AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్.షర్మిలకు వైద్య పరీక్షలు..ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎమన్నారంటే..

తన పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అనుమతివ్వాలని కోరుతూ.. తన పార్టీ కార్యాలయం లోటస్ పాండ్‌లో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు వైద్య పరీక్షలు..

Telangana: ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్.షర్మిలకు వైద్య పరీక్షలు..ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎమన్నారంటే..
Ys Sharmila
Amarnadh Daneti
|

Updated on: Dec 10, 2022 | 6:30 PM

Share

తన పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అనుమతివ్వాలని కోరుతూ.. తన పార్టీ కార్యాలయం లోటస్ పాండ్‌లో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు పలు పరీక్షలు చేసిన తర్వాత ఆమె ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. వైఎస్.షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని తెలిపారు. లాక్టెట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా లెవెల్స్ ,బీపీ లెవెల్స్ పడిపోతున్నాయని వైద్యులు తెలిపారు. గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గాయని పేర్కొన్నారు. 30 గంటలుగా ఆమె మంచి నీళ్ళు సైతం తీసుకోవడం లేదని, దీంతో బాగా నీరసించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఆమె ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తన పాదయాత్రకు అనుమతిచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు.

షర్మిల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వైద్యుల సూచన మేరకు ఏ సమయంలోనైనా పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి.. ఆమెను ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..