల్‌ చౌక్ వద్ద తొలిసారిగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని త్రాల్ చౌక్‌లో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా భారత జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ త్రివర్ణ పతాకాన్ని ఒక వృద్దుడు, ఒక యువకుడు, ఒక చిన్నారి సంయుక్తంగా జెండావిష్కరించారు. ఇది తరాల ఐక్యతకు, భారతదేశం పట్ల వారి నిబద్ధతకు చిహ్నంగా మారింది. జాతీయ జెండాకు వందనం చేసి భారత్ మాతా జై నినాదాలతో త్రాల్ చౌక్ ప్రాంతం మార్మోగింది.

Andhra Pradesh: రిపబ్లిక్ డే వేడుకల్లో రకరకాల పాములు.. భయపడకండి.. అసలు కథ వేరే!

పాడేరు తలారి సింగి గిరిజన సంక్షేమ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా కలెక్టర్ దినేష్ కుమార్ హాజరయ్యారు. ఎస్పీ అమిత్ బర్దర్ కూడా పాల్గొన్నారు. పరేడ్ ఘనంగా జరిగింది. శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అటారి బోర్డర్‌లో ఘనంగా బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం.. ఆకట్టుకున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కవాతు

దేశవ్యాప్తంగా రిపబ్లిక్‌ డే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పంజాబ్‌ లోని అటారి సరిహద్దులో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. దేశభక్తి గీతాలతో అటారి సరిహద్దు దద్దరిల్లింది. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కవాతు ఆకట్టుకుంది. భారత్‌ , పాక్‌ జవాన్లు పోటాపోటీగా విన్యాసాలు చేశారు.

రిపబ్లిక్‌డే స్పెషల్.. రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధ బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం రోహిణీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన దేవనార్‌ అంధుల పాఠశాలకు చెందిన పలువురు బాలికలు పెద్ద ఎత్తున ఈ టీకా డ్రైవ్ లో పాల్గొన్నారు

Republic Day 2025: కర్తవ్యపథ్‌లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు..

ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. జెండా ఆవిష్కరించిన గవర్నర్!

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి పల్లెలోని పాఠశాలలు, ఆఫీసులన్నీ త్రివర్ణపతాకాలతో కలగా మెరిసిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఏపీలో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జనవరి 26న జెండా ఆవిష్కరణకు.. ఆగస్ట్ 15న జెండా ఎగరేయడంలో తేడా ఏంటో తెలుసా..?

భారతదేశంలో రెండు ప్రధాన జాతీయ పండుగలు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈ రెండు జాతీయ పండుగ రోజుల్లో జెండా ఎగరవేసే విధానం, ఆవిష్కరణ మధ్య తేడా ఉంది. ఈ తేడాలు దేశ స్వాతంత్య్రం, గణతంత్రం ప్రత్యేకతను ప్రతిబింబిస్తాయి. త్రివర్ణ పతాకం గర్వానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఆ తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Republic Day-2025: 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాధ్యక్షులు

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రబోవో సుబియాంటో భారతదేశానికి తన మొదటి రాష్ట్ర పర్యటనలో ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు.