అటారి బోర్డర్‌లో ఘనంగా బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం.. ఆకట్టుకున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కవాతు

అటారి బోర్డర్‌లో ఘనంగా బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం.. ఆకట్టుకున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కవాతు

Balaraju Goud

|

Updated on: Jan 26, 2025 | 8:17 PM

దేశవ్యాప్తంగా రిపబ్లిక్‌ డే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పంజాబ్‌ లోని అటారి సరిహద్దులో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. దేశభక్తి గీతాలతో అటారి సరిహద్దు దద్దరిల్లింది. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కవాతు ఆకట్టుకుంది. భారత్‌ , పాక్‌ జవాన్లు పోటాపోటీగా విన్యాసాలు చేశారు.

దేశవ్యాప్తంగా రిపబ్లిక్‌ డే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పంజాబ్‌ లోని అటారి సరిహద్దులో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. దేశభక్తి గీతాలతో అటారి సరిహద్దు దద్దరిల్లింది. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కవాతు ఆకట్టుకుంది. ప్రతి రోజు వాఘా -అటారి సరిహద్దులో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం జరుగుతోంది. 1959 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే రిపబ్లిక్‌ డే నాడు జరిగే బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పర్యాటకులు, స్థానికులు బీఎస్ఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువకులు, ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు అట్టారీ వాఘా సరిహద్దులో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మిలటరీ డాగ్ కూడా పాల్గొంది. బీటింగ్ రిట్రీట్ మొదటిసారిగా 1959లో అట్టారీ-వాఘా సరిహద్దులో నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుండి ఇది బాగా ప్రాచుర్యం పొందింది. బీటింగ్ రిట్రీట్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలి వచ్చారు. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jan 26, 2025 05:40 PM