AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపబోతుందా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా సాగిస్తున్న వార్‌ఎఫెక్ట్ మన దేశంపై కూడా ఎక్కువగానే పడే సూచనలు కనిపిస్తున్నాయి. చమురు ఒక్కటే కాదు.. ఇతర నిత్యావసరాలు సైతం కూడా ఖరీదయ్యే అవకాశం ఉంది. భారీగానే ఐటీ రాజధాని బెంగళూరులో డ్రై ఫ్రూట్స్ సరఫరాలో సమస్య ఏర్పడే అవకాశం ఉంది. దీని ఫలితంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నగరానికి వచ్చే డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా అంజూర, పిస్తాపప్పులు ఖర్జూరాలు ఇరాన్ నుండి దిగుమతి అవుతాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఖర్జూరాలకు అధిక డిమాండ్ ఉంటుందని, ప్రస్తుతం వాటి స్టాక్ ఉందని వ్యాపారులు తెలిపారు.

Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
Dry Fruit Price Hike
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2026 | 10:54 AM

Share

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదం (ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం) బెంగళూరుపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అక్కడ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సరఫరా సమస్య కూడా ఉండవచ్చని స్థానిక వ్యాపారులు చెప్పారు. నగరానికి దిగుమతి చేసుకునే డ్రై ఫ్రూట్స్ పెద్ద మొత్తంలో ఇరాన్ నుండి వస్తాయి. అంజూర పండ్లతో పాటు, మమ్రా బాదం, పిస్తాపప్పులు, పైన్ గింజలు, మజాఫతి ఖర్జూరాలకు ముఖ్యంగా అధిక డిమాండ్ ఉంది. రంజాన్ సందర్భంగా మజాఫతి ఖర్జూరాలకు అధిక డిమాండ్ ఉంటుందని వారు తెలిపారు.

మజాఫతి ఖర్జూరాలు సాధారణంగా కిలోకు దాదాపు రూ.300కి అమ్ముడవుతాయి. రంజాన్ సందర్భంగా వాటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారని రస్సెల్ మార్కెట్ పండ్లు, డ్రై ఫ్రూట్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఇద్రిస్ చౌదరి చెప్పారని ప్రముఖ వార్త పత్రిక నివేదించింది.

రాబోయే రంజాన్ దృష్ట్యా, నగరంలోని చాలా మంది వ్యాపారులు ఇప్పటికే డ్రై ఫ్రూట్స్‌ను నిల్వ చేసుకున్నారు. పండుగ సమయంలో అమ్మకాలు పెరిగేకొద్దీ మేము ముందుగానే డ్రై ఫ్రూట్స్‌ను నిల్వ చేసుకుంటాము. కాబట్టి ఈద్ వరకు ఎటువంటి కొరత ఉండదు. అయితే, యుద్ధ పరిస్థితి కొనసాగితే, సమస్య తరువాత తీవ్రంగా మారవచ్చని నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే బెంగళూరులోని కొంతమంది వ్యాపారులు ఇప్పటికే ధరలను పెంచారు. పిస్తాపప్పుల ధర ఇప్పటికే దాదాపు రూ.200 పెరిగింది. శివాజీనగర్‌లోని కెహెచ్ ఫ్రూట్ షాప్ యజమాని అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ, అధిక డిమాండ్, తక్కువ స్టాక్ కారణంగా ధరను పెంచాల్సి వచ్చిందని కూడా నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న పిస్తాపప్పులు బెంగళూరు మార్కెట్లో కిలో రూ.1,800 నుండి రూ.2,100 వరకు అమ్ముడవుతున్నాయి. అంజీర్ పండ్లు దాదాపు రూ.1,600, మమ్రా బాదం రూ.2,500, పైన్ గింజలు రూ.8,000లకు అమ్ముడవుతున్నాయి.

ఇకపోతే, ఇరానియన్ కుంకుమ పువ్వుకు కూడా భారీ డిమాండ్ ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ కుంకుమ పువ్వు రకంగా పరిగణించబడే ఇరానియన్ కుంకుమ పువ్వు ధర ప్రస్తుతం కిలోకు రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఉంది. రాబోయే రెండు వారాల్లో ఇది రూ.4 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

డ్రై ఫ్రూట్స్‌తో పాటు జాజికాయ, దాల్చిన చెక్క, స్టార్ సోంపు వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా ఇరాన్ నుంచి దిగుమతి అవుతాయి. ఇరాన్‌లో వాణిజ్యం, ఓడరేవు కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడితే, అది ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే వస్తువులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

మొత్తం మీద, ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం బెంగళూరులోని డ్రై ఫ్రూట్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే వారాల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‏లో నాగార్జున, బాలకృష్ణ.. అత
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‏లో నాగార్జున, బాలకృష్ణ.. అత
తగ్గేదేలే.. కప్ప పామును వేటాడితే ఎట్టా ఉంటదో తెలుసా..?
తగ్గేదేలే.. కప్ప పామును వేటాడితే ఎట్టా ఉంటదో తెలుసా..?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'ఫంకీ'..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'ఫంకీ'..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా..?
హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా..?